ఇంట్లో ఉండే ఈ 3 పదార్థాలతో “లివర్” ని వెంటనే శుభ్రం చేసుకోండి…ఒక గ్లాసు తాగితే చాలు.!

ఇంట్లో ఉండే ఈ 3 పదార్థాలతో “లివర్” ని వెంటనే శుభ్రం చేసుకోండి…ఒక గ్లాసు తాగితే చాలు.!

by Mohana Priya

Ads

చాలామందికి కాలేయ సంబంధిత సమస్యలు వస్తూనే ఉంటాయి. డయాబెటిస్ కానీ లేదా యూటిఐ ఇన్ఫెక్షన్స్, లేదా కడుపు నొప్పి లాంటి ఇబ్బందులు తరచుగా ఎదుర్కొంటూనే ఉంటారు. అలా సమస్యలు రావడానికి కారణం ఏంటి అంటే కాలేయం సరిగ్గా ఫంక్షన్ అవ్వకపోవడం.

Video Advertisement

మనం తినే వాటి వల్ల కానీ లేదా ఇంకేదైనా కారణంగా కానీ కాలేయం లో టాక్సిన్స్ (వ్యర్థపదార్థాలు)  పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాలేయం ప్యూరిఫై చేయడానికి ఇప్పుడు చెప్పబోయే సూచనని పాటించండి.

దీనికి మన ఇంట్లో వాడే పదార్థాలు చాలు. ముందుగా కొంచెం కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర లో శరీరంలోని వ్యర్థపదార్థాలను తొలగించే గుణం ఉంటుంది. అందుకే దాదాపు అన్నిట్లో ముఖ్యంగా చారు, రసం లో కొత్తిమీర ను తప్పనిసరిగా వాడతారు.

కొంచెం పసుపు తీసుకోండి. పసుపు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. పసుపులో యాంటీబయోటిక్ గుణాలు మెండుగా ఉంటాయి. అందుకే దెబ్బ తగిలితే వెంటనే గాయానికి పసుపు రాస్తారు. ఎందుకంటే పసుపులో ఉన్న యాంటీబయోటిక్ గుణాలు దెబ్బ తగిలిన చోట ఇన్ఫెక్షన్ అవ్వకుండా కాపాడతాయి. అంతేకాకుండా పసుపు వల్ల శరీరంలో ఉన్న ట్యూమర్, అల్సర్స్, ఇన్ఫెక్షన్స్ కూడా నయం అవుతాయి. అందుకే ఆహార పదార్థాల్లో పసుపుని కచ్చితంగా వాడతారు.

తర్వాత కొన్ని కిస్మిస్ తీసుకోండి. కిస్మిస్ లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. అంతేకాకుండా కిస్మిస్ తీసుకుంటే రక్తహీనత తగ్గి శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది. కిస్మిస్ లో ఉన్న విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని శుభ్రంగా కడిగిన కొత్తిమీర, పసుపు, కిస్మిస్ వేసి మరగబెట్టండి. తర్వాత ఆ నీటిని జల్లెడతో వేరు చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తాగండి. ఇలా తరచుగా తీసుకుంటే శరీరం లోని టాక్సిన్స్  బయటికివెళ్లడం తో పాటు కాలేయ సంబంధిత వ్యాధులు రావట.


End of Article

You may also like