• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

కంటి చూపు మందగిస్తోందా..ఈ ట్రిక్స్ కంటిచూపు చాలా మెరుగుపడుతుంది

Published on April 26, 2020 by Megha Varna

భ‌గ‌వంతుడు మ‌న‌కు ప్ర‌సాదించిన ఓ వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే క‌ళ్ల‌తో మ‌నం ఈ సృష్టిని చూస్తున్నాం. ఎన్నో విష‌యాల‌ను తెలుసుకోగ‌లుగుతున్నాం.చిన్నా పెద్దా తేడా లేకుండా ఇటీవల అందరికీ కంటి సమస్య వస్తోంది. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో చూపు మందగిస్తోంది. దీనికి కారణం సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం. ఏదైనా జబ్బు వస్తే మందు వేసుకుని ఉపశమనం పొందుతాము. కానీ కంటి చూపు సమస్య అలాంటిది కాదు. సరైన ఆహారం తీసుకుంటే కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. మంచి చూపు కావాల‌న్నా కింద ఇచ్చిన కొన్ని టిప్స్ పాటించండి.

Keep Your Eyes Healthy

Keep Your Eyes Healthy

  • 100 గ్రాముల బాదం ప‌ప్పు, 100 గ్రాముల సోంపు, 100 గ్రాముల చ‌క్కెర‌, అన్నింటినీ క‌లిపి మెత్తని పౌడ‌ర్‌లా చేయాలి. ఈ పొడిని 2 టీస్పూన్ల మోతాదులో ఒక గ్లాస్ వేడి పాల‌లో క‌లిపి ప్ర‌తి రోజు రాత్రి పూట నిద్రించే ముందు తాగాలి. దీంతో దృష్టి సంబంధ స‌మ‌స్య‌లో పోతాయి. కంటి చూపు మెరుగు ప‌డుతుంది.
  • 8 నుంచి 10 బాదం పప్పుల‌ను తీసుకుని రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యం ఆ బాదంప‌ప్పు పొట్టును తీసివేయాలి. అనంత‌రం వాటిని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాల‌లో క‌లిపి ఉద‌యాన్నే తాగాలి. ఒక‌టి, రెండు నెల‌ల పాటు ఇలా తాగితే చూపు బాగా వ‌స్తుంది. కంటి స‌మ‌స్య‌లు పోతాయి.
  • 6 నుంచి 8 పచ్చి ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిలోంచి విత్త‌నాల‌ను వేరు చేసి ఆ కాయ‌ల‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఆ ముక్క‌ల‌ను మిక్సీలో వేసి మిశ్ర‌మంగా చేశాక దాన్నుంచి జ్యూస్‌ను తీయాలి. ఈ జ్యూస్‌ను తేనెతో క‌లిపి నిత్యం ఉద‌యాన్నే తాగాలి. దీని వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా వ‌స్తుంది.
  • అర‌కిలో వాల్‌న‌ట్స్‌, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల క‌ల‌బంద గుజ్జు లేదా జ్యూస్‌, 4 నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకోవాలి. నిమ్మ‌కాయ‌ల‌ను పిండి వాటి నుంచి ర‌సం తీసి దాన్ని మిగిలిన ప‌దార్థాల‌కు బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్‌కు ముందు ఈ మిశ్ర‌మాన్ని సేవిస్తుంటే క్ర‌మంగా కంటి చూపు మెరుగ‌వుతుంది. 6 నెల‌ల గ‌ర్భం దాటిన మ‌హిళ‌లు, కిడ్నీలు, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దీన్ని తీసుకోకూడ‌దు.
  • విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే యాపిల్‌, క్యారెట్‌, పాల‌కూర వంటి ఆహారాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటే కంటి చూపు మెరుగు ప‌డుతుంది.
  • ఉద‌యాన నిద్ర‌లేవ‌గానే చ‌ల్ల‌ని నీటితో క‌ళ్ల‌ను క‌డుక్కోవాలి. క‌ళ్లు బాగా ఒత్తిడికి గురై మంట‌లుగా ఉన్న‌ప్పుడు కూడా చ‌ల్ల‌ని నీటితో క‌డుక్కోవ‌చ్చు. లేదంటే రెండు అర‌చేతులను బాగా రుద్ది క‌ళ్ల‌పై పెట్టుకోవాలి. దీని వ‌ల్ల వేడి క‌ళ్ల‌కు తాకి కంటి న‌రాలు రిలాక్స్ అవుతాయి.
  • ఒక కొవ్వొత్తిని వెలిగించి దాన్నే త‌దేకంగా చూస్తూ నెమ్మ‌దిగా క‌ళ్లు మూసుకోవాలి. మ‌ళ్లీ నెమ్మ‌దిగా క‌ళ్లు తెర‌వాలి. ఇలా క‌నీసం 5 సార్లు చేయాలి. దీంతో స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంది.

We are hiring Content Writers. Click Here to Apply



Search

Recent Posts

  • సమంత నాగ చైతన్య మళ్ళి కలవనున్నారా? హామీ ఇస్తున్న నాగార్జున.
  • Big boss: త్వరగా ఓటింగ్ ప్రక్రియ క్లోజ్ చేయడం వెనక అసలు కారణం ఇదేనా..!
  • NTR 30 “మోషన్ పోస్టర్” పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్
  • N.T.R ని “పెళ్లికి ముందే కండిషన్” తో హద్దుల్లో పెట్టిన లక్ష్మీ ప్రణీతి…! అవేంటంటే?
  • హాస్పిటల్ ఫారమ్స్ నింపేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..! లేదంటే ఇన్సూరెన్స్ క్లైములో ఇబ్బందులే..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions