బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ యొక్క స్థాయి పెరిగింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు రాజమౌళి. ఆ చిత్రం తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత రాజమౌళి తీసిన మరో అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్. ఆ చిత్రం దేశ విదేశాల్లో సూపర్ హిట్ టాక్ తో రికార్డ్స్ కొల్లగొట్టింది. ఈ చిత్రం తో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలతో ఇండియా లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ క్రేజ్ పెరిగిపోయింది.
Video Advertisement
అయితే ఒక చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడం తో పాటు దాన్ని ప్రంపంచం మెచ్చేలా తీసిన దర్శకులకే చెల్లుతుందిఆ ఘనత. వారి ఆలోచన, ఊహలు అంత గొప్పగా ఉండబట్టే ప్రస్తుత కాలం లో చాలా పాన్ ఇండియా మూవీస్ టాలీవుడ్ నుంచి వస్తున్నాయి. అయితే ఈ క్రమం లో హీరోలతో పాటు, దర్శకుల మార్కెట్ రేంజ్ కూడా పెరుగుతోంది. దీంతో వాళ్ళు రెమ్యూనరేషన్ ని పెంచేస్తున్నారు. మన స్టార్ దర్శకులు ఎంత మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా పొందుతున్నారో ఇప్పుడు చూద్దాం..
#1 రాజమౌళి
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి. రాజమౌళి రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారు. పాన్ ఇండియా రేజ్ దర్శకుడు కాబట్టి అది అంచనా వేయడం కూడా కష్టమే. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దాదాపు రూ. 100 కోట్లకు పైగా తీసుకున్నట్టు సమాచారం.
#2 త్రివిక్రమ్ శ్రీనివాస్
టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రాజమౌళి తరహాలోనే వెళ్లుతున్నారు. అల.. వైకుంఠపురం హిట్ తరువాత రెమ్యునరేషన్ భారీగానే పెరిగింది. ఒక్కో సినిమాకు రూ.30 కోట్లతో పాటు బిజినెస్లో వాటా కూడా తీసుకుంటున్నారు త్రివిక్రమ్.
#3 సుకుమార్
రంగ స్థలం సినిమా తర్వాత సుకుమార్ తన రేటు పెంచాడు.ఒక్కో సినిమాను ఆయన ప్రస్తుతం రూ.20 కోట్లు తీసుకుంటున్నాడు.అటు లాభాల్లో వాటా కూడా అందుకుంటున్నాడు.ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కోసం తను రూ.23 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
#4 కొరటాల శివ
తాను చేసే సినిమాలకు మినిమం లాభాలు వచ్చేలా జాగ్రత్త పడతాడు కొరటాల శివ. ఆయన ఆచార్య చిత్రానికి 20 కోట్లు తీసుకున్నారు. తర్వాత చేయబోయే ఎన్టీఆర్ 30 కోసం 30 కొట్లోను తీసుకుంటున్నట్లు సమాచారం.
#5 బోయపాటి శ్రీను
వినయ విధేయ రామ వరకు మంచి ఫేమ్ లో ఉన్నాడు. అప్పటివరకు 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఫ్లోప్స్ రావడం తో రెమ్యూనరేషన్ తగ్గించాడట. ఇటీవల మళ్ళీ అఖండ విజయంతో రెమ్యూనరేషన్ పెంచేసాడు.
#6 పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్ ఒక్కో చిత్రానికి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.
#7 అనిల్ రావిపూడి
వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఒక్కో సినిమాకు 10 కోట్లు తీసుకుంటున్నారు.
#8 శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల కూడా ప్రస్తుతం టాప్ రెమ్యనరేషన్ అందుకుంటున్న దర్శకుల్లో ఒకరు. ఫిదా సినిమా బాక్సాపీస్ వద్ద మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. ఇక లవ్స్టోరీ సినిమాకు రూ.10కోట్లు తీసుకున్నారు.
#9 నాగ్ అశ్విన్
మహానటి సూపర్ కావడం తో నాగ్ అశ్విన్ సినిమాకి 8 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.
#10 పరశురామ్
మహేష్ తో తీసిన సర్కారు వారి పాట చిత్రానికి గాను పరశురామ్ 8 కోట్ల రూపాయలు తీసుకున్నారు.
#11 వి వి వినాయక్
ప్రస్తుతం సరైన హిట్స్ లేని ఈ మాస్ డైరెక్టర్ సినిమాకి 7 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
#12 వంశీ పైడిపల్లి
మినిమం గ్యారంటీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తమిళ హీరో విజయ్ తో చేసిన వరుస సినిమాకు గాను 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.