Ads
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీయల్ ద్వారా అనేక మంది ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. ప్రపంచం లోని వివిధ దేశాల ఆటగాళ్లు ఐపీయల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ టోర్నీ లో ఇప్పటి వరకు ఒకే ఒక జట్టు కప్ గెలవలేకపోయింది. అదే రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు. కెప్టెన్లు మారినా.. ఆటగాళ్లను మార్చినా ఆ జట్టు కప్ గెలవలేకపోయింది. అయితే ఐపీయల్ లో ఇప్పటి వరకు లీస్ట్ స్కోర్ కూడా ఆ జట్టుదే.
Video Advertisement
2017 లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆడిన మ్యాచ్ లో 49 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. ఇదే ఇప్పటి వరకు అత్యల్ప స్కోర్. అయితే తాజాగా మరో జట్టు దానికన్నా తక్కువ స్కోర్ నమోదు చేసింది. ఐపీయల్ తర్వాత అంత ఆదరణ ఉన్న .. ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్స్ జట్టు తాజాగా 15 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. ఆ జట్టు ఒకసారి బిగ్ బాష్ లీగ్ లో ఛాంపియన్ గా నిలిచింది.
కానీ అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ 5 .5 ఓవర్లలో 15 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. టీ 20 లో విధ్వంసక ఆటగాళ్లలా పేరొందిన ఆలిస్ హేల్స్, రిలీ రోసో వంటి ఆటాగాళ్ళు ఈ జట్టులో ఉన్నారు కానీ.. ఒక్క ఆటగాడు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. కానీ ఎక్స్ట్రా ల రూపం లో మూడు పరుగులు అదనం గా వచ్చాయి.
అంతకు ముందు టీ 20 లో అత్యల్ప స్కోర్ టర్కీ జట్టు పేరు మీద ఉండేది. 2019 లో జరిగిన కాంటినెంటల్ కప్ లో భాగం గా చెక్ రిపబ్లిక్ తో జరిగిన మ్యాచ్ లో టర్కీ 21 పరుగులకే ఆల్ ఔట్ అయిన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. అతి తక్కువ బంతులు సాగిన ఇన్నింగ్స్ కూడా ఇదే.
అయితే గతం లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు 49 పరుగులకే ఆల్ ఔట్ అయింది. ఇదే ఐపీయల్ లో అత్యల్ప స్కోర్. కానీ ఇప్పుడు సిడ్నీ థండర్స్ స్కోర్ చూసి ఆర్సీబీ ఫాన్స్ హ్యాపీ అనుకుంట అంటూ.. నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
End of Article