Ads
కొలంబో వేదికగా బుధవారం జరిగిన రెండవ టి-20లో 4 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగుల స్కోర్ చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (40: 42 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్ గా నిలవగా కొత్తగా జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (21), దేవదత్ పడిక్కల్ (29) నిరాశపరచగా.. సంజు శాంసన్ (7), నితీశ్ రాణా (9) స్కోర్ చేశారు.
Video Advertisement
133 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక ఓపెనర్ మినోద్ భానుక (36: 31 బంతుల్లో 4×4) మెరుగైన ఆనందం ఇవ్వగా తర్వాత వచ్చిన ధనంజయ డిసిల్వా (40 నాటౌట్: 34 బంతుల్లో 1×4, 1×6) జట్టును గెలిపించారు. ఆ తర్వాత వచ్చిన అవిష్కా ఫెర్నాండో (11), సమరవిక్రమ (8), కెప్టెన్ దసున్ షనక (3), హసరంగ (15), రమేశ్ మెండిస్ (2) కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకోగా కరుణరత్నె (12 నాటౌట్), డిసిల్వా జోడీ మరో రెండు బంతులు మిగిలి ఉండగా 133/6తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.
భారత జట్టు బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, రాహుల్ చాహర్ ఒక వికెట్, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్, చేతన్ సకారియా ఒక వికెట్, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article