299
బాల కృష్ణ స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమా మొదలైంది. కొంత షూటింగ్ కూడా జరిగింది. షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు ఈ సినిమాలో ద్రౌపది పాత్ర పోషిస్తున్న సౌందర్య ప్లేన్ ప్రమాదంలో మరణించారు.షూటింగ్ జరుపుకున్న 17 నిమిషాల సినిమా దసరాకి శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్ బీ కే థియేటర్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చూడాలంటే కొంత మొత్తం (పే పర్ వ్యూ) చెల్లించాలి. అలా వచ్చిన మొత్తంలో సగం చారిటీ కి వెళ్తుంది అని బాలకృష్ణ ప్రకటించారు.నర్తనశాల లో అర్జునుడిగా బాల కృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడు గా శ్రీ హరి, ధర్మ రాజుగా శరత్ బాబు నటించారు.తాజాగా శ్రేయాస్ ఏటీటీలో ఈ సినిమాను ట్రైలర్ను విడుదల చేసారు.
