“అఖండ” లో ఆ రెండు సీన్ల వల్లే బోయపాటిని విమర్శిస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..?

“అఖండ” లో ఆ రెండు సీన్ల వల్లే బోయపాటిని విమర్శిస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..?

by Anudeep

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా “అఖండ”. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. ఆడియన్స్ అంచనాలకు మించి సూపర్ హిట్ అందుకుంది ఈ చిత్రం.

Video Advertisement

రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.పాటలతో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సీన్ హైలెట్ అవ్వడానికి ఒక కారణంగా నిలిచింది.

Also Read: యాంకర్ ప్రదీప్ ని పెళ్లి చేసుకుంటానంది.. కానీ చిన్నవయసులోనే కన్నుమూసిన నటి.. ఏమి జరిగిందంటే..?

Akhanda movie trolls

అయితే, సినిమాలో రెండు సీన్ల కారణంగా నెటిజన్స్ డైరెక్టర్ బోయపాటిని తెగ విమర్శిస్తున్నారట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించిన శ్రీకాంత్, పూర్ణ పై ఆమె కొడుకు కళ్ళ ముందే అత్యాచారానికి పాల్పడతాడు. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ సీన్ ను ఆమోదించలేమని చాలా మంది ప్రేక్షకులు చెబుతున్నారు.

Akhanda movie trolls

ఇక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ పాత్రని పోషించిన సంగతి తెలిసిందే. కానీ.. ఆమెలో ఆ హుందాతనం కనిపించలేదు. ఆమె హీరోతో కల్లు తాగించడం, ఆవకాయని నాకించడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులు నెగటివ్ రెస్పాన్స్ ఇవ్వడానికి కారణం అయ్యాయి. ఏదేమైనా బోయపాటి ఖాతాలో మరో హిట్ జమ అయ్యింది. బోయపాటి-బాలయ్య కాంబో మరో సారి హిట్ కాంబో అనిపించుకుంది. అఖండ 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా లాభాల పంటనే పండించింది.  తాజాగా ఈ చిత్రం ఓటిటిలో విడుదలైంది. అయితే.. ఈ రెండు సీన్లు లేకపోయుంటే మరింత పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ఉండేదేమో.

Also Read: ఆమె భర్త ఆర్మీ జవాన్.. మరొకరితో ఎఫైర్ పెట్టుకుంది.. ఇంతలో హఠాత్తుగా హత్య చేయబడింది.. అసలేం జరిగిందంటే..?


You may also like