పెద్దల్ని ఒప్పించి మరీ కోరుకున్నవాడిని పెళ్లి చేసుకుంది.! పెళ్లి అయిన 18 రోజులకే ఇలా జరిగిపోయింది..!

పెద్దల్ని ఒప్పించి మరీ కోరుకున్నవాడిని పెళ్లి చేసుకుంది.! పెళ్లి అయిన 18 రోజులకే ఇలా జరిగిపోయింది..!

by Anudeep

Ads

ఎన్నో ప్రేమ జంటలు పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకుంటూ వుంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు. కొన్ని ప్రేమ జంటల కథ సుఖాంతం అయితే, మరి కొన్ని ప్రేమ జంటల కథ విషాదంగా మిగిలిపోతుంది.

Video Advertisement

తమ నిజాయితీని ప్రేమతో పెద్దను ఒప్పించి మరీ పెళ్లి చేసుకొని చివరకు విషాదంగా మిగిలిపోయిన ఈ కథ. తెలంగాణ రాష్ట్రం, మెదక్ పట్టణానికి చెందిన రాఘవేంద్ర మరియు ఆంధ్ర ప్రదేశ్, పార్వతీపురానికి చెందిన ఉషా ఇద్దరికీ హైదరాబాదులో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి వాళ్లిద్దర్నీ ఒకటి చేసింది.

New bride usha

ఉషా, రాఘవేంద్ర ఇద్దరూ తమ ప్రేమను పెద్దలకు తెలియజేసే వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో మొదటిలో తల్లిదండ్రులు వీరి వివాహానికి ఒప్పుకోలేదు. వీళ్ళ ప్రేమలోని నిజాయితీని చూసి నెమ్మదిగా వాళ్ళ మనసు కరిగి వాళ్ళ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మే నెల 11వ తేదీన వీరిద్దరి వివాహం హైదరాబాద్ లో ఒక హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబాలను ఒకటిగా చేశారు. ప్రేమించిన వాడినే వివాహం చేసుకోవడంతో ఉషా ఎంతగానో మురిసిపోతూ అత్తవారింట్లో సంతోషంగా అడుగుపెట్టింది.ఈ శుక్రవారం ఉషా కు విపరీతమైన తలనొప్పి వస్తుంది అని భర్తతో తెలియజేయగా, కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఒక డాక్టర్ కి చూపించారు.

Also read: సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ ఏమి చేశారో తెలుసా….

representative image

మెరుగైన చికిత్స కోసం మరొక ఆసుపత్రికి తీసుకు వెళ్ళమని వైద్యులు సూచించారు  హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఉషాని జాయిన్ చేశారు. శనివారం బ్రెయిన్ స్ట్రోక్ రావడం తో ఉష మృత్యుఒడిలోకి వెళ్ళిపోయింది. పచ్చగా నూరేళ్లు ఆనందంగా కలిసి ఉండాల్సిన రాఘవేంద్ర, ఉషా జంట ప్రేమలో గెలిచినా మృత్యువు కారణంగా  శాశ్వతంగా విడిపోయారు. పెళ్లి అయిన నెలలోపే ఉషా ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read: ఛీ.. చీ.. ఏంటి ఈ దరిద్రం అంటూ F3 సీన్స్ పై మండిపడుతున్న నెటిజన్లు…


End of Article

You may also like