Ads
మన దేశంలో ఎంతో మంది ఎదుర్కొనే సమస్యల్లో భూ వివాదానికి సంబంధించిన సమస్యలు ఒకటి. ఒకరు ఒక భూమిని కొనుక్కోవడం తర్వాత భూమి గురించి గొడవలు అవ్వడం అనేది జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొంత మంది ఒకరి దగ్గర నుంచి ఒక స్థలం కొనుక్కున్న చాలా సంవత్సరాల తర్వాత ఆ అమ్మిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వచ్చి తమకి తెలియకుండా ఈ భూమిని అమ్మారు అని చెప్పి కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి.
Video Advertisement
అలాగే భూమికి సంబంధించిన పత్రాల విషయంలో పొరపాట్లు జరగడం, మోసం జరగడం కూడా గొడవలకి కారణం అవుతాయి. ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ భూ వివాదాలు అనేవి పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గే అవకాశాలు ఉండవు. అందుకు ముఖ్య కారణం పెరుగుతున్న స్థలాల ధరలు.
సమయం గడిచేకొద్దీ స్థలాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఇంకా ముందు కూడా పెరుగుతూనే ఉంటాయి. దాంతో ధరలతో పాటు సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు ప్రభుత్వం ఒక వ్యక్తికి వ్యవసాయం కోసం స్థలాన్ని ఇవ్వడం, ఆ వ్యక్తి ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మడం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ప్రభుత్వం నుండి ఆ స్థలానికి సంబంధించిన నోటీసులు రావడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
ఇలా భూముల విషయంలో ఎన్నో రకాల వివాదాలు వస్తాయి. అయితే ఈ వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలో, భూమి కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
watch video :
https://youtu.be/CGjoqBH14mg
End of Article