Ads
మనలో ఎంతో మంది ఒక చోట నుండి ఇంకొక చోటికి ప్రయాణించాలంటే ఉపయోగించే వాహనాలు ఇంకా ట్రైన్. ఒకవేళ తొందరగా వెళ్లిపోవాలి అంటే చాలా మంది ప్రిఫర్ చేసేది బస్ ప్రయాణాలు. కానీ ఒకవేళ టైం పట్టినా పర్లేదు అంటే మాత్రం ఎక్కువ మంది ట్రైన్ ప్రయాణాలనే ఇష్టపడతారు.
Video Advertisement
చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ప్రయాణించడం, అందులోనూ ముఖ్యంగా రైలు ప్రయాణాలు అనేవి ట్రాఫిక్ కి దూరంగా ఉండడం వల్ల ప్రయాణికులు ట్రైన్ ప్రయాణాలని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా. రైలు పట్టాల మీద ఎప్పుడూ తుప్పుపట్టిన రైలింగ్ వేస్తారు. అది కొత్తది అయినా సరే తుప్పుపట్టిన దాన్ని మాత్రమే వాడతారు.
అలా తుప్పు పట్టిన రైలింగ్ వాడటానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ స్టీల్ రైలింగ్ వాడితే వాడాలి అంటే మామూలుగా అయితే ఏదైనా స్టీల్ తో చేసిన వస్తువు పల్చగా తయారు చేయాల్సి వచ్చినప్పుడు 6 mm థిక్ నెస్ ఉన్న స్టీల్ వాడుతారు. ఇది స్టీల్ లో అత్యంత తక్కువ థిక్ నెస్. అదే ఒకవేళ రైలింగ్ కి వాడాల్సి ఉంటే 15 mm థిక్ నెస్ ఉన్న స్టీల్ వాడుతారు.
సాధారణ కండిషన్స్ లో 0.5 mm థిక్ నెస్ ఉన్న స్టీల్ కి తుప్పు పట్టడానికి ఒక సంవత్సరం పడుతుంది. అంటే 1 mm థిక్ నెస్ ఉన్న స్టీల్ కి పట్టణానికి 20 సంవత్సరాలు పడుతుంది. సాధారణంగా రైల్స్ ని 20 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. ఒకవేళ స్టెయిన్ లెస్ స్టీల్ వాడితే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అంతే కాకుండా ట్రాక్ ఆపరేషన్ లో సమస్యలు రావడానికి కారణం తుప్పు కాదు.
ఆ సమస్యలు ఫ్రిక్షన్ వల్ల లేదా ట్రాక్ మీద ఏర్పడే పగుళ్ళు వల్ల వస్తాయి. ఇలాంటి సమస్యలు నివారించడానికి తరచుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇంక తుప్పు విషయానికొస్తే ట్రైన్ వెళ్ళినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ వల్ల ఆ ట్రాక్ మీద ఉన్న తుప్పు వదిలిపోతుంది.
End of Article