“యజ్ఞం” సినిమాని రిజెక్ట్ చేసిన… ఆ 2 “స్టార్ హీరోలు” ఎవరో తెలుసా..?

“యజ్ఞం” సినిమాని రిజెక్ట్ చేసిన… ఆ 2 “స్టార్ హీరోలు” ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

టాలీవుడ్‌లో మాచో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపీచంద్. తెలుగులో రెండు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తొలి వలపు (2001) చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు గోపీచంద్.

Video Advertisement

ఈ సినిమా ఆశించినస్థాయిలో సక్సెస్స్ అవ్వకపోవడంతో జయం, నిజం, వర్షం సినిమాల్లో విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన యజ్ఞం సినిమాతో హీరోగా వచ్చాడు గోపీచంద్. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యి ఆయన్ని మళ్లీ హీరోని చేసింది.

అయితే.. జులై 1న విడుదల కానున్న పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ యజ్ఞం సినిమా గురించి ఆసక్తికరమైన వాక్యాలు చేసారు. యజ్ఞం సినిమా 2004లో రవి కుమార్ దర్శకత్వంలో వచ్చింది. అయితే డైరెక్టర్ మొదట ఈ సినిమాకు హీరోగా డార్లింగ్ ప్రభాస్ ని అనుకున్నాడంటా కానీ డైరెక్టర్ కొత్తవాడు కావడంతో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసాడంటా..

Also Read: రామ్ పోతినేని “ది వారియర్” సినిమాకి మొదటిగా అనుకున్న… ఆ “స్టార్ హీరో” ఎవరో తెలుసా..?

అనంతరం డైరెక్టర్ రవి కుమార్ యజ్ఞం స్టోరీని కళ్యాణ్ రామ్ కి వినిపిస్తే.. కొత్త దర్శకుడు అని కాదన్నాడంటా.. ఆ తర్వాత బాబాయ్ పోకూరి బాబూరావు యజ్ఞం మూవీలో హీరోగా నటిస్తావా అని నన్ను అడిగారని ఆయన తెలిపారు. నేను వెంటనే ఒప్పుకున్నానని గోపీచంద్ చెప్పుకొచ్చారు. యజ్ఞం సినిమాలో హీరోగా ఎంపికయ్యే సమయానికి నేను వర్షం, నిజం షూటింగ్ లలో పాల్గొంటున్నానని గోపీచంద్ పేర్కొన్నారు.

ప్రస్తుతం జులై1న విడుదల కానున్న పక్కా కమర్షియల్ సినిమాకు మారుతీ డైరెక్టర్ కాగా, రాశీఖన్నా హీరోయిన్ గా చేసింది. ఆరడుగుల బుల్లెట్ పరాజయం తర్వాత వస్తున్న ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు మాచో స్టార్. ఈ చిత్రం తర్వాత లౌక్యం డైరెక్టర్ శ్రీవాస్ తో మరో సినిమా చేయనున్నాడు గోపీచంద్.

Also Read: “పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆనందంగా లేకపోవడానికి కారణం నువ్వే..!” అంటూ.. వైరల్ అవుతున్న “సమంత” కామెంట్స్..! (వీడియో)


End of Article

You may also like