లాక్ డౌన్ 3 .0 లో కొన్ని సడలింపులు ఇస్తూ వాణిజ్యపరమైన వాటిలో కొన్నింటికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే..దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ టాపిక్. గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో అమ్మకాలు భారీగా ఊపందుకున్నాయి. వైన్ షాపుల ముందు మందు బాబులు భారీగా బారులు తీరారు…ఇన్ని రోజులు ముందుకు కోసం ఎదురుచూసిన గొంతులు పండగ చేసుకున్నాయి.,అయితే కొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నారు.

తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు.ఇన్ని రోజులు కష్ట పడి చేసిన లాక్ డౌన్ యొక్క ఫలితం మొత్తం బూడిదలో పోసిన పన్నీరే ..అని వాపోతున్నారు.ఇలా చేస్తే కరోనా మరింతలా వ్యాప్తి చెందే అవకాశం ఉందంటూ అభిప్రాయపడుతున్నారు.ఇదే అంశం మీద యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించారు తనదైన శైలిలో స్పందించారు.ఉచిత రేషన్ కోసం అభ్యర్థించే ఈ నిరుపేదవారు ఇప్పుడు ఏకంగా ఆల్కహాల్ కోసం డబ్బులని సర్దుబాటు చేసుకొని కొనడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందంటూ రష్మీ …విమర్శించారు ” ‘‘మే 4 తరవాత లిక్కర్ షాప్లకు వస్తోన్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో మాదిరిగా చెరిగిపోని ఇంక్తో మార్కింగ్ వేయాలి.
Also Read : తప్పుగా ప్రవర్తించారు అంటే…ఆ సీనియర్ ఆక్టర్ నా గురించి దుష్ప్రచారం చేసారంట?

ఇలాంటి వ్యక్తులు ఉచిత ఆహారానికి కానీ, ప్రభుత్వం లేదంటే ఇతరుల ద్వారా అందుతోన్న ఉచిత సరుకులకు కానీ అర్హులు కాదు. వారి రేషన్ను కూడా ఆపేయాలి. మద్యం కొనుగోలు చేయడానికి అతని వద్ద డబ్బు ఉన్నప్పుడు, ఉచితాలు ఎందుకు ఇవ్వాలి?’’అంటూ రష్మీ తనదైన శైలిలో స్పందించారు ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం ఒకటే పరిష్కారం కాదని అన్నారు.దేశంలోని అన్ని వ్యాపారాలను తిరిగి ప్రారంభించాలని దీర్ఘకాలిక లాక్ డౌన్ వల్ల ఒక దేశం మనుగడ సాగించడం కష్టమని తెలిపారు.కరోనా మహ్మమురికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనము పరిస్థితిని అర్థం చేసుకొని దానికి తగినట్టుగా నడుచుకోవాలని అన్నారు.

వైరస్ ని మరింత వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు జోన్ల ని విభజించిన తరువాత లిక్కర్ అమ్మకాలు ఒక్కటే సమస్య కాదని రష్మీ తన అభిప్రాయం చెప్పారు.ఇళ్లలో సాయం ,పని మనుషులు తిరిగి రావాలని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు అయితే వృద్ధులు మినహాయించి మిగితా వారు సక్రమంగా తమ తమ ఇళ్లల్లో ఇంకొన్ని రోజులు పని చేసుకోలేరా అంటూ ప్రశ్నించారు!


మూగ జీవాల మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఎవరైనా మూగ జీవాలకు హాని కలిగించే ఫొటోస్ వీడియో చూశారంటే చాలు…వారి పై ఒక రేంజ్ లో తిడుతుంటారు. పెట్స్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టిన సరే.అనవసరంగా కొట్టిన రష్మీ వారి పై ఫైర్ అవుతూ ఉంటారు..తాజాగా రష్మీ ఒక వీడియో పై ఇలా చెబుతూ అందులోని మనుషుల ప్రస్తావన పై నిప్పులు చెరిగారు ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే.
రష్మీ పెట్ లవర్ ని అందరూ చెబుతూ ఉంటారు.వాటి మీద ప్రేమను చూపిస్తూ ఉంటారు కూడా వీధి కుక్కలు ఎక్కడ కనిపించిన వాటికి ఆహరం పెడుతూ ఉంటారు.సోషల్ మీడియా లో ఎవరైనా పెట్స్ కి బాగోలేదనో,ఆహరం కోసమేనా తన వద్ద చెబితే చాలు క్షణాల్లో స్పందిస్తారు.తగిన సహాయం కూడా చేస్తారు.లాక్ డౌన్ కారణంగా కుక్కలకి సరైన ఆహరం దొరకడం లేదు.ఇక తానే స్వయంగా రంగంలోకి దిగింది.బకెట్ పట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూగజీవాల ఆకలిని తీర్చింది. వీటికి సంబందించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి కూడా.
మూగ జీవాలని హింసిస్తున్న ఒక వీడియో రష్మీ దృష్టికి వచ్చింది..ఢిల్లీలోని ఒక కాలనీ లో కొందరు ఆకతాయిలు మూగ జీవులని వెంటాడి వెంటాడి మరి హింసించారు.అడ్డుపడిన వారిని కూడా బెదిరించి తప్పుకున్నారు. కుక్కలని కొట్టిన ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఆ వీడియో పై స్పందించిన రష్మీ…’నోరు లేని మూగజీవాలపై మీ బలాన్ని చూపడం మగతనం అనిపించుకోదు’ ఇలాంటి పనులను మనం ఖండించాలి. పెట్స్ ను కాపాడుకోవడం, పోషించడం తప్పు కాదని చెప్పుకొచ్చారు.