Yashoda OTT release: సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. యశోద సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.
నవంబరు 11న విడుదలైన యశోద తొలి రోజే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని రూ.30 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి హిట్గా నిలిచింది. సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మంచి లాభాలను రాబట్టింది. ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా మంచి వసూళ్లని రాబట్టింది. సరోగసీ అనే సున్నితమైన అంశం పై తెరకెక్కిన ఈ సినిమాకి హరి, హరీష్ డైరెక్షన్ చేశారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా చేసింది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. 
యశోద ఓటీటీ విడుదలపై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. మయోసైటిస్తో అనే దీర్ఘకాలిక వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే సమంత ఈ సినిమాలో ఫైట్స్ చేసింది. సమంత చేసిన కొన్ని స్టంట్స్ అందర్నీ ఆశ్చర్యపర్చాయి. థియేటర్ల నుండి వెళ్లిపోయిన యశోద సినిమా కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇటీవల ఈ మూవీ పై ఇవా హాస్పటల్ పరువు నష్టం దావా వేసింది. ఈ మూవీ పై ఈవా పేరుతో ఉన్న సరోగసీ సెంటర్లో నేరం చేసినట్లుగా చూపించారని, ఓటీటీలో కూడా ఈ మూవీ రిలీజ్ ఆపేయాలని ఇవా హాస్పటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది.
 అయితే నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వారితో రాజీ కుదుర్చుకున్నారు. ఓటీటీలో విడుదల చేసే వెర్షన్లో హాస్పటల్ బ్లర్ చేస్తామని చెప్పారు. దీంతో ఓటీటీ రిలీజ్కి అడ్డంకి తొలిగింది. డిసెంబరు 9న స్ట్రీమింగ్ అవబోతునట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్లాప్ సినిమాలనే త్వరగా ఓటీటీలో రిలీజ్ చేస్తారు.కానీ యశోద సినిమా హిట్ అయ్యింది. అయిన కూడా ఇంత త్వరగా ఎందుకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారో అని అంటున్నారు.


ఇక ఈ సినిమాలో హీరో నాని అర్జున్ సర్కార్ అనే పేరుగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని, సినిమా పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తామని చెప్పారు. ఇదివరకే దర్శకుడు శైలేష్ కొలను హిట్ వర్స్ ని ఎవెంజర్స్ మాదిరిగా చేస్తామని స్పష్టం చేశాడు. అంటే ఎవెంజర్స్ మూవీస్ లో ఒకేదానిలో ఇద్దరు ముగ్గురు హీరోస్ ఉంటారో, అలాగే హిట్ రాబోయే సిరీసుల్లో కూడా ఒకరు కంటే ఎక్కువ హీరోలు కనిపిస్తారని చెప్పారు. మరో విధంగా చెప్పాలంటే మల్టీస్టారర్ మూవీ అనవచ్చు.
ఇక హిట్-3లో నాచురల్ స్టార్ నానినే హీరో అనే విషయం తెలిసిందే. హిట్-2 సినిమా క్లైమాక్స్ లో ఆ విషయాన్ని చూపించారు. హీరో నానిని పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా ఇంట్రడ్యూస్ చేసారు. దీని ప్రకారం హిట్-3లో నానినే హీరో. అయితే తాజాగా శైలేష్ కొలను పెట్టిన పోస్ట్ తో నానితో పాటు అడివి శేష్, విశ్వక్ సేన్ లు ఈ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది.
ఇక దీని కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటు, వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనితో పాటుగా తొలి పార్టు సినిమా చివరి సమయంలో కంగారు పడిన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ అలాంటివి రాకుండా విడుదల తేదీ ప్రకటన చేస్తారట. ఈసారి పక్కా ప్లాన్స్ బరిలోకి దిగారని సమాచారం. డిసెంబరు 8న ‘పుష్ప: ది రైజ్’ రష్యాలో విడుదల కానుంది.
దీనికోసం మూవీ యూనిట్ ప్రస్తుతం రష్యాలో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. ఇక అక్కడి నుండి వచ్చాక పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఒక్కసారి సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆగకుండా పూర్తి చేస్తారట.ఈ సినిమాలో పాట నటులతో పాటుగా కొత్త నటులు కూడా కనిపిస్తారని టాక్. అంటే మొదటి పార్టులో లేని పాత్రలు కొత్తగా వస్తాయట. అంతేకాకుండా ఈ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని, ఆ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకొస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంకా దీనిలో విలన్లను కూడా పెంచుతున్నారని తెలుస్తోంది.
హీరో నాని హిట్ 2 సినిమాకు హిట్ టాక్ వచ్చిన సందర్భంగా ఈ మూవీ గురించి మాట్లాడారు. నాని ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. హిట్ 2 జర్నీలో మూవీ యూనిట్ గురించి మాట్లాడుతూ ‘వాల్ పోస్టర్ సినిమా మొదలు పెట్టి, కొత్త ఐడియాలతో న్యూ టాలెంట్ను ప్రోత్సహించాలని అనుకున్నాను. రొటీన్ సినిమాలు చేయకూడదనే ఈ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ని ప్రారంభించాను. డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేస్తే ఎవరు చూడరు. అసలు ఇది వర్కవుట్ అవుతుందా? అని చాలా మంది నన్ను భయపెట్టారు.
అయితే తెలుగు ఆడియెన్స్ డిఫరెంట్ మూవీస్ చూస్తారనే ధైర్యం, నమ్మకం ఉంది. ఇప్పడది ఇంకోసారి హిట్ 2 తో రుజువైంది’ అన్నారు. హీరో నాని సమర్పకుడిగా, ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా మరి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ను మొదలు పెట్టారు. ఈ బ్యానర్లో తీసిన మొదటి సినిమా అ!. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మారారు. ఆ తరువాత శైలేష్ కొలనుని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ హిట్ యూనివర్స్ మొదలుపెట్టారు.
ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పటికే మహేష్, రాజమౌళి సినిమా పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. జక్కన్న మహేష్ తో ఓ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమా కథను రెడీ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికా అడవి నేపథ్యంలో సాగుతుందని టాక్. రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియానా జోన్స్ తరహాలో మహేష్ మూవీ ఉంటుందని చెప్పారు.
తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ మహేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయేంద్ర ప్రసాద్ గురించి చెప్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటెన్స్ ఉన్న నటుడు. మహేష్ నటించిన యాక్షన్ సన్నివేశాలు చూసినప్పుడు చాలా ఇంటెన్సిటి కనిపిస్తుంది అని అన్నారు . ఆయన ఇంటెన్స్ వల్ల ఏ రచయితకైనా తన పని ఈజీ అవుతుంది. చాలా మంది రచయితలు మహేష్ గురించి అదే చెప్తారు అని అన్నారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు.
ఆ వీడియోలో బాబీ విదేశాల్లో చదువు కొనసాగించాడని బండ్ల గణేష్ చెప్పాడు. అల్లు బాబీ విద్యావంతుడని, తన తండ్రి అల్లు అరవింద్కు విధేయత చూపుతాడని,కానీ అల్లు అర్జున్ తన తండ్రి మాటని పట్టించుకోలేదని, అయితే నేడు అల్లు అర్జున్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడని గణేష్ అన్నారు. అందుకే తండ్రి మాట విన్నవారు అల్లు బాబీలా, తండ్రి మాట వినని వారు,  తమకు నచ్చినట్టు చేస్తే అల్లు అర్జున్లా అవుతారని బండ్లన్న చెప్పుకొచ్చారు. బాబీ గారు అవ్వాలా, బన్నీగారు అవ్వాలా మీరు నిర్ణయించుకోండని బండ్ల గణేష్ అన్నారు.
వీరిని ఉదాహరణగా చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా తమ మనసు చెప్పినట్టు వెళ్లాలని బండ్ల గణేష్ కోరారు. ఈ వీడియోతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ తమ అభిమాన స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నిర్మించాలని చాలా మంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
 మేకర్స్ కనుక ట్విస్ట్ గురించి మాట్లాడకుండా ఉండి ఉంటే మూవీకి ప్లస్ గా మారేదని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా సంజన అనే బాధితురాలిని దారుణంగా హత్య చేసిన కేసును ఇన్వెస్ట్ గేట్ చేయడానికి వచ్చిన ఎస్పీ రేంజ్ పోలీసు కృష్ణ దేవ్ (అడివి శేష్) చుట్టూ సినిమా తిరుగుతుంది. సంజనలాగే అనేక మంది మహిళలకు జరిగిందని అతను తరువాత తెలుసుకుంటాడు. కృష్ణ దేవ్ కిల్లర్ని ఎలా పట్టుకుంటాడు అనేది సినిమా కథ.
హిట్: ది సెకండ్ కేస్ థియేట్రికల్ రిలీజ్ మొదటి రోజు, ఇండియా వైడ్ గా అన్ని కేంద్రాల నుండి దాదాపు రూ. 6 కోట్లు రాబట్టింది. థియేటర్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా డీసెంట్గా నమోదైంది మరియు రోజు చివరి నాటికి మెరుగుపడింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిచింది. సుహాస్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, కోమలి ప్రసాద్, మాగంటి శ్రీనాథ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్ చేసిన హిట్ వర్స్ లో HIT 2 రెండవ సినిమా.
ఇక ఆ ఊరిలోకి వేరే ఊరి వారు వస్తే వచ్చిన వాళ్లను వచ్చినట్టే దొర చంపేస్తూంటాడు.ఈ క్రమంలో ఆ గూడెంలోని ఒక పిల్లాడికి రేడియో దొరుకుతుంది.రేడియో అంటే ఏమిటో,ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అయితే ఆ రేడియో వల్ల గూడెంలో అల్లకల్లోలం జరిగి, అదే దేవుడిగా మారుతుంది.దీంతో తాను కాకుండా ఇంకో దేవుడు ఉండటం నచ్చని దొర అప్పుడు ఏం చేసాడు. మూఢనమ్మకాలతో బతుకుతున్న అక్కడి ప్రజలకు ఆ రేడియో ద్వారా ఓ స్కూల్ మాస్టర్ వారికి ఎలా విముక్తి కలిగించాడు అనేది మిగిలిన కథ.
ఈ సినిమాను రాజమౌళి శిష్యుడు అయిన అశ్విన్ గంగరాజు రూపొందించారు. అయితే ఈ మూవీలో నటించిన వారిలో చాలా మంది కొత్తవారు కావటం, అంతేకాకుండా సబ్ స్క్రైబర్లు తక్కువ సంఖ్యలో ఉన్న సోనీ లివ్ లాంటి ఓటీటీలో విడుదల అవడం కూడా ఆకాశవాణికి మైనస్ అయ్యిందనే చెప్పాలి.కానీ ఓటీటీలో మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఆకాశవాణి మంచి ఆప్షన్ అవుతుంది.
జెమినీలో గత వారం ఈ సినిమా ప్రసారం కాగా, దారుణమైన రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకి కేవలం 3.41 రేటింగ్ వచ్చింది. హీరో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి 7.88 రేటింగ్ వచ్చింది. కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అదే టైమ్ లో సీతారామం స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు మంచి రేటింగ్స్ అందుకుంది. మొదటిసారి ప్రసారం చేయగా 8.73 టీఆర్పీ రావడం విశేషం. ఈ సినిమా రేటింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ టైం టిఆర్పి కంటే కూడా ఎక్కువే.
ఇక ఈ మూడు సినిమాలలో సీతారామం సినిమాకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి టెలికాస్ట్ చేయబడిన సర్కారు వారి పాట 6.8 రేటింగ్ వచ్చింది. అయితే ఒకప్పుడు TRP రేటింగ్ 20 పాయింట్ల కంటే ఎక్కువ ఉండేది. ప్రస్తుతం పుష్ప సినిమా టాప్ ప్లేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జనాలు టీవీల్లో మూవీస్ చూసేందుకు అంతగా ఆసక్తి పెట్టడం లేదని తెలుస్తోంది. దాంతో టీఆర్పీ రేటింగ్స్ 10కి తగ్గిపోయింది.
ప్రస్తుతం పూరీ జగన్నాధ్ రాబోయే సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. పూరీ ఇప్పటివరకు తదుపరి మూవీ గురించి ఏ వివరాలను కూడా ప్రకటించలేదు. అయితే పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా, ఓ సినిమాకు దర్శకత్వం చేస్తాడని వినిపించాయి. ఆ విషయం పై ఎలాంటి సమాచారం లేదు. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాధ్ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరో రవితేజతో చర్చలు జరుపుతున్నాడని తెలిస్తోంది.
ఇంతకుముందు పూరీ, రవితేజ కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పూరి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? ఎందుకంటే రవితేజ ఒప్పుకున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ డేట్స్ ఖాళీగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కెరీర్ ఎదుగుదలకు కావాల్సిన హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కోసం డేట్స్ తప్పకుండా ఇస్తాడని అందరు అనుకుంటున్నారు.  ఇంకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.