Tollywood: టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తుంది. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ యువ హీరోల నుండి అగ్రహీరోల వరకు అందరూ ఫాలో అవుతున్నారు. మరి సీనియర్ స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తారో చూడాలి.
తెలుగు సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున. ఈ హీరోలు వీళ్ళ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ హీరోల వయస్సు 60 ఏళ్లు దాటినా వీరికి రోజు రోజుకి క్రేజ్ పేరుగుతూనే ఉంది. అలాగే ఈ సీనియర్ స్టార్స్ కి యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందులోనూ సంవత్సరానికి కనీసం ఒక మూవీ విడుదల అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ హీరోలు.కానీ ఈ హీరోలు వేరే భాషల్లో మూవీస్ ని రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టటడం లేదనే చెప్పాలి
ఈ హీరోలు తమ సినిమాలని ఇతర భాషల్లో విడుదల చేసినా కూడా వాటి ప్రమోషన్స్ లో పాల్గొనడానికి ప్రాధాన్యత అంతగా ఇవ్వడం లేదు. ఎందుకనో గాని పాన్ ఇండియా మూవీస్ తో తమ దూకుడు పెంచుకోవాలని ఈ సీనియర్ స్టార్స్ అనుకోవడం లేదు. అయితే సీనియర్ హీరోలు చాలా విషయాలలో యంగ్ హీరోలతో పోటీపడుతున్నా పాన్ ఇండియా విషయంలో అసలు పోటీపడటం లేదు
ఇక సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి నెలల వ్యవధిలోనే సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గాడ్ ఫాదర్ మూవీతో అక్టోబర్ లో థియేటర్లలోకి వచ్చిన చిరంజీవి, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీతో ప్రేక్షకుల పలకరించనున్నారు. నట సింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ కూడా సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున మూవీ షూటింగ్ లకు బ్రేక్ తీసుకున్నాడు. కానీ బిగ్ బాస్ ద్వారా వారం వారం ప్రేక్షకులకు పలకరిస్తున్నాడు.

కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య షోకు 5వ ఎపిసోడ్ కు ఆహా ఫౌండర్స్ లో ఒకరైన అల్లు అరవింద్, తెలుగు దర్శకులలో గొప్పగా చెప్పుకునే కె రాఘవేంద్రరావు, టాప్ నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు వస్తున్నారని తెలుస్తోంది.అయితే ఈ ఎపిసోడ్ లో సినీ రంగం గురించి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అన్ స్టాపబుల్ షో కోసం ఇరవై నుండి ముప్పై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు షో నిర్వాహకులు.
ఆహా ఓటీటీకి రోజు రోజుకి రెస్పాన్స్ పెరుగడంతో, అది బాలకృష్ణ షో వల్లే ఆహా సబ్ స్క్రిప్షన్లు పెరిగాయని అంటున్నారు. బాలకృష్ణ కూడా భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య షో వల్లే ఆహా రేంజ్ ను పెరిగిందని కొందరు అంటున్నారు. అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగుతున్న క్రమంలో ప్రతి ఎపిసోడ్ ని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇక అందులో భాగంగా రాబోయే ఎపిసోడ్స్ ని మరింత గ్రాండ్ గా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారు.
గోవాలో జరుగుతోన్న 53వ అంతర్జాతీయ చలన చిత్ర ఉత్సవాల్లో పాల్గొన్న దర్శకుడు బోయపాటి చేసిన వాఖ్యలను బట్టి నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. బోయపాటి మాట్లాడిన సమయంలో బాలకృష్ణ కూడా పక్కనే ఉన్నారు. మోక్షజ్ఞని మీరే పరిచయం చేస్తారా అని ప్రశ్నించగా బోయపాటి అవునని కానీ, కాదని కానీ చెప్పకుండా, అతన్ని సిని పరిశ్రమకి ఎలా, ఎప్పుడు పరిచయం చేయాలి అని వారి కుటుంబానికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. మోక్షజ్ఞకి ఏ డైరెక్టర్ సెట్ అవుతాడు. అతని బాడీ లాంగ్వేజ్,ఇమేజ్ కి ఎలాంటి స్టోరీ అయితే సెట్ అతనే లాంచ్ చేస్తాడని బోయపాటి అన్నారు.
ఇంకా మాటాడుతూ నేనే పరిచయం చేస్తానని చెప్పలేను.ఆ సమయం వస్తే, ఎంట్రీ అలా జరిగిపోతుంది. మన చేస్తుల్లో ఏం లేదు, అంతా దైవేచ్చ. ఆ అప్పటిదాకా మనమంతా ఎదురుచూడాలి అని మోక్షజ్ఞ ఎంట్రీ గురిచి చెప్పారు. పక్కనే ఉన్న బాలయ్య చిన్నగా నవ్వాడు.కానీ ఏం మాట్లాడలేదు. ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియా సినిమాని తీస్తున్న సంగతి తెలిసిందే. హీరో నందమూరి బాలకృష్ణ తన 107వ చిత్రం వీరసింహారెడ్డితో సంక్రాంతి పండుగాకి బరిలోకి దిగుతున్నారు.
ఇక అసలు షయానికొస్తే, బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహా రెడ్డి మూవీ నుండి జై బాలయ్య పాట శుక్రవారం రిలీజ్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం వచ్చింది. ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీనిని ఓసేయ్ రాములమ్మ సాంగ్ తో పోలుస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మళ్లీ కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు. మరి కొందరు ఈ పాట రాసిన రచయిత రామజోగయ్య శాస్త్రీని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పేరులోని సరస్వతీ పుత్ర పేరును తొలగించాలని అంటున్నారు.
మేకర్స్ సోషల్ మీడియాలో సినిమా కంటెంట్ బాగుంటే బాగా ప్రమోట్ చేసుకుంటారు. కంటెంట్ బాగుంటే నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తారు.అయితే సినిమా బాలేనప్పుడు మాత్రం వాటిని ట్రోలర్స్ పని దొరికినట్టే ఇక.నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం తమన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విడుదల చేసారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిచారు. అంతే కాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఇప్పటివరకు వేసుకొని డ్రెస్ లో తమన్ కనిపించడమే కాకుండా స్టెప్స్ కూడా వేశారు.
అయితే అఖండ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలయ్య అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఈ పాట నిరాశ పరిచింది. అంతే కాకుండా ఒసేయ్ రాములమ్మ సినిమాలో పాటలా ఉందని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మీమర్స్, ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బ్రహ్మానందం ఫోటోలతో, వీడియోలతో రెచ్చి పోతున్నారు. డ్రెస్సింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, సాంగ్ మీద పెట్టలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేటర్స్లో సందడి చేయటానికి రెడీ అవుతోంది.


