Jai Balayya Song: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమా వీరసింహారెడ్డి. తాజాగా ఈ మూవీ నుండి జై బాలయ్య సాంగ్ ని విడుదల చేశారు. అయితే ఈ పాటలో తమన్ వెరైటీ డ్రెస్ లో కనిపించారు. దీంతో తమన్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
మేకర్స్ సోషల్ మీడియాలో సినిమా కంటెంట్ బాగుంటే బాగా ప్రమోట్ చేసుకుంటారు. కంటెంట్ బాగుంటే నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తారు.అయితే సినిమా బాలేనప్పుడు మాత్రం వాటిని ట్రోలర్స్ పని దొరికినట్టే ఇక.నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం తమన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వీరసింహారెడ్డి నుండి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విడుదల చేసారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిచారు. అంతే కాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఇప్పటివరకు వేసుకొని డ్రెస్ లో తమన్ కనిపించడమే కాకుండా స్టెప్స్ కూడా వేశారు.
అయితే అఖండ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలయ్య అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఈ పాట నిరాశ పరిచింది. అంతే కాకుండా ఒసేయ్ రాములమ్మ సినిమాలో పాటలా ఉందని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మీమర్స్, ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బ్రహ్మానందం ఫోటోలతో, వీడియోలతో రెచ్చి పోతున్నారు. డ్రెస్సింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, సాంగ్ మీద పెట్టలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్. ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేటర్స్లో సందడి చేయటానికి రెడీ అవుతోంది.
telugu trolls
ఫించ్ బాగా నాకించేసాడు…రితురాజ్ స్పార్క్ చూపించేసాడు అంటూ Csk Vs Rcb మ్యాచ్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్.!
ఐపీఎల్ 2020 లో నిన్న ఆర్సీబీ జట్టు కి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సీఎస్కే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.ఫించ్ 15, కోహ్లీ 50, డివిలియర్స్ 39, పడిక్కల్ 22 పరుగులు చేశారు. నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.ఇక, చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. 51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో65 పరుగులు చేయగా, డుప్లెసిస్ 13 బంతుల్లో 25, అంబటి రాయుడు 27 బంతుల్లో 39 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఓ ఫించ్ మరోసారి తక్కువ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు ..దీంతో సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ వస్తున్నాయి
#1
#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15
నిన్న జరిగిన మ్యాచ్ లో RCB మీద ట్రెండ్ అవుతున్న మీమ్స్….ఈ సాలా కప్ నమ్దే అంటూ..
ఐపీఎల్ 2020 లో నిన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడా తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. తర్వాత రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రాణా (0), శుభమన్ గిల్ (1) స్కోర్ చేశారు.
ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన టామ్ బాంటన్ (10: 8 బంతుల్లో 1×4, 1×6) చేయగా, దినేశ్ కార్తీక్ (4: 14 బంతుల్లో) చేశారు. చివరిలో పాట్ కమిన్స్ (4), కుల్దీప్ యాదవ్ (12: 19 బంతుల్లో 1×4), లాకీ ఫెర్గూసన్ (19: 16 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 84 పరుగుల స్కోర్ చేసింది.
తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లో దేవ్ దత్ పడిక్కల్ (25: 17 బంతుల్లో 3×4), అరోన్ ఫించ్ (16: 21 బంతుల్లో 2×4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (18 నాటౌట్: 17 బంతుల్లో 2×4), గుర్ కీరత్ సింగ్ మన్ (21 నాటౌట్: 26 బంతుల్లో 4×4) స్కోర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 13.3 ఓవర్స్ లో 85/2 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19
#20