Thank You TRP Rating: నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కలయికలో వచ్చిన ‘మనం’ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ కాంబోలోనే ‘థ్యాంక్యూ’ సినిమా రావడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.
థ్యాంక్యూ టీజర్, ట్రైలర్ లోని డైలాగ్స్, చైతన్య ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. అయితే సినిమా చూస్తే పేలవమైన కథ మరియు కథనాలతో ఆడియెన్స్ ను విసిగెత్తించేశారు. దీంతో ఈ మూవీ దారుణంగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీలోనూ ఆడియెన్స్ తిరస్కరించారు. ఇటీవల నాగ చైతన్య థ్యాంక్యూ సినిమా బుల్లితెర పై కూడా పరాజయం పొందింది.
జెమినీలో గత వారం ఈ సినిమా ప్రసారం కాగా, దారుణమైన రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకి కేవలం 3.41 రేటింగ్ వచ్చింది. హీరో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి 7.88 రేటింగ్ వచ్చింది. కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అదే టైమ్ లో సీతారామం స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు మంచి రేటింగ్స్ అందుకుంది. మొదటిసారి ప్రసారం చేయగా 8.73 టీఆర్పీ రావడం విశేషం. ఈ సినిమా రేటింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ టైం టిఆర్పి కంటే కూడా ఎక్కువే.
ఇక ఈ మూడు సినిమాలలో సీతారామం సినిమాకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి టెలికాస్ట్ చేయబడిన సర్కారు వారి పాట 6.8 రేటింగ్ వచ్చింది. అయితే ఒకప్పుడు TRP రేటింగ్ 20 పాయింట్ల కంటే ఎక్కువ ఉండేది. ప్రస్తుతం పుష్ప సినిమా టాప్ ప్లేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జనాలు టీవీల్లో మూవీస్ చూసేందుకు అంతగా ఆసక్తి పెట్టడం లేదని తెలుస్తోంది. దాంతో టీఆర్పీ రేటింగ్స్ 10కి తగ్గిపోయింది.


రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వస్తుందని మరోసారి రుజువైంది. ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఎవరిని ఎంచుకుంటే దాదాపు వారికే ఆస్కార్ అవార్డు వస్తాయంట. అయితే ఈ ఏడాది ఆ సంస్థ రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా ఎంచుకుంది. ఇక దీనితో రాజమౌళికి ఈసారి ఆస్కార్ అవార్డ్ వస్తుందని అందరు ఫిక్స్ అయిపోయారు. రాజమౌళి పై తెలుగు సినీ సెలెబ్రిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కంగ్రాట్స్ చెబుతున్నారు. అడివి శేష్, శోభు యార్లగడ్డ వంటి వారు స్పందించారు.
మరి జక్కన్నకి ఆస్కార్ అవార్డ్ వస్తుందో, లేదో చూడాలి. రాజమౌళికి ఒకవేళ ఆస్కార్ అవార్డ్ కనుక వస్తే, భారతీయ సినీ పరిశ్రమకే అది గర్వకారణం అవుతుంది. వందేళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో ఏ దర్శకుడికి ఇంత వరకు ఆస్కార్ అవార్డు రాలేదు. రాజమౌళి RRR మూవీని ఇంటర్ నేషనల్ లేవల్లో ప్రమోట్ చేశాడు. విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా విజయం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పన్నెండు వందల కోట్లు వసూల్ చేసింది. జపాన్లో ఈ సినిమా ఇప్పటికీ బాగానే ఆడేస్తోంది.
ప్రస్తుతం పూరీ జగన్నాధ్ రాబోయే సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. పూరీ ఇప్పటివరకు తదుపరి మూవీ గురించి ఏ వివరాలను కూడా ప్రకటించలేదు. అయితే పూరీ జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా, ఓ సినిమాకు దర్శకత్వం చేస్తాడని వినిపించాయి. ఆ విషయం పై ఎలాంటి సమాచారం లేదు. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాధ్ కొత్త ప్రాజెక్ట్ కోసం హీరో రవితేజతో చర్చలు జరుపుతున్నాడని తెలిస్తోంది.
ఇంతకుముందు పూరీ, రవితేజ కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పూరి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? ఎందుకంటే రవితేజ ఒప్పుకున్న సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. మరో రెండేళ్ల వరకూ డేట్స్ ఖాళీగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ కెరీర్ ఎదుగుదలకు కావాల్సిన హిట్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ కోసం డేట్స్ తప్పకుండా ఇస్తాడని అందరు అనుకుంటున్నారు. ఇంకా చర్చల దశలో ఉన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తుందో లేదో చూడాలి.
అయితే ఆయన దాని గురించి పట్టించుకోకుండా, దృష్టంతా షూటింగ్ పైనే పెట్టారు. ఆయన ఎప్పుడు ఆడియెన్స్ కి కథను గొప్పగా చూపించాలనే ఆలోచించారు. షూటింగ్ లో చాలా దుమ్ము ఉన్నా కూడా పని చేస్తూనే ఉన్నారు. ఆయన మూవీ అద్భుతంగా ఉండాలని ఎల్లప్పుడూ తాపత్రయపడతారు’ అని తెలిపారు. ఇక RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాని చాటి చెప్పింది ఈ సినిమా. బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం నమోదు చేసింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, రాజమౌళి దర్శకత్వం సినిమాకు విజయాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, అలియా భట్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ, ఆస్కార్ బరిలో కూడా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి గానూ దర్శక ధీరుడు రాజమౌళికి ఉత్తమ డైరెక్టర్ గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వచ్చింది. ఇండియా తరపున ఈ అవార్డు పొందిన తొలి డైరెక్టర్ రాజమౌళి అవడం విశేషం.
అడవి శేషు హీరోగా హిట్ 2 అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.నేచురల్ స్టార్ నాని మరియు ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఒక జర్నలిస్ట్ హిట్ సిరీస్ మూవీస్ లో సమంత లాంటి స్ట్రాంగ్ ఫిమేల్ విలన్ గా చేస్తే బావుంటుండి అని ట్వీట్ చేసాడు. అయితే దీనిని అడవి శేషు రీ ట్వీట్ చేయడమే కాక, ఇది అద్భుతమైన ఆలోచన సమంత ఏమంటావ్ అని సమంతను అడిగాడు. దానికి సమంత సమాధానంగా బాడ్ యాస్ కాప్,ఇది వినడానికి చాలా ఫన్నీగా ఉంది అని కామెంట్ పెట్టింది.
అంతేకాక నీ సినిమా హిట్టు అయినందుకు కంగ్రాట్స్, నిన్ను ఎప్పటికీ చీర్ చేస్తూనే ఉంటా అని కామెంట్ చేసింది. అయితే సమంత హిట్ సిరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చేసింది. ఇంకో వైపు సమంత అభిమానులు ఆమె ట్వీట్ చేసిందంటే అనారోగ్యంతో లేదని, బాగానే ఉందని సంతోషపడుతున్నారు. ఇది ఇలా ఉంటే, హిట్ సిరీస్ను 8 భాగాలుగా రూపొందించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. హిట్ 2 ప్రమోషన్స్ లోనే 3వ పార్ట్ గురించి తెలిపారు. అయితే హిట్ 3 లో నాని హీరోగా, కీలక పాత్రలో అడివి శేష్ నటిస్తాడని తెలిపారు.
ఈ డాన్స్ క్లిప్ను ఆడిటర్గా ఉన్న నటాలియా ఒడెగోవా అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో మహిళల డాన్స్ చేస్తుండగా, ఒక పాప వారిని అనుకరించి ఆకట్టుకుంది. బుధవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు 10,000 కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. పుష్ప సినిమా డిసెంబర్ 8న రష్యాలో విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప-ది రైజ్ రష్యన్ భాషా ట్రైలర్ విడుదలైంది. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది
అల్లు అర్జున్ మరియు పుష్ప టీం ఇప్పటికే ప్రమోషన్స్లో బిజీగా ఉంది. గురువారం మాస్కోలో పుష్ప ప్రీమియర్షోను ప్రదర్శించారు. దీనికి కథానాయకుడు అల్లు అర్జున్, నాయిక రష్మిక మందన్న, డైరెక్టర్ సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. అంతే కాకుండా డిసెంబర్ 3న సెయింట్పీటర్స్బర్గ్లో మరో ప్రీమియర్ షో ఏర్పాటు చేసారు. అల్లు అర్జున్ మరియు అతని బృందం ఇటీవల దీనికి సంబంధించి విలేకరుల సమావేశానికి హాజరయ్యారు.
ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇక ఈ లగ్జరీ కారు ఖరీదు రూ. 1.34 కోట్లు అని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ గ్యారేజీలో లగ్జరీ కార్లు ఉన్నాకూడా, తాజాగా కొత్త కారును కొన్నారు. త్రివిక్రమ్ బీఎండబ్ల్యూ కారు కొంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న కారు రంగును చూస్తే, BMW 7 సిరీస్ 740 లీటర్ మోడల్ కారుగా అంచనా వేయబడింది. కారు ఖరీదు విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ బీఎండబ్ల్యూ కారును తన భార్యకు బహుమతిగా ఇచ్చారని సమాచారం.
డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య సౌజన్య మంచి క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ఇప్పటికే చాలా వేదికలపై తన నృత్య ప్రదర్శన చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పూర్తి అయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్, మహేష్ SSMB28 సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.
ఎందుకంటే ‘ఆచార్య’లో చిరంజీవి హీరోగా నటించగా, రామ్ చరణ్ ముఖ్యపాత్రలో నటించాడు. ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ‘లూసిఫర్’ రీమేక్ గా వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటించాడు. గాడ్ ఫాదర్ కి పాజిటివ్ టాక్ వచ్చి, వసూళ్లు కూడా బాగానే ఉన్నా, ఫలితం మాత్రం హిట్ అయితే కాలేదు. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాలూ నిరాశపరిచాయి.దీంతో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ కలవర పడుతున్నారు.
అమితాబ్ బచ్చన్ వీరాభిమాని అయిన రవితేజ సినిమాల్లోకి రావడానికి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవే కారణం అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. రవితేజ ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘అన్నయ్య’ సినిమాలో మెగాస్టార్ తమ్ముడిగా నటించాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ముఖ్యమైన పాత్రలో రవితేజ కనిపిస్తాడని తెలుస్తోంది.
ఈమధ్య కాలంలో మోహన్ బాబు కుటుంబం తరచూ వివాదాల్లో ఉండటం కూడా ఈ మూవీ పై ప్రభావం చూపిందని అంటున్నారు. థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ మూవీగా నిలిచిన జిన్నా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ మూవీకి దర్శకుడు నాగేశ్వర రెడ్డి స్టోరీ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో రఘు బాబు, అన్నపూర్ణమ్మ, సీనియర్ నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, చమ్మక్ చంద్ర, తదితరులు నటించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
ఇక అమెజాన్ కంటెంట్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొంచెం సందేహం వచ్చిన రీషూట్స్,రీ ఎడిటింగ్స్, డిస్కషన్స్ లాంటివి తప్పకుండా చేస్తారు. అయితే ‘దూత’వెబ్ సిరీస్ విషయంలోనూ అలాంటిదే జరుగుతోందని తెలుస్తోంది. అదీ కాకుండా ప్రస్తుతం దర్శకుడు విక్రమ్, నాగచైతన్య ఫామ్ లో లేరు. ఇద్దరు థాంక్యూ సినిమాతో చేతులు కాల్చుకున్నారు. బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అందువల్ల ‘దూత’వెబ్ సిరీస్ ని విడుదల చేయడం వల్ల బజ్ ఉండకపోవచ్చని అమెజాన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నాగచైతన్య నటించే సినిమా ఏదైనా హిట్ అయిన్నప్పుడు కానీ, ‘దూత’ పై మంచి బజ్ వచ్చాక కానీ ఈ సిరీస్ ను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెజాన్ లో కంటెంట్ కి సమస్య లేదు. దాంతో ఈ వెబ్ సిరీస్ ను హోల్డ్ లో ఉంచారని సమాచారం. అయితే అమెజాన్ సంస్థ ఈ సిరీస్ విడుదల అవనప్పటికి ‘దూత2’ కోసం స్క్రిప్ట్ రాయమని విక్రమ్ కుమార్ ని కోరిందని తెలుస్తోంది. అంటే దూత రెండవ సీజన్ కూడా ఉంటుందని క్లారిటీ అయితే వచ్చేసింది. నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’అనే మూవీలో నటిస్తున్నారు.