డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి పరిచయం అక్కర్లేదు. రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. తర్వాత దర్శకుడుగా మారి సూపర్ హిట్లు తరికెక్కించి నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా వెలుగొందుతున్నారు.
త్రివిక్రమ్ డైలాగ్స్ కి ఎంతమంది ఫాన్స్ ఉన్నారో ఆయన స్పీచ్ కూడా అంతే మంది ఫాన్స్ ఉన్నారు. ఏదైనా ఫంక్షన్ లో స్టేజ్ మీద త్రివిక్రమ్ మాట్లాడుతున్నారు అంటే చప్పుడు చేయకుండా ఆయన ఏం చెప్తున్నారా అని నిశ్శబ్దంగా వింటూ ఉంటారు. ఆయన మాటలకు ఉన్న పవర్ అటువంటిది విలువ అటువంటిది.

ఎప్పుడైనా బోర్ కొట్టిన, లో ఫీలింగ్ అనిపించిన త్రివిక్రమ్ మాటలు వింటే సరిపోతుంది. ఎక్కడ లేని ఉత్సాహం తనూకు వస్తుంది. ఇప్పటికీ రైటర్ గా త్రివిక్రమ్ పనిచేసిన సినిమాలు టీవీలో వస్తున్నాయంటే పడి పడి చూస్తాం. నువ్వు నాకు నచ్చావు,మల్లీశ్వరి, చిరునవ్వుతో, జై చిరంజీవ లాంటి సినిమాల్లో త్రివిక్రమ్ డైలాగ్స్ కి క్లాప్స్ కొట్టని వారు ఉండరు.తర్వాత ఆయన దర్శకుడిగా మారి తరుణ్ తో నువ్వే కావాలి సినిమాని తెరకెక్కించారు.

తర్వాత మహేష్ బాబు తో అతడు, పవన్ కళ్యాణ్ తో జల్సా వంటి సూపర్ హిట్ సినిమాలు అతని ఖాతాలో ఉన్నాయి. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు తెరకెక్కించారు.ఇక త్రివిక్రమ్ కుటుంబ విషయానికొస్తే ఆయన భార్య లక్ష్మి సౌజన్య ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ్ముడి కూతురు. ఆమె ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలో నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ కి ఇద్దరు కొడుకులు. తాజాగా త్రివిక్రమ్ కొడుకు ఫోటోని సిరివెన్నెల సీతారామశాస్త్రి కొడుకు రాజా చెంబోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ ఫోటోలో త్రివిక్రమ్ భార్య కూడా ఉన్నారు. త్రివిక్రమ్ కొడుకు రిషి ని చూసిన ఎవరైనా సరే అచ్చం త్రివిక్రమ్ నోట్లో నుండి ఊడిపడ్డాడు అన్నట్టు ఉన్నాడు. త్రివిక్రమ్ ఫేస్ కట్స్ తో, కళ్ళజోడుతో జిరాక్స్ కాపీలా అనిపిస్తున్నాడు అని అభిమానులు చెబుతున్నారు. త్వరలోనే త్రివిక్రంలా దర్శకుడిగా మారి సినిమాలు తెరకెక్కిస్తాడు ఏమో చూడాలి.
Also Read:“టైగర్ నాగేశ్వరరావు” మూవీ గురించి ఈ నెటిజెన్ పోస్ట్ చూస్తే నవ్వాపుకోలేరు..!



ఒకవేళ తాను హఠాత్తుగా చనిపోతే ఎవరికి ఎంత డబ్బు వస్తుంది, ఏ ఇన్సూరెన్స్ నుంచి వస్తుందని వివరంగా తెలియజేశారని అన్నారు. కానీ ఎందుకు మమ్మీ నువ్వు ఇలా మాట్లాడతావు అంటూ పిల్లలు అడిగారని, ఏది ఏమైనా పిల్లలకు రియాల్టీ గురించి తెలియజేయాలని తెలిపారు. ఈ క్షణం పక్కన పెడితే రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఇలాంటి విషయాలు ధైర్యంగా పిల్లలకు షేర్ చేయాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఇప్పుడు సుమా వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. సుమా చేసిన వ్యాఖ్యలు నిజమేనని పలువురు మద్దతు తెలుపుతున్నారు.




నయనతార ఇంట్లో ఎనిమిది మంది పనివాళ్లు పని చేస్తారు. అయితే పనిచేసేవారిలో ఒకరికి 4 లక్షల అప్పు ఉందని తెలియగానే, వెంటనే నయనతార వారికి ఉన్న 4 లక్షల రూపాయల అప్పు తీర్చేసింది. పని వారి కష్టం తెలుసుకుని, తీర్చే గొప్ప మనసు నా కోడలిదని, అంతేకాకుండా తన దగ్గర పనిచేసేవాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా చేసేందుకు పెద్ద మనసు ఉండాలి. తన కోడలు పది మంది చేసే పనిని తనొక్కతే చేయగలదు అంటూ నయనతారను పొగిడింది విగ్నేష్ తల్లి మీనా కుమారి.
అయితే విగ్నేష్ తల్లి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే నయనతార దంపతులు సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారారు. మరో వైపు నయనతార పెళ్లి తర్వాత కూడా సినిమాలలో అదే ఉత్సాహంతో నటిస్తోంది.ప్రస్తుతం ఆమె చేతి నిండా చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక అత్యదిక పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోయిన్లలో ఇప్పటికీ నయనతార టాప్ ప్లేస్ లో ఉంది.