“క్షణం కూడా నిన్ను మర్చిపోలేను..!” అంటూ… “తారకరత్న” భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..!

“క్షణం కూడా నిన్ను మర్చిపోలేను..!” అంటూ… “తారకరత్న” భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్..!

by kavitha

నందమూరి తారకరత్న కన్నుమూసి 2 నెలల గడుస్తున్నప్పటికి  ఆయన ఫ్యాన్స్ తారకరత్న మరణవార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి భర్తను తలుచుకుంటూనే బ్రతుకుతోంది. ఆ బాధ నుండి  కొలుకోలేకపోతున్నారు.

Video Advertisement

ఎంతగానో ప్రేమించి, వివాహం చేసుకున్న భర్త తనను అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోవడంతో అలేఖ్య తారకరత్న లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో తారకరత్న గురించి ఇప్పటివరకు చాలా ఎమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా అలేఖ్య రెడ్డి తన భర్తను తలుచుకుంటూ మరో వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
alekhya-reddy-shares-emotional-videoతారకరత్న, అలేఖ్య రెడ్డి ప్రేమించుకుని, పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. ఇప్పుడిప్పుడే జీవితంలో ఆనందంగా ఉంటున్న సమయంలో తారకరత్న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం అలేఖ్యను ఎంతగానో కృంగదీసింది. ఎంతగా అంటే తారకరత్న మరణించి 2 నెలలు అవుతున్నప్పటికి  అలేఖ్య ఇంకా భర్త జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నారు.
అలేఖ్య రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో తారకరత్న పిల్లలతో సరదాగా ఆడుకుంటున్న హ్యాపీ మూమెంట్స్ కి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, ఎమోషనల్ పోస్ట్ చేశారు. అలేఖ్య రెడ్డి నిన్ను తలచుకోకుండా ఒక్క క్షణం అయినా ఉండలేకపోతున్నా అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు అలేఖ్య రెడ్డి ఈ బాధ నుండి బయటకు రావాలని కోరుకుంటున్నారు.
alekhya-reddy-shares-emotional-video2 ఇక నందమూరి తారకరత్న జనవరి 27న నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్ర మొదలైన కాసేపటికే  తారకరత్న గుండెపోటు రావడంతో స్పృహ కోల్పోయారు. దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చారు. తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పటల్ లో చేర్చారు. ఆయన అక్కడే ట్రీట్మెంట్ పొందుతూ ఫిబ్రవరి 18న  తుదిశ్వాస విడిచారు.

https://www.instagram.com/p/CqxsLwZKdNe/

Also Read: “ఈ కష్టాల వల్ల ఇలా మారిపోయాను..!” అంటూ సమంత కామెంట్స్..! ఏం అన్నారంటే..?


You may also like