Ads
1987- 1988 మధ్య డిడి నేషనల్ లో ప్రచారం చేయబడిన ధారవాహిక రామాయణం. ఇది ఆ రోజుల్లో ఎంతగా పాపులర్ అయిందంటే ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించబడిన టెలివిజన్ సిరీస్ గా మారింది. దీనికి 82% వీక్షకులు ఉన్నారు.
Video Advertisement
రిపీట్ టెలికాస్ట్ మొత్తం ఐదు ఖండాల్లో, 17 దేశాలలో 20 వేరు వేరు చానల్లో వేరు వేరు సమయాల్లో ప్రసారం చేయబడింది. ఈ సిరీస్ విజయాన్ని మీడియా చక్కగా నమోదు చేసింది. బీబీసీ ప్రకారం ఈ సీరియల్ ను 650 మిలియన్లకు పైగా వీక్షితులు వీక్షించారు.
సిరీస్ యొక్క ప్రతి ఎపిసోడ్ కి డిడి నేషనల్ 40 లక్షలు సంపాదించినట్లు నివేదించింది. ఈ ధారావాహికను సాగర్ ఆర్ట్స్ నిర్మించింది విష్ణువు యొక్క ఏడవ అవతారం అయిన రాముని కథ ఇది. రాక్షస రాజు రావణుడు నుంచి అతని భార్య సీతను రక్షించడానికి అతను చేసిన ప్రయాణాన్ని చిత్రీకరించింది. ఈ ధారవాహిక హిందూ మతంలోని పవిత్ర గ్రంథం అయిన వాల్మీకి రామాయణం యొక్క కథనాన్ని అనుసరించింది. ఇది రాముడు అతని సోదరుడు లక్ష్మణుడు అంకితభావం గల వానర దేవుడు హనుమంతుడు ఎదుర్కొన్న వివిధ సాహసాలు సవాళ్లను చిత్రీకరించింది.
ఈ కథలో రాముడు వనవాసం రావణుడు సీతను అపహరించడం లంకకు వంతెనను నిర్మించడం రాముడు రావణుడి మధ్య యుద్ధం చివరికి రాముడు తన రాజ్యమైన అయోధ్యకు విజయవంతంగా తిరిగి రావడం వంటి కథలను కలిగి ఉంటుంది. ఈ సీరియల్ లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికాలియా నటించారు. ఇక సునీల్ లహరి, అరవింద్ త్రివేది, ధారాసింగ్ వారి వారి పాత్రలకు తగ్గట్టు నటనతో సీరియల్ ని ఒక రేంజ్ కి తీసుకువెళ్లారు.
ఈ సీరియల్ కి డైరెక్టర్ రామానంద్ సాగర్ కాగా స్వరకర్త రవీంద్ర జైన్. నిర్మాతలుగా రామానంద సాగర్, ఆనంద్ సాగర్, మోతీసాగర్ వ్యవహరించారు. ఇక ఈ సీరియల్ లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ ని అయితే ఆ రోజులలో సాక్షాత్తు దేవుడి గానే భావించేవారు జనాలు. ఎక్కడ కనిపించినా హారతులు బట్టి బ్రహ్మ రథం పట్టేవారు. అంతటి చరిత్ర కలిగిన వారు కాబట్టే ఆ నటీనటులని అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టకి ఆహ్వానం లభించింది. అయోధ్యలో వారికి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఇన్ని రోజుల తర్వాత కూడా వీళ్ళకి ఇంత గౌరవమా అని ఆశ్చర్యం కలగక మానదు.
watch video :
https://www.instagram.com/reel/C2OsqZORmEc/?igsh=NjZiM2M3MzIxNA==
End of Article