Ads
దక్షిణాఫ్రికా తో లక్నో వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టుకి 9 పరుగుల తేడాతో పరాభవం ఎదురైంది. వర్షం కారణంగా 40 ఓవర్లకి కుదించిన ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా టీమ్ 249 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో సంజు శాంసన్ (86 నాటౌట్: 63 బంతుల్లో 9×4, 3×6) చివరి వరకూ పోరాడినా భారత్ 240/8కే పరిమితమైంది.
Video Advertisement
దాంతో మూడు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యాన్ని అందుకోగా.. రెండో వన్డే మ్యాచ్ ఆదివారం రాంచీ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకి ప్రారంభంకానుంది. 250 పరుగుల లక్ష్యఛేదనని భారత్ పేలవంగా ఆరంభించింది. కెప్టెన్ శిఖర్ ధావన్, ఓపెనర్ శుభమన్ గిల్ సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోగా.. అనంతరం వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ కూడా తేలిపోయారు.
దాంతో 17.4 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ జట్టు 51/4తో ఒత్తిడిలో పడిపోయింది. ఈ దశలో సంజు శాంసన్ , శ్రేయాస్ అయ్యర్ (50: 37 బంతుల్లో 8×4) జోడి ఐదో వికెట్కి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ని మళ్లీ మ్యాచ్లోకి తెచ్చింది. శార్ధూల్ ఠాకూర్, సంజు శాంసన్ జోడి కూడా భారత్ లక్ష్య ఛేదన పై ఆశలు కల్పించింది. ఈ నేపథ్యం లో ఘోరంగా పరాభవం పాలవుతుంది అనుకున్న భారత జట్టు మ్యాచ్ లో పుంజుకోవడం పై నెట్టింట మీమ్స్ సందడి చేస్తున్నాయి.. వాటి పై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
End of Article