దర్శకుడు గుణశేఖర్ ది ఓ విభిన్న ఆలోచనా విధానం. కళ్ళ ముందు విజువల్ వండర్ ను ఆవిష్కరించాలనుకుంటారు. చివరిగా ఆయన చారిత్రక నేపథ్యం లో వచ్చిన రుద్రమదేవి చిత్రం చేసారు. అయితే ఆ చిత్రం తర్వాత మరో చిత్రం చెయ్యలేదు గుణశేఖర్. అయితే చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తో ‘శాకుంతలం’ సినిమా చేసారు.
Video Advertisement
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో డిఆర్పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) – గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ‘శాకుంతలం’ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట గత ఏడాది నవంబర్లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17 అనుకున్నారు. చివరికి ఏప్రిల్ 14 నా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం తో ఈ చిత్రం తరచూ వాయిదాలు పడుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు కబ్జ మూవీ రివ్యూ చెప్పేసారు. ” శాకుంతలం మూవీ ఫైనల్ కట్ ఎడిటింగ్ పూర్తి అయ్యింది. ఇన్సైడ్ రిపోర్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సమంత మంచి చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది ” అని ఉమైర్ సంధు ట్వీట్ చేసారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు.
ఇందులో శకుంతల పాత్రలో సమంత… ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ స్వయంగా ఈ సినిమా స్క్రీన్ప్లేపై పనిచేశారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ మరియు మూడు పాటలు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. ఈ చిత్రం లో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అల్లు అర్హ, అదితి బాలన్, అనన్య నాగళ్ల మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.