సంక్రాంతి పండుగను తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరుపుతారు. పండుగ జరిగే రోజుల్లో సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అన్న నమ్మకం చాల మందికి మేకర్స్ కి ఉంటుంది. అందుకే హీరోలు సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇలాంటి పోటీ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య , బాలయ్య వీర సింహ రెడ్డి సినిమాల మధ్య ఉంది.
Video Advertisement
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతికి థియేటర్లలోకి దిగనుంది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మైత్రీ మూవీస్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్. థమన్ స్వరాలు అందిస్తున్నాడు.
అలాగే చిరు కూడా బాబీ దర్శకత్వం లో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నారు. దీనికి దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్స్ అందిస్తున్నారు. అయితే ఈ రెండు చిత్రాల నుంచి సింగిల్స్ రిలీజ్ చేసారు మేకర్స్. మంచి మాస్ బీట్ తో ఈ రెండు పాటలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.
అయితే ఇంటర్నెట్లో ఒక వీడియో వైరల్ అవుతోంది. బాస్ పార్టీ పాటను థమన్ చేస్తే ఎలా ఉంటుంది అని..బాస్ పార్టీ ఆడియో కి.. జై బాలయ్య లోని థమన్ వీడియో ని యాడ్ చేసి పెట్టారు కొందరు మీమర్స్. దీంతో నెటిజన్లు ఈ వీడియో పై ఫన్నీగా స్పందిస్తున్నారు.
watch video:
https://www.instagram.com/reel/ClX4w3op7wE/?igshid=YmMyMTA2M2Y%3D