Ads
సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ సినిమా ఇది. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు. సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ.
Video Advertisement
రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తెర మీద హైలెట్ బాలకృష్ణ అయితే, తెర వెనకాల హీరో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పాటలతో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి సీన్ హైలెట్ అవ్వడానికి ఒక కారణంగా నిలిచింది.
ఇదంతా సినిమాలో కొత్తగానే ఉన్నా.. ఒకటి మాత్రం మారలేదు. అన్ని బోయపాటి సినిమాలలోనూ హీరోయిన్ కచ్చితంగా ఏడుస్తూ ఉంటుంది. అఖండ సినిమా కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అఖండ లో కూడా ప్రగ్యా జైస్వాల్ పలు సీన్స్ లో ఏడుస్తూనే ఉంటుంది.
End of Article