మెయిన్ రోల్ అని చెప్పి 5 సెకండ్ల రోల్ ఇచ్చారు.. ఆ సూపర్ హిట్ సినిమా వెనుక మోసమేంటో చెప్పిన అడివి శేష్..!

మెయిన్ రోల్ అని చెప్పి 5 సెకండ్ల రోల్ ఇచ్చారు.. ఆ సూపర్ హిట్ సినిమా వెనుక మోసమేంటో చెప్పిన అడివి శేష్..!

by Anudeep

Ads

అడివి శేష్ తెలియని సినిమా లవర్ ఉండరంటే అతిశయోక్తి కాదు. థ్రిల్లర్ శైలిలో ఆయన చిత్రాలు ఇతర తెలుగు చిత్రాలకు భిన్నంగా ఉంటాయి. ఎవరు ఊహించని ట్విస్టులతో సినిమా ఆద్యంతం రసవత్తరంగా సాగుతూ ఉంటుంది. చిన్న వయసు నుంచే ఇండస్ట్రీలో ఉన్న అడివిశేష్ పంజా సినిమాలో విలన్ రోల్ తో బాగా పాపులర్ అయ్యారు.

Video Advertisement

నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా అడివిశేష్ మంచి పేరుని సంపాదించుకున్నారు. 2010 లో తొలిసారిగా కర్మ సినిమాతో అడివిశేష్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

adavisesh new

2018 లో గూఢచారి సినిమా ఆయనకు ఎక్కడలేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆయన నటించిన మేజర్ సినిమా జూన్ మూడవ తేదీన విడుదల కాబోతోంది. ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటె.. ఒక మంచి రైటర్ ని అయ్యేవాడినేమో అని అడివిశేష్ చెబుతూ ఉంటారు.

ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొంటున్న అడివిశేష్ పలు ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చారు. సొంతం సినిమాలో మెయిన్ రోల్ అని చెప్పి తీసుకున్నారని, కానీ కేవలం మూడు రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ అయిపోయిందన్నారు. అయితే.. సినిమా విడుదల అయిన తరువాత.. అందులో తన పాత్ర నిడివి కేవలం ఐదు సెకండ్లు మాత్రమే.. ఆరోజు కొంచం బాధపడ్డానని అడివిశేష్ చెప్పుకొచ్చారు.


End of Article

You may also like