అప్పుడు 500 రూపాయల స్థోమత కూడా లేదు… కానీ ఇప్పుడు కోట్లకి అధిపతి అయ్యింది..! ఈ మహిళ కథ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

అప్పుడు 500 రూపాయల స్థోమత కూడా లేదు… కానీ ఇప్పుడు కోట్లకి అధిపతి అయ్యింది..! ఈ మహిళ కథ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

by Anudeep

Ads

ఒకప్పుడు 500 రూపాయల అప్పులతో ప్రారంభం అయిన ఓ మహిళ ప్రస్థానం.. నేడు కొన్ని కోట్ల సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిగా అందరితో శభాష్ కృష్ణ అనిపించుకుంటున్న.. ఓ కృష్ణ కథ ఇది.. సొంత ఊళ్ళో ఉద్యోగం దొరకక బతుకు తెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లే వారిని అనేక మందిని చూస్తుంటాం. అలా వలస వెళ్లి సక్సెస్ అయిన ఓ మహిళ విజయగాధే ఇది.

Video Advertisement

ఉత్తరప్రదేశ్ కు చెందిన బులంద్ షహర్ కు చెందిన కృష్ణ యాదవ్ కుటుంబం 1995-96 సమయంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆమె భర్త మానసిక రుగ్మతతో పోరాడుతుండడంతో ఇంటి బాధ్యతలు కృష్ణ తన భుజాలపై వేసుకుంది. మొదట్లో ఆమె అనేక కష్టాలను ఎదుర్కొంది. అయితే ఇక్కడే సొంత ఊళ్ళో ఉంటే అభివృద్ధి సాధించలేం  అని భావించి మంచి అవకాశాల కోసం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకుంది. 500 రూపాయల అప్పు చేసి కుటుంబంతో కలిసి కొత్త ఊరిలో అడుగు పెట్టింది కృష్ణ.

ఢిల్లీలో ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరకు ఆమెకు వచ్చిన ఏకైక అవకాశం కమాండెంట్ యాజమాన్యంలోని పొలాన్ని చూసుకోవడం.  తన వచ్చిన అవకాశాన్ని దేన్నైనా ఉపయోగించుకోవాలని, లేకుంటే మనుగడ సాగించలేం అని ఆమె గట్టిగా నమ్మింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా – బెర్ మరియు కరోండా – అని పిలువబడే రెండు రకాల బెర్రీలను పొలం సాగు చేసింది. వీటికి మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందని, లాభాలను పెంచుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని శాస్త్రవేత్తలు సూచించారు. అప్పటికే, కృష్ణ వ్యవసాయ ప్రక్రియలో నిమగ్నమైంది.

మరియు 2001లో, ఉజ్వాలో ఉన్న ఒక ఇన్‌స్టిట్యూట్ నుండి ఫుడ్ ప్రాసెసింగ్‌లో మూడు నెలల శిక్షణ తీసుకుంది. శిక్షణ ముగిసిన తర్వాత, కృష్ణ ఒక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆమె రూ. 3,000 పెట్టుబడి పెట్టి చిల్ మరియు బెర్రీ పచ్చళ్లను సిద్ధం చేసింది.  ఊరగాయ అమ్మడం ద్వారా ఆమెకు రూ. 5,250 లాభం వచ్చింది. అది అంత పెద్ద మొత్తం కానప్పటికీ, ఆమెకు చాలా ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. ఈ సమయంలోనే ఆమె భర్త తనకు తోడుగా నిలిచాడు. కృష్ణ ఇంట్లో ఊరగాయలు చేస్తే.. ఆమె భర్త దానిని ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ వీధుల్లో బండ్లపై విక్రయించేవాడు. కరోండ ఊరగాయ మరియు మిఠాయి అనే కాన్సెప్ట్ ప్రజలకు కొత్త అయినప్పటికీ, కృష్ణ ఉత్పత్తులకు మంచి స్పందన వచ్చింది.

ఇది ఆమె విశ్వాసాన్నే కాదు ఉత్పత్తులను కూడా పెంచింది. కట్ చేస్తే.. ఈ రోజు శ్రీ కృష్ణ పికిల్స్ బ్యానర్‌లో, కొన్నేళ్ల క్రితం మార్కెట్ గురించి ఏమీ తెలియని ఒక మహిళ 152 రకాల పచ్చళ్లు, మురబ్బా, చట్నీలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు ఆమె వ్యాపారానికి 500 క్వింటాళ్లకు పైగా ఉత్పత్తులు  అవసరమవుతుందంటే నమ్ముతారా!? ఇటీవల, ఆమె తన వ్యాపారాన్ని జ్యూస్‌లు, స్క్వాష్‌లు మరియు సూప్‌ల వంటి పానీయాల రంగానికి కూడా విస్తరించింది. బండిపై తన ఇంట్లో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించిన ఒక మహిళ నేడు కోట్ల రూపాయల మార్కెట్ వాటాను సొంతం చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది కదా! అంతేకాదు, ఇప్పుడు కృష్ణ 250 నుంచి 300 మందికి పైగా మహిళలకు ఉపాధిని కల్పిస్తుంది.

అనేకమంది రైతులు తమ కూరగాయలు, పండ్లకు తక్కువ ధర లభించినా కృష్ణకే పంపుతున్నారు. దీనివల్ల త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి రైతులు తమను తాము కాపాడుకుంటున్నారు. మహిళా వ్యవస్థాపకత రంగంలో ఆమె సాధించిన విజయాలకు గాను మార్చి 8, 2016న మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమె సాధించిన విజయాలకు అవార్డ్ తో సత్కరించింది. ఒకప్పుడు 500 రూపాయల అప్పులతో ప్రారంభం అయిన కృష్ణ జీవన ప్రస్థానం అనేక ఒడిదుడుకులతో నేడు కొన్ని కోట్ల సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి అయి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ.. శభాష్ కృష్ణ అని అనిపించుకుంటుంది.


End of Article

You may also like