కరోనా, నిఫా, మంకీ పక్స్, స్వైన్ ఫ్లూ… ఇలా ఏ వైరస్ అయినా మొదట కేరళలోనే ఎందుకు వ్యాపిస్తుంది..!?

కరోనా, నిఫా, మంకీ పక్స్, స్వైన్ ఫ్లూ… ఇలా ఏ వైరస్ అయినా మొదట కేరళలోనే ఎందుకు వ్యాపిస్తుంది..!?

by Anudeep

Ads

కరోనా తర్వాత అదే స్థాయిలో వణికిస్తున్న వైరస్‌ ‘మంకీపాక్స్‌’. ఇది అప్పుడెప్పుడో మూడు నాలుగు తరాల ముందు జనాన్ని భయభ్రాంతుల్ని చేసిన మశూచీ (స్మాల్‌పాక్స్‌) కుటుంబానికి చెందినది.దీన్ని తొలిసారిగా 1958లో కనుగొన్నారు. కోతులు ఎక్కువగా ఉండే కాలనీల్లో బయటపడటం వల్ల దీనికి ‘మంకీ పాక్స్‌’ అని అంటారు. అయితే మానవుల్లో మొదటి కేసును 1970వ సంవత్సరంలో కనుగొన్నారు. దీన్ని ఆఫ్రికా ఖండంలోని కాంగోలో కనుగొన్నారు.

Video Advertisement

అప్పట్లో ఆఫ్రికా ఖండంలోనే లైబీరియా, నైజీరియా, సియారాలియోనీ లాంటి ప్రాంతాల్లోనూ కొన్ని కేసులు చూసినా అత్యధికంగా కనబడ్డది కాంగోలోనే. కానీ ఇప్పుడు తాజాగా ఒకేసారి వందల కేసులిప్పుడు అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలలోని అనేక దేశాల్లో కనబడుతుండటంతో ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది. ఇది వైరస్‌తో వచ్చే జబ్బు కావడం..

అందులోను ఒకసారి యూఎస్, యూరప్‌లలో కనిపించిందంటే ఇక మిగతా దేశాలకు చేరడానికి పెద్ద సమయం పట్టకపోవడం లాంటి అంశాలు అందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. మనదేశంలో ఇప్పటి మూడు మంకీపాక్స్ కేసులు బయటపడగా అందులో రెండు కేరళలోని నమోదయ్యాయి. ఇదేకాదు మొన్న స్వైన్ ఫ్లూ, జికా, నిఫా, కరోనా కూడా కేరళ నుంచే దేశమంతా వ్యాపించింది. అస్సలు కేరళలోని వైరస్ మొదట ఎందుకు వ్యాపిస్తాయో చూద్దాం..

కేరళలోనే మొదట వైరస్ ఎందుకు వ్యాపిస్తుంది:

కేరళ వైరల్ దాడులకు గురి కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి కేరళీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండటం. కేరళ నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు, నర్సులు వివిధ దేశాల్లో పని చేస్తున్నారు. విదేశాల్లో మెడికల్ కోర్సులు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు వైరల్ దాడుల యొక్క వృత్తిపరమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

నేచర్ జర్నల్‌ లోని ఓ కథనం ప్రకారం, అడవుల క్షీణత, పెంపుడు జంతువుల అధిక జనాభా సాంద్రత అలాగే మానవుల అధిక జనాభా సాంద్రత కూడా మరో కారణం కావొచ్చు. మానవ కార్యకలాపాలు సహజ ఆవాసాలను ఆక్రమించడం వల్ల, పెంపుడు జంతువులతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నందున వైరల్ మానవులకు “స్పిల్ ఓవర్” బదిలీ అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు పేర్కొన్నారు.

తిరువనంతపురం మెడికల్ కాలేజీకి చెందిన కమ్యూనిటీ మెడిసిన్ చీఫ్ డాక్టర్ TS అనీష్, మాతృభూమికి ఇచ్చిన నివేదికలో, పశ్చిమ కనుమల అడవుల్లోకి మానవుడు విస్తరించడం మరియు అడవుల్లో పండ్లు తగ్గడం వల్ల గబ్బిలాలు కేరళలోని మానవ నివాసాలకు ఆకర్షితులవుతున్నాయని తెలిపారు. ఈ గబ్బిలాలు వివిధ వ్యాధులను కలిగి ఉండవచ్చు, అందువల్ల వ్యాప్తి మరింత పెరుగుతుంది అన్నారాయన.

అలాగే కేరళ నుంచి జల, వాయు మార్గాలు అనుకూలంగా ఉండడం వల్ల విదేశీయులు ఇండియాలోకి సులభంగా ప్రవేశించగరు. దీంతో ఇతర దేశాల్లోకి వ్యాపించిన వైరస్ మనదేశంలో మొదట కేరళకు వ్యాప్తి చెందే ఎక్కువగా అవకాశం ఉంది. పై అనేక కారణాల వల్ల కేరళ వైరస్ లకు మొదటి ఆవాసంగా మారుతుంది.


End of Article

You may also like