ఎయిర్ టెల్ యూజర్లకు సంస్థ పెద్ద షాక్ ఇచ్చింది. ఉన్నట్లుండి ఇరవై ఐదు శాతం టారిఫ్ ను పెంచేసింది. అసలే పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసరాల ధరలు పెరిగి మండిపోతుంటే.. తాజాగా టెలికాం కంపెనీలు కూడా బాదుడు మొదలుపెట్టాయి.
తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటిల్లో ప్రీ-పెయిడ్ ప్లాన్స్ ధరలను బాగా పెంచింది.
ఈ వారం నుంచే ఈ పెరిగిన ధరలు అమలు లోకి రానున్నాయి. 2019 డిసెంబర్లోనే ఓ సారి ఎయిర్ టెల్ ధరలను పెంచింది. రెండేళ్ల తరువాత ఈ ధరలను మరోసారి పెంచుతోంది. ఆర్థిక ఆరోగ్యపరమైన బిజినెస్ మోడల్ కోసమే ఈ ధరలను పెంచుతున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది.
#1.
#2.
#3.
#4.
#5.
ఇది పెరగాలంటే.. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగాలని, అందుకోసమే ప్రీపెయిడ్ ప్లాన్స్ టారిఫ్ ను పెంచుతున్నామని ప్రకటించింది. భారత్ లోకి 5 జి ని తీసుకురావాలని అనుకుంటున్నామని.. అందుకోసం ఇది ఉపయోగపడుతుందని ప్రకటనలో పేర్కొంది. అయితే.. ధరలు పెరగడంతో సోషల్ మీడియాలో ఎయిర్ టెల్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#7.
#8.
#9.
#11.
#12.







































