ప్రస్తుతం భారత్ లో 2023 ప్రపంచ కప్ సందడి మాములుగా లేదు. ఇప్పటికే భారత్ 9 మ్యాచ్ లు నెగ్గి సెమీఫైనల్స్ కి ఎంటర్ అయింది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి ఇండియాకి మరో వరల్డ్ కప్ అందిచాలని ఇండియన్ టీం అంతా కసిగా పనిచేస్తుంది. ఇండియా అభిమానులు కూడా భారత్ కు తమ సంపూర్ణ మద్దతు అందిస్తున్నారు.
ఇప్పటివరకు ఇండియా 1983, 2011లో మాత్రమే వరల్డ్ కప్పులను నెగ్గింది. అయితే 2003లో కూడా ఇండియా వరల్డ్ కప్ నెగ్గాల్సి ఉండి మిస్సయింది అనే విషయం మీకు తెలుసా? 2003లో వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా తలపడ్డాయి. కానీ ఆ మ్యాచ్ లో అనూహ్యంగా ఆస్ట్రేలియా విజయం సాధించింది, ఇండియా ఓటమి పాలైంది.

ఇండియ నెగ్గాల్సిన మ్యాచ్ ఆస్ట్రేలియా నెగ్గడం ఏంటి అని అనుకుంటున్నారా? అప్పట్లో ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తూ 223 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. రిక్కీ పాయింటింగ్ క్రీజ్ లో ఉన్నాడు. అతను 46 పరుగులు వద్ద ఉండగా బౌలర్ వేసిన బంతి ప్యాడ్లు తాకి ఎల్బిడబ్ల్యూ అప్పీల్ చేశారు. కానీ అంపైర్ నాటౌట్ గా ప్రకటించడంతో రిక్కి పాయింటింగ్ సేఫ్ అయ్యాడు. 46 పరుగుల వద్ద అవుట్ అవ్వాల్సిన రిక్కీ పాయింటింగ్ 140 పరుగులు స్కోర్ చేశాడు. థర్డ్ ఎంపైర్ రివ్యూ లో అది అవుతని తేలిన అప్పట్లో డిఆర్ఎస్ సిస్టం లేకపోవడం వల్ల ఇండియా మ్యాచ్ ఓడిపోవలసి వచ్చింది. దాని కారణంగా ఇండియాకి రావాల్సిన వరల్డ్ కప్ ఆస్ట్రేలియా పట్టుకుపోయింది.

ఇప్పుడంటే ఐసీసీ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ప్రతి టీం కి రెండు రివ్యూలు ఇస్తుంది. అంపైర్ డెసిషన్ కరెక్ట్ కాదని అనిపిస్తే ఆ ప్లేయర్స్ రివ్యూ తీసుకుంటున్నారు. చాలా సందర్భాల్లో ప్లేయర్లు రివ్యూలు సక్సెస్ అయిన ఘటనలు కూడా ఉన్నాయి. వాటి వల్ల ఆ టీం విజయాలు కూడా నమోదు చేశాయి. DRS నీ డెసిషన్ రివ్యూ సిస్టం అంటారు. డిఆర్ఎస్ సిస్టం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఇండియన్ మాజీ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని. ధోని రివ్యూ తీసుకున్నాడు అంటే అది కచ్చితంగా అతనికి ఫేవర్ లోనే ఉంటుంది. అభిమానులు ముద్దుగా డిఆర్ఎస్ ని ధోని రివ్యూ సిస్టం కూడా పిలుచుకుంటారు.
watch video:
Also Read:సెంచరీ చేశాక బ్యాట్స్మెన్ తన బ్యాట్ ని ఎందుకు పైకి ఎత్తుతాడు..? కారణం ఏంటంటే..?

అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలిచేది ఎవరు అంటూ ఇప్పటికే పలువురు ప్రిడిక్షన్ లు స్టార్ట్ చేస్తున్నారు. సెంటిమెంట్లు ప్రకారం కొందరు, జాతకాల ప్రకారం కొందరు గెలిచేది ఈ టీం అంటూ కుండబద్దలు కొడుతున్నారు.ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ పండిట్ జగన్నాథ్ గురూజీ తన ఆస్ట్రాలజీని ప్రకారం ఈ వరల్డ్ కప్ లో ఇండియా గెలుస్తుందని తెలిపారు. ఆస్ట్రేలియా టీం జాతకంతో పోలిస్తే ఇండియా టీం జాతకం బలంగా ఉందని అన్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుండి ఇండియా టీం లో అది కనిపిస్తుందని, ఉత్సాహం, ఆనందం, బలం కలగలిపి ఇండియా టీం ఈ కప్పును సొంతం చేసుకుంటుందని చెప్పారు…
ఇక రోహిత్ శర్మ జాతకం కూడా అద్భుతంగా ఉందని 2011లో కెప్టెన్ ఎంఎస్ ధోని వరల్డ్ కప్ సాధించినట్లుగానే 2023 లో రోహిత్ శర్మ కూడా వరల్డ్ కప్ తీసుకొస్తాడని చెప్పారు. అలాగే మిగతా టీం ప్లేయర్ లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్,గిల్, సిరాజ్, బూమ్రా, షమీ ఇలా అందరి ప్లేయర్ ల జాతకాలు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఆస్ట్రేలియా ప్లేయర్ పాట్ కమిన్స్ జాతకం కూడా బాగానే ఉన్నప్పటికీ రోహిత్ శర్మతో పోలిస్తే అంత ఉత్సాహంగా లేదని అన్నారు.














అప్పటికే చరణ్ (సాయితేజ్) అనే వ్యక్తితో శృతి ప్రేమలో ఉంటుంది. ఆ తరువాత కొన్ని రోజులకు ప్రియ అనే అమ్మాయితో కలిసి హాస్టల్కు షిప్ట్ అవుతుంది. ఆ తరువాత శృతి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? చరణ్ నిజ స్వరూపం తెలుసుకున్న తరువాత శృతి ఏం చేసింది? అనుని చంపింది ఎవరు? అసలు ఈ గ్యాంగ్ను శృతి ఎలా ఆట కట్టించింది? శృతి ఆడిన మైండ్ గేమ్ ఏంటి? అన్నది తెరపై చూడాలి….!
అసలు మెయిన్ కథ అంతా కూడా సెకండాఫ్లోనే ఉంటుంది. ముందు నుంచి చూసిన సినిమా అంతా ఒకెత్తు అయితే..తర్వాత హన్సికను చూపించిన తీరు, ఆమె నటించిన విధానం ఒకెత్తు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో చూపించినే తీరు మరో ఎత్తు. అక్కడ వచ్చే ట్విస్టులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. బ్యూటీ విత్ బ్రెయిన్ అనే ట్యాగ్కు శృతిని ఉదాహరణగా చూపించాడు దర్శకుడు.
హన్సిక ఈ చిత్రాన్ని తన భుజాల మీద మోసింది. శృతి పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్లో ఒక రకంగా కనిపిస్తే.. క్లైమాక్స్లో ఇంకో రకంగా కనిపిస్తు నటనతో ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్స్లో మెప్పిస్తుంది. ఏసీపీ రంజిత్గా మురళీ శర్మ తన అనుభవాన్ని చూపించాడు. డీజీపీగా జయ ప్రకాష్, ఎమ్మెల్యేగా గురుమూర్తి తనకు అలవాటైన రీతిలో నటించారు. అప్పాజీ అంబరీష, సీవీఎల్, సాయి తేజ్, రాజా రవీంద్ర పాత్రలు మెప్పిస్తాయి.

