ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందు ఆలయాలు అన్నిటిలోకి అత్యంత ప్రసిద్ధమైనది తిరుమల తిరుపతి దేవస్థానం. కలియుగ వైకుంఠంగా భావించి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని దివ్య క్షేత్రం తిరుమల.సాక్షాత్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన ఈ దివ్య క్షేత్రంలో బ్రిటిష్ వారు కొన్ని నియమాలు ప్రవేశ పెట్టడం జరిగిందట. చాలామందికి అసలు ఈ విషయం తెలియదు.. మరి ఇంతకీ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందామా..
మన దేశాన్ని 200 సంవత్సరాల కు పైగా పరిపాలించిన బ్రిటిష్ దొరలు వెంకటేశ్వర స్వామి భక్తులుగా మారడమే కాకుండా గుడి అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టారు. టీటీడీ వద్ద ఉన్న పురాతన ఆలయ రికార్డుల ప్రకారం 1801 నుంచి 1843 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణ బాధ్యతలను అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నార్త్ అర్కాట్ నేతృత్వంలో జరిగింది.

అప్పట్లో దేవాలయంలో ఎన్నో అంతర్గత కలహాలు ఉండడంతో బ్రిటిష్ వారు కఠినమైన క్రమశిక్షణ మరియు నియమాలతో పాలనను గాడిలో పెట్టడం జరిగింది. ఈ మేరకు 183 జనవరి 31న తొలిసారిగా మద్రాసులోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ దొర తన నివేదికను కూడా సమర్పించారు. ఆయన తర్వాత విచారణ అధికారిగా వచ్చిన పి. బ్రూస్ టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలను నిర్దేశించారు. విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ కూడా టీటీడీ ఆ విధానాలను తూచా తప్పకుండా పాటిస్తోంది. మరి అవి ఏమిటో చూద్దాం..

1.దిట్టం
శ్రీవారికి సమర్పించేటటువంటి నైవేద్యానికి సంబంధించిన ముడి ఏ పరిమాణంలో తీసుకోవాలి నిర్ణయించేదే దిట్టం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదరూపేనా తయారు చేసే లడ్డూలు దగ్గర నుంచి వాడే పుష్పాల వరకు దీన్ని అనుసరిస్తారు.

2.కైంకర్యపట్టీ
తిరుమల తిరుపతి దేవస్థానంలోని సిబ్బంది, పరిచారికలు, మిరాశీ దారులు మరియు జియ్యర్ సిబ్బంది విధులకు సంబంధించి 1801 మరియు 1820లో రెండు సార్లు ఈ కైంకర్యపట్టీ తయారు చేయడం జరిగింది. దీని ఆధారంగానే సిబ్బంది యొక్క నియామకం, హోదా, విధులు ,జీతభత్యాలు ఆధారపడి ఉంటాయి.

3.బ్రూస్ కోడ్
ఈస్ట్ ఇండియా కోడ్ ఆఫ్ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం అప్పట్లో ఆలయ పాలన సక్రమంగా జరగడం కోసం బ్రూస్ కోడ్ అనే ప్రత్యేకమైన కోడ్ రూపొందించడం జరిగింది. నేటికీ ఆలయ పాలన దిక్సూచిగా ఈ బ్రూస్ కోడ్ వాడుతారు.

4.సవాల్- ఇ-జవాబు
శ్రీవారి ఆలయంలో జరుగుతున్నటువంటి వివిధ సేవలు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల యొక్క ఇతిహాసం మరియు చరిత్రను తెలుసుకొనడం కోసం 1819లో ఈస్ట్ ఇండియా కంపెనీ 14 ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలను రూపొందించింది. దీన్ని సవాల్- ఇ-జవాబు పట్టి అని పిలుస్తారు.

5.పైమేయిషి ఖాతా
ఆలయానికి సంబంధించిన స్థిరచరాస్తులు, దేవతా విగ్రహాలు, చిత్రాలు, తిరుమల మరియు తిరుపతి ఇతర పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆలయ వివరాలు, ఇనాం గా ఇచ్చిన గ్రామాల యొక్క వివరాలను రికార్డు రూపంలో పొందు పరచడం జరిగింది. 1819లో రూపొందించిన ఈ రికార్డును “పైమేయిషి అకౌంట్” అని పిలుస్తారు.














రజనీకాంత్ 1950లో డిసెంబరు 12న మైసూరురాష్ట్రంలోని బెంగళూరులో మరాఠీ ఫ్యామిలిలో జన్మించాడు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. ఆయన తల్లి గృహిణి, తండ్రి పేరు రామోజీరావు గైక్వాడ్. పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసేవారు. వీరి ఫ్యామిలీ మహారాష్ట్ర నుంచి బెంగళూరుకు వచ్చి, స్థిరపడ్డారు. నలుగురు పిల్లల్లో రజినీకాంత్ చిన్నవాడు. రజినీకాంత్ 9 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిని కోల్పోయాడు.
రజినీకాంత్ గవర్నమెంట్ కన్నడ ప్రైమరీ స్కూల్ లో చదువుకున్నాడు. ఆ తరువాత రజినీకాంత్ ను రామకృష్ణ మఠంలో చేర్చారు. అక్కడ ఆధ్యాత్మిక పాఠాలతో పాటుగా నాటకాలలో పాల్గొనేవాడు. మఠంలో ఒకసారి జరిగిన పౌరాణిక నాటకంలో రజినీకాంత్ ఏకలవ్యుడి స్నేహితుడి పాత్రలో నటించారు. రజిని నటనకు ప్రముఖ కన్నడ కవి డిఆర్.బెంద్రే ప్రశంసించారు. అప్పటి నుండి ఆయనకు నటన పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. చదువు పూర్తి అయిన తరువాత రజనీకాంత్ కూలీపనితో సహా ఎన్నో పనులు చేశాడు.
ఆ తర్వాత బెంగుళూరు ట్రాన్స్పోర్ట్ లో బస్ కండక్టర్గా జాబ్ వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తున్న కొత్తగా ఏర్పాటు చేసిన మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రకటన కనిపించింది. దానిలో చేరి నటనలో శిక్షణ తీసుకోవాలనుకున్నాడు. అతని ఫ్రెండ్, సహోద్యోగీ రాజ్ బహదూర్ ఇన్స్టిట్యూట్ లో చేరేలా ప్రోత్సహించడమే కాకుండా, ఆర్థికంగా కూడా సహాయం చేశాడు. అక్కడే తమిళ దర్శకుడు కె.బాలచందర్ రజినికాంత్ ను గుర్తించాడు. అయితే కోలీవుడ్ లో శివాజీ గణేశన్ స్టార్ హీరోగా ఉన్నారు. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతో బాలచందర్ శివాజీ పేరును రజినీకాంత్ గా మార్చారు.
అలాగే తమిళంలో మాట్లాడటం కూడా నేర్చుకోమని సలహా ఇచ్చాడు. రజనీకాంత్ ఆ సలహాను పాటించి తమిళం నేర్చుకున్నారు. 1975 లో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ రాగంగళ్;సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రజినికాంత్, 1977 లో తెలుగులో తొలిసారిగా ‘చిలకమ్మ చెప్పింది’ అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ తరువాత పలు తెలుగు సినిమాలలో నటించిన రజినికాంత్ సౌత్ సూపర్ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
ఇప్పుడు ఈ షాట్ గమనించండి. ఇది పైన మెన్షన్ చేసిన దానికి కంటిన్యూషన్ షాట్. కానీ రెండిట్లో తేడా ఏంటో ఈ పాటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఒక షాట్ లో బ్లాక్ కలర్ లో ఉన్న కార్స్, నెక్స్ట్ షాట్ లో వైట్ కలర్ లో ఉంటాయి.
మనం ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ ఒక్క సినిమా ఏంటి? ఎన్నో సినిమాల్లో ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు కనిపిస్తాయి. ఇలా సినిమాల్లో పొరపాట్లు జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఒక దానికి సంబంధించిన సన్నివేశాలను ఒకటే రోజు చిత్రీకరించరు.
వాళ్ల సమయాన్ని బట్టి, షెడ్యూల్ ని బట్టి సీన్స్ షూట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఒక సీన్ ఎక్కువ రోజులు షూట్ చేస్తే, యాక్టర్స్ ఒకటే గెటప్ లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే అప్పుడు బహుశా ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి.









