ఇండోనేషియాలో ఇటీవల జరిగిన ఒక సంఘటన చర్చల్లో నిలిచింది. సాధారణంగా సినిమాలో మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నిజ జీవితంలో ఇలాంటివి జరగడంతో అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. వివరాల్లోకి వెళితే, టీవీ9 తెలుగు కథనం ప్రకారం, ఇండోనేషియాలోని బంగ్కా ద్వీపానికి చెందిన రెనాటా ఫదేయా వయసు 24 సంవత్సరాలు. ఆమె తనకంటే 38 సంవత్సరాలు పెద్దవాడైన వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ మధ్య ఇలా వయసులో చాలా పెద్దవారైన వాళ్లని వివాహం చేసుకుంటున్నారు. ఇందులో వింత ఏం ఉంది అనుకోవద్దు.

ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆ వ్యక్తి మొదటి పెళ్లి సమయానికి రెనాటా ఫదేయా వయసు 9 సంవత్సరాలు. ఆయన 2009 లో మొదటి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళికి రెనాటా ఫదేయా అతిథిగా వెళ్లారు. అప్పుడు ఆమె చాలా చిన్న పిల్ల. రెనాటా ఫదేయా భర్త 2011 లో రెండవ భార్యతో విడిపోయారు. ఆయనకి రెండవ వివాహంలో పిల్లలు లేరు. మొదటి వివాహంలో ఒక బిడ్డ ఉంది. రెనాటా ఫదేయా తన భర్తని మళ్లీ 2019 లో కలిశారు. 2020 లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. టిక్ టాక్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ, తన భర్తని తాను 2019 లో మాత్రమే కలిశాను అని అనుకున్నారు అని, కానీ ఇద్దరు బంధువులు అని, ఈ విషయం తనకి ఇటీవలే తెలిసింది అని, 15 సంవత్సరాల క్రితమే తన భర్తని కలిసినట్టు ఒక పోస్ట్ షేర్ చేశారు.
అందులో భాగంగానే ఆమె మొదటి భర్త పెళ్లిలో ఆమె అతిథిగా వెళ్ళిన ఫోటోని, అలాగే ఇప్పుడు అదే భర్తతో, తన బాబుతో ఉన్న ఫోటోని రెనాటా ఫదేయా షేర్ చేశారు. ఇప్పుడు రెనాటా ఫదేయాని తన భర్త చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పారు. సాధారణంగా సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. అంటే, ఇప్పుడు భార్య భర్తలు అయిన ఇద్దరు చిన్నప్పుడే తెలియకుండా కలవడం, ఆ సమయంలో ఫోటోలు తీసుకోవడం వంటివి సోషల్ మీడియాలో అంతకుముందు కూడా షేర్ చేశారు. ఇప్పుడు రెనాటా ఫదేయా కూడా తన భర్తని తాను చిన్నప్పుడే కలిసిన ఫోటోని షేర్ చేశారు.


1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు
#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు
#7 నిజాం చౌమహేల ప్యాలెస్
#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
#10 మక్కా మసీదు
#11 మోజమ్ జాహీ మార్కెట్ప్లేస్ భవనం
#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
#13 చార్మినార్:






ప్రముఖ మలయాళ నటుడు హీరోగా నటించిన సినిమా ‘ఇరట్టా’. థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటించింది. కథ విషయానికి వస్తే, కేరళలో వాగమన్ అనే ఊరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో జరిగే ఒక కార్యక్రమానికి మినిస్టర్ అతిథిగా వస్తుండడంతో పోలీసులు ఏర్పాట్లు చేస్తుంటారు. ఇంతలో తుపాకీ పేలిన సౌండ్ రావడంతో అందరూ అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఏఎస్ఐ వినోద్ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు.
ఎవరు వినోద్ చంపారో తెలియదు. దాంతో పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి, అక్కడ ఉన్నవారిని బయటకు వెళ్లనియకుండా చేసి, విచారిస్తూ ఉంటారు. వినోద్ చనిపోయిన సంగతి వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి సెకండ్ రోల్) కు తెలుస్తుంది. వెంటనేప్రమోద్ అక్కడికి చేరుకుంటాడు? ఇంతకీ వినోద్ను చంపింది ఎవరు? ప్రమోద్, వినోద్ లు మధ్య గొడవ ఏంటి ? మాలిని (అంజలి) ఎవరు? అనేది మిగతా కథ.
రోజు పేపర్ లో కానీ, న్యూస్ లో కానీ కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణన్ అలాంటి వార్తలలో ఒక పాయింట్ తీసుకుని, ఆ పాయింట్ చుట్టూ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వినోద్ చనిపోయే సీన్తోనే మూవీ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలీసులు అనుమానితులను విచారించగా, ఒక్కొక్కొరు వినోద్తో వారికున్న గొడవల గురించి చెప్పడం. ఫ్లాష్బ్యాక్ తో వినోద్ హత్య వెనుక కారణాలను రివీల్ చేయడం ఆకట్టుకుంటుంది.
ఆఖరికి వినోద్ను ప్రమోద్ హత్య చేసినట్లుగా అనుమానించడంతో ప్రమోద్ ఆ కేసును ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. ప్రమోద్ మిస్టరీని చేధించే సన్నివేశాలను డైరెక్టర్ ఊహలకు అందని విధంగా రాసుకున్నారు. జోజో జార్జ్ ఈ మూవీని నిర్మించారు. డ్యూయల్లో రోల్లో జోజు జార్జ్ నట విశ్వరూపం చూపించాడు. అంజలికి ఒక్క డైలాగ్ ఉండదు. మిగిలినవారు తమ పాత్రకు తగ్గట్టు నటించారు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ను అందించే సినిమా. క్లైమ్యాక్స్ లో ట్విస్ట్ మాత్రం ఆడియెన్స్ మనసుల నుండి సులభంగా పోదు.




డాన్సర్ విఘ్నేష్ రాజేంద్రన్ అంటే చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ చూస్తే గుర్తుపడతారు. అతను తెలుగులో అనేక పాటలలో సైడ్ డాన్సర్ గా చేశాడు. అలా విఘ్నేష్ టాలీవుడ్ స్టార్స్ అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాని , విజయ్ దేవరకొండ వంటి వారితో పని చేశాడు.
అయితే అతను తమిళ ఇండస్ట్రీకి చెందిన డాన్సర్. ఎక్కువగా కోలీవుడ్ సినిమాలకి డాన్సర్ గా చేస్తాడు. విఘ్నేష్ రాజేంద్రన్ కోలీవుడ్ కొరియోగ్రాఫర్ దినేష్ టీమ్ మెంబర్. దినేష్ మాస్టర్ దళపతి విజయ్, అజిత్, శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫర్ గా పనిచేశాడు. ఈ క్రమంలో ఆయన టీమ్ మెంబర్ గా ఉన్న విఘ్నేష్ ఆ హీరోల సాంగ్స్ లో గ్రూప్ డాన్సర్ గా పనిచేశాడు.
విఘ్నేష్ కొరియోగ్రాఫర్ నేర్పించే డ్యాన్స్ స్టెప్పులను తేలికగా నేర్చుకుంటాడు. అంతే కాకుండా సోషల్ మీడియాలో విఘ్నేష్కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అతని ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపు 50 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతే కాకుండా అతనికో ఫ్యాన్ పేజ్ కూడా ఉంది. ఆ పేజ్ కి 1536 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం అతను డాన్సర్ గా కొనసాగుతూనే, యాక్టర్ గా కూడా మారినట్టు తెలుస్తోంది.