దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న లియో మూవీ పైన అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
లోకేష్ కనగరాజ్ గత చిత్రాలు ఖైదీ, విక్రమ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలకి లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కి లింక్ ఉన్న సంగతి తెలిసిందే.

అయితే లియో మూవీకి ఎల్.సి.యు కి లింక్ ఉన్న సంగతి డైరెక్టర్ గాని సినిమా యూనిట్ గాని ఎక్కడ రివీల్ చేయలేదు. ఆడియన్స్ కూడా ఎంతో ఉత్కంఠ గా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు తమిళనాట హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. యాక్టర్ విజయ్ లియో మూవీ చూసిన ఆయన ఎక్సైట్ మెంట్ తో ట్విట్టర్ లో ఒక పోస్ట్ వేశారు.

“యాక్టర్ విజయ్ అన్న లియో మూవీ అద్భుతంగా ఉంది అని, డైరెక్టర్ లోకేష్ ఫిలిం మేకింగ్ ఎక్సలెంట్ అని, అనిరుద్ మ్యూజిక్, అనబరివ్ మాస్టర్ స్టంట్ లు, సెవెన్ స్క్రీన్ స్టూడియో ప్రొడక్షన్” అందరికీ హర్టి కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నట్లు ఎమోజీలు పెట్టారు. అయితే ఈ ట్వీట్ లో అసలైన ట్విస్ట్ ఇక్కడే మెన్షన్ చేశారు. హాష్ టాగ్ ఎల్.సి.యు అని పెట్టి ఆల్ ది బెస్ట్ అని పోస్ట్ వేసారు.

దీంతో ప్రేక్షకుల ఉదయినిధి స్టాలిన్ వేసిన ట్వీట్ వల్ల లియో మూవీ కూడా లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో భాగమేనని తెలిసిపోయింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రేక్షకులను త్రిల్ చేయాలని ఎక్కడా కూడా ట్విస్టును బయట పెట్టకుండా దాచిన సినిమా టీం కష్టాన్ని ఉదయనిది స్టాలిన్ వృధా చేశారు అంటూ నెటిజన్లు ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.
Also Read: “ఓంకార్” దర్శకత్వంలో మరొక కొత్త కాన్సెప్ట్..! ఎలా ఉందంటే..






















సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మల్టీటాలెంటెడ్ స్కిల్స్ ఉన్నవ్యక్తి విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాలతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన లేటెస్ట్ తమిళ మూవీ రత్తం అక్టోబర్ 6న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో నందితాశ్వేత, మహిమా నంబియార్, రమ్య నంబీశన్ కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, స్టోరీ పరంగా రత్తం కొంచెం డిఫరెంట్ లైన్. కోల్కతాలో గుర్రాల కాపరిగా పని చేస్తుంటాడు రంజిత్(విజయ్ ఆంటోనీ). గతంలో తనకు మీడియా గురువు అయిన రత్నం పాండియన్ (నిళల్ గళ్ రవి) కుమారుడు హ-త్య-కు గురవుతాడు. గురువు ఈ కేసును సాల్వ్ చేసేపనిని రంజిత్ కు అప్పగిస్తాడు. రంజిత్ చెన్నైకి వచ్చి ఆయన సంస్థలోనే జాయిన్ అవుతాడు.
మధుమిత(నందిత దాస్) దగ్గర అప్రెంటీస్ గా చేరి, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా, అలాంటి హత్యలే రాష్ట్రంలో చాలా జరిగాయనే విషయం తెలుస్తుంది. మరి ఈ హ-త్య-ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎలాంటి ఆధారాలు లేకుండా దొరకకుండా చేస్తున్నది ఎవరు? ఈ మ-ర్డ-ర్స్ ఎందుకు చేస్తున్నారు? ఈ కేసును ఛేదించే క్రమంలో రంజిత్కు ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? రంజిత్ జర్నలిజం వృత్తికి ఎందుకు దూరంగా వెళ్ళాడు అనేది మిగిలిన కథ.
మైండ్గేమ్తో హీరో మరియు విలన్ ఒకరి పై ఒకరు వేసే ఎత్తులతో ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ రంజిత్కుమార్ గా విజయ్ ఆంటోనీ సీరియస్ పాత్రలో మెప్పించాడు. మహిమా నంబియార్ నటన ఆకట్టుకుంటుంది. రత్తం మూవీ ఒక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. కథతో పాటుగా విలన్ క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది. ఓపికగా చూడగలిగిన వారికి కొత్త అనుభూతిని ఇస్తుంది.
