వరుస సినిమాలు చేస్తూ, ఇప్పుడు బ్రేక్ ఇచ్చి, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 3 సినిమాల్లో నటిస్తున్నారు.
అందులో మొదటిది, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా, భారీ ఫైట్స్ తో రూపొందుతోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా పొందారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇవి మాత్రమే కాకుండా, సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. పవన్ కళ్యాణ్ గురించి అభిమానులకి చాలా విషయాలు తెలుసు. పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా. ఇవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ కి సీ ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టం.
అందులోనూ ముఖ్యంగా, నెల్లూరు చేపల పులుసు అంటే పవన్ కళ్యాణ్ కి ఇష్టం. అంతే కాకుండా నాటుకోడి చికెన్, పులిహోర కూడా పవన్ కళ్యాణ్ ఇష్టంగా తింటారు. ఒక సమయంలో పవన్ కళ్యాణ్ గురించి, త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చాలా విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు అని, ఎవరికీ పుస్తకాలు ఇవ్వని త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కి మాత్రమే తన పుస్తకాలు ఇస్తారు అని చెప్పారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన ఆహారాల గురించి కూడా చెప్పారు.
పవన్ కళ్యాణ్ కి వెజిటేరియన్ ఆహారాలు కూడా చాలా ఇష్టం అని చెప్పారు. ఉప్మాతో పాటు, రవ్వ లడ్డు లాంటి స్వీట్స్ కూడా పవన్ కళ్యాణ్ కి ఇష్టం అని, వారి ఇంట్లో పవన్ కళ్యాణ్ కి ఏది కావాలి అంటే అది తినే స్వేచ్ఛ ఉంటుంది అని ,మొహమాట పడరు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం అనే విషయాన్ని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటారు.
బ్రో సినిమా చేస్తున్న సమయంలో కేవలం శాఖాహారం మాత్రమే తీసుకున్నారు. కేవలం పాలు, కూరగాయలు మాత్రమే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సముద్రఖని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతే కాకుండా అంతకుముందు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు వకీల్ సాబ్ సినిమా సమయంలో కూడా ఒక ప్రత్యేకమైన డైట్ తీసుకున్నారు. అలా సినిమాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటారు. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ పాత్రకి ఎలాంటి ఆహారం అవసరమో అలా మాత్రమే తింటారు. పాత్ర ప్రాముఖ్యతను బట్టి కూడా పవన్ కళ్యాణ్ ఆహారాన్ని తీసుకుంటారు.
ALSO READ : గవర్నమెంట్ జాబ్స్ ఉన్న 5 మంది భారత క్రికెటర్స్…ఎవరెవరు ఏ హోదాలో అంటే.?





దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మలయాళ మూవీ చార్లీ. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి గాను 2016లో దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా కేరళ ప్రభుత్వం నుండి అవార్డును అందుకున్నారు. ఈ మూవీ మార్టిన్ ప్రక్కత్ దర్శకత్వంలో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కింది. పార్వతి హీరోయిన్ గా నటించింది. 46వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో ఈ మూవీకి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీతో పాటు మొత్తం 8 అవార్డులను గెలుచుకుంది. ఇతర భాషలలో కూడా ఈ మూవీ రీమేక్ అయ్యింది.
చార్లీ కథ విషయానికి వస్తే, తేస్సా (పార్వతి) ఒక గ్రాఫిక్ ఆర్టిస్ట్. ఇష్టంలేని పెళ్ళిని తప్పించుకోవడం కోసం ఇంటి నుండి పారిపోతుంది. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ సహాయంతో, ఆమె పాత ఇంట్లో అద్దెకు తీసుకుంటుంది. మొదట్లో, ఆ ఇంటిని అసహ్యించుకుని, దానిని శుభ్రం చేసే క్రమంలో ఆ గదిలో ఒక బుక్ దొరుకుతుంది. అది చదవడం ద్వారా గతంలో చార్లీ (దుల్కర్) అనే వ్యక్తి ఆ గదిలో ఉండేవాడని, అతని గురించి చదివిన తరువాత అతనిలోని మంచి లక్షణాలు ఆమెను ఆకట్టుకుంటాయి.
అంతేకాకుండా ఆమె చిన్నప్పుడు విన్న కథకు సంబంధించిన పెయింటింగ్ ను అక్కడి గోడల పై చూస్తుంది. ఆ పెయింటింగ్ వేసింది చార్లీ అని తెలియయగానే ఎలాగైనా అతన్ని చూడాలనే ఆసక్తితో చార్లీని వెతుకుతూ వెళ్తుంది. ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైన సంఘటనలు ఏమిటి? ఆమె చివరికి చార్లీని కలుసుకుందా? ఆ తరువాత ఏమి జరుగుతుంది అనేది మిగతా కథ.
దుల్కర్ సల్మాన్ చార్లీ పాత్రలో జీవించాడు. తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. చార్లీ సింపుల్, మరియు ఫీల్ గుడ్ ఫిల్మ్. ఈ మూవీ మాధవన్ హీరోగా తమిళంలో ‘మారా’ అనే టైటిల్ తో రీమేక్ అయ్యింది. తెలుగులో కూడా డబ్ అయ్యింది. ఈ చిత్రానికి ఆహాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.










నెయిమర్ మూవీలో మాథ్యూ థామస్ , నస్లెన్, జానీ ఆంటోని, షమ్మీ తిలకన్, విజయరాఘవన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సుధీ మాడిసన్ దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు ఫ్రెండ్స్ కుంజవ (మాథ్యూ థామస్) మరియు సింటో (నస్లెన్ ) ఫుట్బాల్ అభిమానులు, అయితే వారి తండ్రుల ఒకప్పుడు మంచి మిత్రులు అయినప్పటికీ మనస్పర్ధలతో విడిపోతారు. కుంజవ, సింటో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయాలని భావిస్తారు. అదే సమయంలో కుంజవ డోనా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.
ఆమెకు కుక్కపిల్లలంటే ఇష్టమని తెలుసకుని ఒక వీధికుక్కను తీసుకుని వస్తాడు. దాని పేరే ‘నెయిమర్’. అది వచ్చిన తరువాత వారి జీవితాలలో వచ్చిన ఊహించని మలుపులు ఏమిటి అనేది మిగతా కథ. సినిమా మొదటి సగంలో, ప్రేక్షకులకు కుంజవా, సింటో మరియు వారి కుటుంబాలను పరిచయం చేశారు. ఆ తరువాత నెయిమర్ అనే కుక్క వారి జీవితంలోకి ఎలా వస్తుంది. ప్రతి ఒక్కరి పై ఎలాంటి ప్రభావం చూపింది. అనే విషయాన్ని వినోద భరితంగా సాగుతుంది.
సెకండాఫ్ గాబ్రియల్ కు వెంకట్ తో ఉన్న శత్రుత్వం మరియు ఒకరి మీద మరొకరు గెలవడానికి చేసే ప్రయత్నాలు. వారిద్దరి పరువు ప్రతిష్ఠలు ‘నెయిమర్’ తో ముడిపడి ఉండటం కొంచెం సస్పెన్స్ తో నడుస్తుంది. క్లైమాక్స్ లో డైరెక్టర్ సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడిన అంశాలను చూపించారు. ఆ సీన్స్ సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మూవీ చూసిన వారిని ఆలోచించెలా చేస్తాయి. కంటతడి పెట్టిస్తాయి.