వినోదయ సిత్తం, ఈ పేరు కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ తమిళ బ్లాక్బస్టర్ సినిమాని ‘బ్రో’ అనే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ జూలై 28న థియేటర్లలో విడుదల కాబోతుంది.
వినోదయ సిత్తం తమిళ మూవీకి దర్శకత్వం వహించిన సముద్రఖని బ్రో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీలో కీలక పాత్రలో సముద్రఖని నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ మూవీ ప్రస్తుతం ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు ఆ సినిమా కథ ఏమిటో? తెలుగులో ఎలాంటి మార్పులు చేశారో ఇప్పుడు చూద్దాం..
వినోదయ సిత్తం తమిళ మూవీలో ప్రధాన పాత్రలో తంబిరాయమ్య నటించారు. కీలక పాత్రలో సముద్రఖని నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అక్కడ బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, పరశురామ్ (తంబిరామయ్య) ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా 25 సంవత్సరాలుగా పనిచేస్తుంటాడు. అతను టైమ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అన్ని విషయాలను టైమ్ ప్రకారం చేస్తుంటాడు. భార్య, ఇద్దరు కూతుర్లు పరశురామ్ మాటను జవదాటరు. అతని కొడుకు అమెరికాలో జాబ్ చేస్తుంటాడు.
పరశురామ్ ఒకరోజు పని మీద వెళ్ళి వస్తుండగా అతనికి యాక్సిడెంట్ అయ్యి, మరణిస్తాడు. అప్పుడు అతన్నిస్వర్గానికి తీసుకెళ్లడం కోసం టైమ్ (సముద్రఖని) వస్తాడు. కానీ పరశురామ్ తన ఫ్యామిలీ బాధ్యతల్ని తీర్చడం కోసం మళ్ళీ బతికించమని టైమ్ను వేడుకుంటాడు. దాంతో టైమ్ అతనికి 3 నెలలు టైమ్ ఇచ్చి, అప్పటిదాకా తనతోనే ఉంటానని చెప్తాడు. ఇక పరశురామ్ 3 నెలల్లో తన బాధ్యతల్ని నెరవేర్చాడా? లేదా? అన్నదే మిగతా కథ.
ఇక ఇదే మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సముద్రఖని పాత్రని పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారని టాక్. ప్రధాన పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఆ మూవీలో తంబిరాయమ్యకు ఇద్దరు అమ్మాయిలు, కొడుకు ఉంటారు. అంటే తెలుగు రీమేక్ లో కథలో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. బ్రో మూవీలో సాయి ధరమ్ తేజ్ మార్కండేయ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ జూలై 28న రిలీజ్ కానుంది.
Also Read: ఆ హీరోతో మాత్రం సినిమా వద్దు అంటూ కూతురుకి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్.! అసలేమైంది?

సమంత ప్రస్తుతం ఖుషి మూవీ మరియు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ రెండింటి చిత్రీకరణ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. సమంత తన హెల్త్ గురించి ఓ సంవత్సరం పాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలని భావించిందని కొన్నిరోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె నటించిన ఖుషి మూవీ సెప్టెంబరు 1న రిలీజ్ కానుంది. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.
ఖుషి నుండి రిలీజ్ అయిన ‘ఆరాధ్య’ సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అదే సమయంలో ఆ పాటలోని ఒక సీన్ సమంత పై ట్రోలింగ్ కారణం అయ్యింది. ఈ పాటలో ఓ సీన్ లో విజయ్ దేవరకొండ తన కాలితో సమంత కుడి చేతి పై తాకినట్లుగా ఒక స్టిల్ ఉంది. ఈ స్టిల్ ను చూసిన కొందరు నెటిజన్స్, సమంత గతంలో ఒక మూవీ పై చేసిన ఓల్డ్ ట్వీట్ ని ఇప్పుడు బయటికి తీశారు.
ఆ ట్వీట్ లో సమంత ‘ఇంకా విడుదల కానీ ఓ మూవీ పోస్టర్ చూశాను. నా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ పోస్టర్ మహేష్ బాబు నటించిన ‘నేనొక్కడినే’ మూవీ పోస్టర్ అని అప్పట్లో చాలామంది అన్నారు. అపుడు గుర్తు వచ్చింది నీకు, మరి నీ మూవీ టైమ్ కి గుర్తు రాలేదా అంటూ నేనొక్కడినే పోస్టర్ ని, ఖుషి ఫొటోని కూడా పక్కపక్కన పెట్టి మరి నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
1. శక్తి:
2. స్పైడర్:
3.అజ్ఞాతవాసి:
4. దడ:
5. డియర్ కామ్రేడ్
6.సాహో:
7. ది ఘోస్ట్:
8. రావణాసుర:
9. శాకుంతలం:
10. ఏజెంట్:
టిజర్, సాంగ్స్, ట్రైలర్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ అయ్యాక ఫస్ట్ షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
మహి.వి.రాఘవ్ సినీ దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పలు సినిమాలకు పని చేశారు. విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ సినిమాలకు సహ నిర్మాతగా చేశారు. పాఠశాల అనే మూవీ ద్వారా దర్శకత్వం ప్రారంభించాడు. ఆ తరువాత ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం యాత్ర-2 మూవీకి దర్శకత్వం చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే మహి వి. రాఘవ్ పెళ్ళిళ్ళు విఫలం అవడం వెనుక ఉన్న కారణం గురించి ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దానికి సంబంధించిన వీడియోను డార్క్ ఫేజ్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో దాని పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో దర్శకుడు మహి వి. రాఘవ్ ఇలా చెప్పుకొచ్చాడు.
కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలలో సగానికి పైగా విడిపోతున్నారు. దానికి కారణం వుమెన్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇలా అన్నిట్లో వారికి ఛాయిస్ లు ఎక్కువగా ఉండడం, స్త్రీలు పురుషుల కన్నా వేగంగా ఎవాల్వ్ అవుతారు. విముక్తి పొందిన స్త్రీ ఎల్లప్పుడూ సమాజానికి ప్రమాదకరం. విముక్తి పొందిన స్త్రీని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఇది నా అభిప్రాయం మాత్రమే” అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో పై పలువురు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ కి ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే అని చెప్తూ మహి వి. రాఘవ్ కూడా కామెంట్ చేసారు.
కోహ్లీ కెప్టెన్సీలో ధోనీ కుట్ర చేశాడని యోగ్రాజ్ సింగ్ ఆరోపించారు. తాను తప్ప భారతజట్టు తరఫున ఇంకొకరు వరల్డ్ కప్ గెలవకూడదనే దురాలోచనతో ధోనీ కావాలనే రన్ అవుట్ అయ్యాడని అన్నారు. ఈ మేరకు యోగ్రాజ్ సింగ్ తన ట్విటర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చాడు.
‘ఆ ఇన్సిడెంట్ ను తలుచుకుంటే ఇప్పటికీ నా రక్తం మరుగుతోంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీ ఉద్దేశ్యపూర్వకంగా బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. టీమిండియా తరఫున ఇంకో కెప్టెన్ వరల్డ్ కప్ గెలవడం అనేది ధోనీ ఇష్ట పడలేదు. అందువల్ల ఒకవైపు రవీంద్ర జడేజా గెలవాలనే తపనతో బాగా ఆడుతున్నా, ధోనీ జడేజాకు సహకరించలేదు. జిడ్డు బ్యాటింగ్తో అతని పై ఒత్తిడి పెంచి అతను ఔటయ్యేలా చేశాడు.
తన ప్రతిభకు తగిన విధంగా బ్యాటింగ్ చేయకుండా చివర్లో కావాలనే రన్ అవుట్ అయ్యాడు. ధోనీలో మ్యాచ్ గెలవాలన్న కసి ఏమాత్రం ఉన్నా, తన సామర్థ్యంలో 40 శాతం వినియోగించినా కూడా టీమిండియా 48వ ఓవర్లోనే గెలిచి ఉండేది’ అని యోగ్రాజ్ సింగ్ వెల్లడించారు. ఈ వీడియోను విరాట్ కోహ్లీ కోసం ప్రతి అభిమాని చూడాలని యోగ్రాజ్ సింగ్ అభ్యర్థించారు.
ప్రొడ్యూసర్ మాణిక్యం నారాయణన్ మాట్లాడుతూ, హీరో అజిత్ తన వద్ద 25 సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకున్నాడని, వాటిని ఇంత వరకు ఇవ్వలేదంటూ అజిత్ పై తీవ్రమైన విమర్శలు చేశాడు. తన పేరెంట్స్ ను మలేషియా పంపించడం కోసం అజిత్ తన దగ్గర డబ్బు తీసుకున్నాడు. అప్పుడు తన ప్రోడక్షన్ లో ఒక మూవీ చేసి రెమ్యూనరేషన్ లో ఈ డబ్బుని సర్దుబాటు చేస్తానని చెప్పాడు.
అయితే ఆ రోజు నుండి ఇంత వరకు తన బ్యానర్ లో అజిత్ ఒక్క సినిమా కూడా చేయలేదని మాణిక్యం తెలిపాడు. అజిత్ తనను పెద్ద మనిషి అని అనుకుంటాడు. కానీ అతను ఒక మోసగాడని అన్నారు. ఇన్నేళ్ల నుండి అజిత్ తో ఈ డబ్బు గురించి మాట్లాడుతూన్నా కూడా ఆయన సైడ్ నుండి ఎలాంటి స్పందన రావట్లేదని నిర్మాత మాణిక్యం వెల్లడించాడు.
ప్రస్తుతం అజిత్ ఒక్కో సినిమాకు 50 కోట్ల పైనే పారితోషికం తీసుకుంటున్నాడని, తనకు రావలసిన డబ్బును తిరిగి ఇవ్వవచ్చు అంటూ మాణిక్యం అజిత్ పై మండిపడుతున్నారు. ఈ విషయం గురించి మాణిక్యం గతంలో కూడా మీడియా ముందు మాట్లాడాడు. అయితే అప్పుడు, ఇప్పుడు అజిత్ వైపు నుండి కానీ, ఆయన సన్నిహితుల నుండి కానీ ఎటువంటి క్లారిటీ అయితే రావడం లేదు.
హిమాచల్ ప్రదేశ్లోని బియాస్, సట్లేజ్, రావి లాంటి నదులు ప్రమాదకర స్థాయిని ధాటి ప్రవహిస్తున్నాయి. దాంతో ఆ నదుల పై నిర్మించిన రిజర్వాయర్లల్లో నీటి మట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. ఆ రిజర్వాయర్ల గేట్లన్నింటినీ అధికారులు ఎత్తివేశారు. వాటి ప్రభావం వల్ల బియాస్, సట్లేజ్, రావి తీరప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. అక్కడ నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లక్ష మందికి పైగా ప్రజలను ఇప్పటివరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక కొండ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ప్రవాహంతో పలు పట్టణాలు కూడా సగం వరకు మునిగాయి. బిలాస్పూర్, కాంగ్రా, సోలన్, సిర్మౌర్, సిమ్లా, ఉనా, మండి, హమీర్పూర్, కుల్లు-మనాలి, చంబా, కిన్నౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురావడంతో కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే ఆయా జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ను ప్రకటించింది.
వర్షాలు ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తాయని, అందువల్ల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఐఎండీ సూచించింది. భారీ వర్షాల దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఈ 3 రోజులలో భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 72 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. నాలుగు వేల కోట్లు విలువ చేసే ఆస్తి నష్టం జరిగినట్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ డిపార్ట్మెంట్ తెలిపింది.
2020 డిసెంబర్లో మెగాడాటర్ నిహారిక, చైతన్యల జొన్నలగడ్డ వివాహం గ్రాండ్ గా జరిగింది. మెగా ఫ్యామిలీ అందరు కలిసి వీరి పెళ్లి వేడుకను ఘనంగా జరిపిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో భారీగా ఖర్చు పెట్టి, రాజస్థాన్ ప్యాలెస్ లో నిహారిక, చైతన్యల పెళ్లి జరిపించారు. అప్పట్లో వీరి పెళ్లి గురించి దేశవ్యాప్తంగా మీడియా కవరేజ్ చేసింది. నిహారిక పెళ్లి కోసం సుమారు రూ. 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ జంట అన్యోన్యంగా కనిపించింది.
కానీ గత కొంతకాలం నుండి నిహారిక, చైతన్యలు విడి విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. వీటి పై మెగా కుటుంబంలోని వారెవరూ స్పందించలేదు. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ నిహారిక, చైతన్యల జొన్నలగడ్డకు విడాకులు మంజూరు చేసినట్లు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు వెల్లడించింది. ఇదే విషయన్ని నిహారిక, చైతన్య సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
నిహారిక చైతన్యలు ఎందుకు విడిపోయారనే విషయం అయితే బయటికి రాలేదు.
పూజాహెగ్డే ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తర్వాత వరుసగా సినిమాల ఆఫర్లు రావడంతో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూ పూజాహెగ్డే వరుసగా హిట్లను అందుకుంది. ఇక డైరెక్టర్లకు కూడా పూజాహెగ్డే లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అలా మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది.
అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పూజాహెగ్డే నటించిన 5 సినిమాలు వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. దాంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే ను తీసుకున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగిన తరువాత ఆమె ఆ మూవీ నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుండి పూజాహెగ్డే తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో పూజాహెగ్డే ఒక యంగ్ హీరోతో నటించడానికి రెడీ అయినట్లు సమాచారం. ‘విరూపాక్ష’మూవీతో విజయం సాధించిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో పూజహెగ్డే నటిస్తోందని తెలిసింది. ఈ మూవీని డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించనున్నారు. దర్శక నిర్మాతలు ఈ మూవీ కోసం ఇప్పటికే పూజాహెగ్డేను సంప్రదించారని, పూజా ఒకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికార ప్రకటన త్వరలో వస్తుందని సమాచారం.
మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం వంటి సినిమాలతో ఆడియెన్స్ ని పలకరించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబి’ తో ఆడియెన్స్ ముందుకి మరోసారి రాబోతున్నాడు. ఈ సినిమాని సాయిరాజేష్ నీలం తెరకెక్కించాడు. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా, యాక్టర్ విరాజ్ అశ్విన్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ టీజర్ ఇప్పటికే ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ మూవీ రిలీజ్ కు ముందే హిట్ అయ్యాయి. దాంతో ఈ సినిమా పై చాలా బజ్ క్రియేట్ అయ్యింది.
రీసెంట్ గా రిలీజ్ అయిన బేబీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది. జులై 14న ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే సెన్సార్ జరిగే సమయంలో ఈ సినిమా గురించి ఒక షాకింగ్ వార్త వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉండడంతో ఆ డైలాగులను మ్యూట్ చేయాలని సెన్సార్ చిత్రబృందాన్ని కోరినట్టు తెలుస్తోంది. అది మాత్రమే కాకుండా కొన్ని విజువల్స్ ని కట్ చేశారని సమాచారం.
ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ లకి ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీని అందరు ఒక మిడిల్ క్లాస్ యువకుడి లవ్ స్టోరి అని అనుకున్నారు. అయితే తాజాగా బేబీ సినిమా సెన్సార్ అప్ డేట్ గురించి తెలియడంతో అభిమానులు కంగారుపడుతున్నారట. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆడియెన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.