ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన అన్ని థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి మొదటి షో నుండి కొందరు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.
కానీ మరికొందరు ఈ మూవీ పై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలోని కొన్ని సన్నివేశాల పై సామాజిక మధ్యమాలలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు సీన్లను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఆ రెండు సీన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆదిపురుష్ మూవీలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నది రావణాసురిడి పాత్ర. ఈ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. రావణాసురుడికి పది తలలు ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రావణాసురుడికి ఉండే పది తలలు ఒకే వరుసలో ఉండకుండా రెండు వరుసలలో ఐదు తలల చొప్పున కనిపిస్తాయి.
ఈ సీన్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రాఫిక్స్ లేని కాలంలో కూడా పది తలల రావణాసురిడిని చక్కగా చూపించారని, గ్రాఫిక్స్ ను సరిగా వాడలేదని అంటున్నారు. ఇక రెండవ సన్నివేశం ఏమిటంటే, అయోధ్యలో రాముడు తన తండ్రి దశరథునితో మాట్లాడే సన్నివేశం.
ఈ సీన్ లో ప్రభాస్ ఎప్పుడు కనిపించని విధంగా కనిపించాడు. తెల్లటి వస్త్రాల ధరించి, జట్టును వదిలేసి డిఫరెంట్ గా కనిపించారు. ఈ సన్నివేశం పై కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు. ఈ గెటప్ ట్రైలర్ లో లేదా ఎక్కడ కూడా కనిపించలేదు. డైరెక్ట్ థియేటర్ లో చూసిన ప్రేక్షకులు ఇంకా నిరాశ చెందారు. కొందరు ప్రభాస్ దశరధుడి పాత్రలో కూడా నటించారని అంటున్నారు. కానీ ప్రభాస్ రాముడి పాత్రలో మాత్రమే నటించాడు.
https://www.instagram.com/reel/CtinVB1pVfh/?igshid=MzRlODBiNWFlZA%3D%3D
Also Read: ఆదిపురుష్ సినిమాలో “సైఫ్ అలీఖాన్” లాగానే… సినిమాల్లో “రావణుడి” పాత్ర పోషించిన 10 యాక్టర్స్..!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆదిపురుష్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. సీతాదేవిగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, రావణసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 16న తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. బిజినెస్ గురించి చూసినట్లయితే ఇప్పటివరకు ఈ మూవీకి శాటిలైట్, మరియు డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు 250 కోట్లు వచ్చాయట. అయితే ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ ను మాత్రం అమ్మలేదని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలలో ముందుగా యువి క్రియేషన్స్ విడుదల చేస్తుందని అనుకున్నా, ఆ తరువాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఓవర్సీస్, ఇతర భాషలకు ఆ రాష్ట్రాలలోని లోకల్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా టి సిరీస్ సొంతంగా విడుదల చేయాలని అనుకుంటునట్లు తెలుస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తే ఫస్ట్ వీకెండ్ లోనే ప్రొడ్యూసర్లు సేఫ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది. ఈ రోజు తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ వేడుకకు చినజీయర్ స్వామి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు.
సినిమాల ద్వారా ఎంతో పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న నయనతార ఇటీవల తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ని వివాహం చేసుకుంది.పెళ్లి అయిన నెలకే సరోగసి ద్వారా తల్లి అయ్యి వార్తల్లో నిలిచింది. నయన్ ఆస్తుల విలువ దాదాపు రూ. 100 కోట్లు అని అంచనా. దక్షిణ భారతదేశంలోని అత్యంత ధనిక హీరోయిన్స్ లో ఒకరు. ఆమెకు చెన్నైలో విలాసవంతమైన విల్లాలు, అపార్ట్మెంట్లు, విలాసవంతమైన కార్లు మరియు ప్రైవేట్ జెట్ కూడా ఉన్నాయి.
నయనతారకు ఉన్న 8 ఖరీదైన వస్తువుల జాబితా ఏంటో చూద్దాం..
2. విలువైన ఆస్తులు
3.కాస్మెటిక్ బ్రాండ్ ‘ది లిప్ బామ్ కంపెనీ’
4. ప్రైవేట్ జెట్
5. మెర్సిడెస్ GLS 350D
6.BMW 7-సిరీస్ ధర రూ. 1.76 కోట్లు
7.టయోటా ఇన్నోవా క్రిస్టా విలువ రూ. 30 లక్షలు
8. రూ. 74.50 లక్షల విలువైన BMW 5 సిరీస్
శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారము రామావతారము. దేవుడు అయినప్పటికి రాముడు జన్మించినప్పటి నుండి అవతారం చాలించే వరకు మానవుడుగానే జీవించారు. తన వ్యక్తిత్వంతో, సకల గుణాలతో అందరికి ఆదర్శంగా నిలిచి దేవుడిగా మారాడు. అందుకే సకల గుణాభిరాముడిగా పిలుస్తారు. తండ్రి మాట కోసం 14 ఏళ్ల పాటు అరణ్యవాసం చేసాడు. సీతను ఎత్తుకెళ్లిన రావణుడితో యుద్ధం చేసి, భార్యను తిరిగి పొందాడు. అయోధ్యకు తిరిగివచ్చిన తరువాత రాజుగా పట్టాభిషేక్తుడు అయ్యాడు. ఆయన పాలించిన సమయాన్ని రామరాజ్యం అని పిలుస్తారు.
రామాయణం ఉత్తర కాండలో రామరాజ్యం గురించి స్పష్టమైన వివరాలు లేనప్పటికీ, రామాయణం ప్రారంభం నుండి రాముడి వ్యక్తిత్వం, ప్రవర్తన గురించి మహర్షి వాల్మీకి చెప్పిన విషయాలను అనుసరించి రామరాజ్యం గురించి అర్ధం చేసుకోవచ్చు. శ్రీ రాముడు పట్టాభిషిక్తుడైన అనంతరం 11 వేల సంవత్సరాల పాటు అయోధ్యని పాలించాడు. శ్రీ రాముడి పాలన చాలా ఆదర్శవంతమైనది. వేద శాస్త్రాల ప్రకారం ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే వాడు. ఎవ్వరినీ కష్ట పెట్టలేదు. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు. ఎవరి ధర్మాలు వారు పాటించేవారు.
రాజ్యం బాగుండడం అంటే అక్కడి ప్రజలందరు ధనవంతులు అని కాదు. శ్రీ రాముని పాలనలో దొంగతనం, కరవు లేదని అంటారు. రాముని పాలనలో ప్రతి ఒక్కరు సుఖ, సంతోషాలతో సంతృప్తిగా జీవించేవారట. వర్షాలు సరైన సమయంలో పడేవట. నెలలో మూడు సార్లు వర్షం కురవడంతో పంటలు బాగా పండేవి. రాజ్యం సశ్యామలంగా ఉండేదట. రాముని రాజ్యంలో అందరికి సమంగా న్యాయం జరిగేది. అందువల్లనే రామరాజ్యం అని చెబుతారు.
మహేష్ బాబు జక్కన్నతో మొదటిసారి భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ చిత్రం మహేష్ 29వ సినిమాగా రాబోతుంది. ఇక ఈ మూవీ మొదలుపెట్టక ముందే అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ అనంతరం అంతకుమించి ఉండేలా మహేష్ తో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ తిరుగు తున్నాయి. ఇక రాజమౌళికి మోహన్ లాల్ అంటే చాలా అభిమానమని, తన గత చిత్రాల కోసం మోహన్ లాల్ ను జక్కన్న సంప్రదించారని వినిపిస్తోంది.
అయితే ఆ టైంలో మోహన్ లాల్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో జక్కన్న చిత్రాలకు అంగీకరించలేదు. అయితే జక్కన్న మోహన్ లాల్ కోసం ఇప్పటి నుండి సంప్రదిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రంలో మోహన్ లాల్ నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొందరు మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో మోహన్ లాల్ తప్పకుండా నటిస్తారని అంటున్నారు.
ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ, సెలెక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారని, ఆ సభ్యులతో పాటు జట్టు కెప్టెన్ ఉంటాడు. అందులో ఒక్కరి నిర్ణయాన్ని అందరు ఎలా ఒప్పుకుంటారు? అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఎవరో ఒక్కరు మాత్రమే నిర్ణయం తీసుకుంటే, కమిటీలో ఐదుగురు సెలెక్టర్లు ఎందుకు? అని ప్రశ్నించాడు. సెలెక్షన్ కమిటీ ఒప్పుకోకుండా ఏ డీసీషన్ తీసుకోలేమని చెప్పారు. నేను ఏదైనా చెప్పవచ్చు. కానీ మిగతా సభ్యులు దాన్ని అంగీకరించాలి. సెలెక్షన్ కమిటీలో ఎవరో ఒక్కరి డీసీషన్ నిలవదని వెల్లడించాడు.
రాయుడును సెలెక్ట్ చేయకపోవడం అనేది కమిటీ మొత్తం కలిసి తీసుకున్న డీసీషన్ అని చెప్పాడు. ఇక ఆంధ్రా జట్టుకు ఆడే టైమ్ లో రాయుడితో ఉన్న విభేదాల గురించి ఎమ్మెస్కే ప్రస్తావించాడు. ఒక జట్టులో చాలా రోజులు ఆడినప్పుడు ప్లేయర్స్ మద్య చిన్న చిన్న విబేధాలు సాధారణంగా జరుగుతుంటాయి. అన్నదమ్ముల మధ్యలో సైతం అభిప్రాయభేదాలు వస్తాయి. టీంఇండియాకు సెలెక్ట్ చేయడం లాంటి పెద్ద విషయంలో చిన్న చిన్న గొడవలను పట్టించుకోవాల్సింది ఏముంటుందని అన్నాడు.
అలాగే వరల్డ్ కప్ ముందు జరిగిన మ్యాచ్ లలో రాయుడిని ఎంపిక చేసిన సంగతిని గుర్తు చేశాడు. వరల్డ్ కప్ ముందు ఆడిన మ్యాచ్ లన్నింటికి రాయుడిని సెలెక్ట్ చేశాం. అప్పుడు లేని సమస్య, వరల్డ్ కప్ ఎంపికలో ఏముంటుందని అన్నారు. ఎంపిక ప్రక్రియ కమిటీ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం. వరల్డ్ కప్ సెలెక్షన్ లో తనపై వచ్చిన ఆరోపణల గురించి క్లారిటీ ఇవ్వడానికే వచ్చానని ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
1. రాజశేఖర్ :
2. అనుపమ పరమేశ్వరన్ :
3. రాశి :
4.పృథ్వీ రాజ్ :
Also Read:
మహేష్ వయసు పెరిగే కొద్దీ ఆయన అందం కూడా పెరుగుతోంది. తనయుడు గౌతమ్ పక్కన నిలబడితే బ్రదర్స్ లా కనిపిస్తున్నారు. ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటించకుండానే దేశవ్యాప్తంగా మహేష్ కు మిలియన్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఇరవై ఏళ్ల కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పటికీ కూడా అదే జోష్తో కొనసాగుతున్నారు. అయితే మహేష్ మూవీ షూటింగ్ లో ఉంటారు. లేదంటే కటుంబంతో కలిసి గడుపుతారు. పక్కా ప్యామిలీ పర్సన్.
ఒక్క రూమర్ లేకుండా, వివాదాలకు దూరంగా ఉంటారు. అంతే కాకుండా వ్యాపారంలో పెట్టుబడులు, యాడ్స్ ద్వారా మహేష్ ఓ రేంజ్లో సంపాదిస్తున్నారు. ఇక ఇప్పుడు మహేష్ తన పారితోషికాన్ని పెంచినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసే సినిమా కోసం మహేశ్ 70 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ మూవీ తర్వాత, రాజమౌళి సినిమాలో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం 110 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మూవీ మహేష్ కెరిర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి గ్లోబల్ వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దాంతో ఈ మూవీ షూటింగ్ మొదలు కాక ముందే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ ఈ మూవీ కోసం ఎక్కువ రోజులను కేటాయించబోతున్నాడని, అందుకే ఈ మూవీకి 110 కోట్ల భారీ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు.
ఇటీవల కాలంలో ఇలాంటి గేమ్ షోలు ఇండియాలో ఎక్కువగానే ప్రసారం అవుతున్నాయి. అనేక టీవి ఛానెల్స్ ఇలాంటి గేమ్ షోలను ప్రారంభించాయి. ఈ షోలలో పాల్గొని, గెలవడం ద్వారా డబ్బును గెలుచుకోవచ్చు. బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ 2000లో ప్రారంభించిన “కౌన్ బనేగా కరోడ్ పతి” టీవీ షోకు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అదే షోని తెలుగులో “మీలో ఎవరు కోటీశ్వరుడు” పేరుతో 2014 నుంచి మాటీవీలో ప్రారంభం అయ్యింది. తెలుగులో కూడా ఈ షో సక్సెస్ అయ్యింది.
తొలి 3 సీజన్లకి నాగార్జున హోస్ట్, 4వ సీజన్కి మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా చేశారు. 5 వ సీజన్కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అలరించారు. అయితే ఐదో సీజన్ జెమిని టీవిలో ప్రసారం అయ్యింది. ఈ షో పేరును “ఎవరు మీలో కోటీశ్వరులు” గా మార్చారు. ఈ షోలలో ఇప్పటివరకు చాలా మంది ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. అయితే ఈ షోలలో మనీని గెలుచుకున్న పోటీదారులకు మనీని నిజంగానే ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఆ మనీని ఎవరు ఇస్తారనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. షోలో గెలిచినవారికి వారికి ఆ షో నిర్మాత డబ్బును ఇస్తారు.
సినిమాలకు ప్రొడ్యూసర్స్ ఎలా ఇస్తారో అలాగే షోను హోస్ట్ చేసిన వ్యక్తికి, అలాగే గెలిచిన కంటెస్టెంట్ కి కూడా నిర్మాతనే డబ్బును ఇస్తారు. ఈ షో మధ్యలో వచ్చే ప్రకటనల ద్వారా నిర్మాతలకు అధిక మొత్తంలో డబ్బు వస్తుంది. ఈ షో రాత్రి పూట మాత్రమే టెలికాస్ట్ చేస్తారు. ఏ భాషలో అయినా సరే ఈ షో రాత్రి పూట వస్తుంది. అందుకు కారణం ఏంటంటే ఆ సమయంలో టిఆర్పి చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో టిఆర్పి ఎక్కువగా ఉంటే యాడ్స్ కూడా ఎక్కువగా వస్తాయి.
సినిమా చూసిన ప్రేక్షకులను మీడియా మూవీ ఎలా ఉందని రివ్యూ చేస్తుంది. ఆ క్రమంలోనే ఒక వ్యక్తిని ఆదిపురుష్ ఎలా ఉందని మీడియా అడుగగా, అతను బాలేదని చెప్పాడు. ప్రభాస్ అన్న నటన గురించి మాట్లాడట్లేదు. ఆచార్యలో చిరంజీవిని ఎలా చూపించారో, అలాగే ఆదిపురుష్ లో త్రీడీ ప్రభాస్ ను చూపించారని అన్నారు. ప్లే స్టేషన్ లో ఉండే రాక్షసులను ఈ మూవీలో చూపించారు. హనుమాన్, బీజీఎమ్, కొన్ని త్రీడీ షాట్స్ తప్పా సినిమాలో ఏం లేదని అన్నాడు. ప్రభాస్ రాముడిగా అస్సలు సెట్ కాలేదు. ప్రభాస్ ను దర్శకుడు సరిగా చూపించలేదని తెలిపాడు.
ఆ వ్యక్తి మాటలు విన్న ప్రభాస్ ఫ్యాన్స్ అతనిపై మండిపడ్డారు. నువ్వు అసలుఏం చూశావ్, కళ్లు కనిపిస్తాయా అని తిట్టారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయితే ఆ వ్యక్తి కూడా ఫ్యాన్స్ తో వాగ్వాదానికి దిగడంతో అతన్ని ఫ్యాన్స్ చితక బాదారు. అక్కడున్న మీడియా వారిని ఆపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ గా మారింది.