సినిమా రంగంలో ఉన్న సెలబ్రిటీస్ కి సినిమా మీద మాత్రమే కాకుండా, ఇంకా చాలా విషయాలు మీద కూడా అవగాహన ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న ఎంతో మంది, క్రీడారంగంలో కూడా రాణించిన వారు ఉన్నారు. క్రీడలలో శిక్షణ పొంది, తర్వాత సినిమాల్లోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.
పరిచయం అవసరం లేని వ్యక్తి. గత కొద్ది సంవత్సరాల నుండి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ తమన్ ఇస్తున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ఇంకొక మంచి ఆల్బమ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా తమన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తమన్ బాయ్స్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ఇదే తమన్ మొదటి సినిమా. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. తమన్ కి క్రికెట్ లో కూడా చాలా మంచి అవగాహన ఉంది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అయిన ప్రతిసారి తమన్ ఇందులో పాల్గొంటున్నారు. చాలా సందర్భాల్లో తమన్ క్రికెట్ మీద తనకి ఉన్న ఇంట్రెస్ట్ గురించి మాట్లాడారు. ఖాళీ సమయం దొరికితే ఇప్పటికి కూడా క్రికెట్ ఆడతాను అని చెప్తారు. అంతే కాకుండా ఎప్పుడైనా ఒత్తిడికి లోనైనప్పుడు కూడా క్రికెట్ ఆడతాను అని, అలా ఆడినప్పుడు ఒత్తిడి అంతా పోతుంది అని తమని చెప్పారు. అయితే ఇప్పుడు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందులో తమను కూడా ఆడుతున్నారు.

నిన్న జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తమన్ బ్యాట్ విరిగేలాగా బంతి కొట్టారు. అయితే ఇక్కడే మరొక సంఘటన కూడా జరిగింది. బ్యాటింగ్ చేస్తూ మధ్యలో పరిగెడుతున్నప్పుడు తమన్ ఫీల్డర్ చెయ్యి పట్టుకున్నారు. క్రికెట్ రూల్స్ ప్రకారం అలా చేయడం నియమాలకు విరుద్ధం. దాంతో తమన్ అవుట్ అయ్యారు. దాంతో, “ఇలా కూడా అవుట్ అవుతారా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, తమన్ నిన్న మాత్రం చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారు. బ్యాట్ విరిగిపోయే రేంజ్ లో తమన్ ఆడారు అంటే ఎంత బాగా ఆడారు అనేది మనమే అర్థం చేసుకోవాలి. తమన్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు. మంచి క్రికెటర్ కూడా.
watch video :
Thaman out 🤣🤣
Field disturbance runout 😭😭 pic.twitter.com/ZmeU200x5F
— َ (@timebokkaraa) March 1, 2024
ALSO READ : చిన్మయి శ్రీపాద వాడిన ఆ పదం ఏంటి..? అసలు ఆమె మీద కేసు ఎందుకు ఫైల్ చేశారు..?






















నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా, సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించారు. జయ ప్రకాష్ రెడ్డి విలన్ గా నటించారు. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ చిత్రం అప్పట్లో29 సెంటర్లలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. బాలకృష్ణ కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలవడమే కాకుండా పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీ విడుదల అయ్యి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి2 న ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో రీరిలీజ్ థియేటర్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉండనుంది.