ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ముగింపు సందర్భంగా మంత్రి రోజా కబడ్డీ ఆడి అందరినీ కనువిందు చేసింది. అంతకంటే ఎక్కువగా ఆమె పెట్టిన కూత అందరిని ఆకర్షించింది. 2024.. జగనన్న వన్స్ మోర్ అంటూ కూత పెట్టి రోజూ బరిలోకి దిగితే అందరూ హర్షద్వానాలతో మంత్రి రోజాను ఎంకరేజ్ చేశారు. మామూలుగానే రోజా సీఎం జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని.
అవకాశం వచ్చిన ప్రతిసారి తన అభిమానాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది రోజా. అయితే కబడ్డీ బరిలో దిగిన మంత్రి రోజా కబడ్డీ కబడ్డీ అని కూత పెట్టకుండా 2024.. జగనన్న వన్స్ మోర్ అంటూ కూత పెట్టారు. అనంతరం కూతకు వచ్చిన ప్రత్యర్ది ని క్యాచ్ పట్టి మురిసిపోయారు. మధ్యలో ఒకసారి వెనక్కి తిరిగి కాలెత్తి లెగ్ టచ్ కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా షర్మిల టైంపాస్ రాజకీయాలు చేస్తోందంటూ షర్మిల పై ఫైర్ అయ్యారు. షర్మిల మాట్లాడే ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్ట్టేఅని చురక అంటించారు. వైయస్సార్ పంచలు ఊడదీసి కొడతా అన్నా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పెళ్ళికి ఆహ్వానించి వచ్చిందని ఆగ్రహించారు. టీడీపీ కోవర్ట్ అన్న రేవంత్ రెడ్డి తో ఏ మొహం పెట్టుకొని పొత్తు పెట్టుకున్నారు అని ఫైర్ అయ్యారు.
ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయటం, విమర్శలు చేయడం తప్పితే ఏం చేస్తుంది అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు రోజా. ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభంలో కూడా రోజా కబడ్డీ ఆడి ప్లేయర్లందరినీ ఉత్సాహపరిచారు రోజా అప్పుడు కూడా వెరైటీగా కోత పెడుతూ చెట్టు మీద కొంగ.. చంద్రబాబు దొంగ అంటూ కూతకు వెళ్ళటం జరిగింది. ఆరోజు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
2024..జగనన్న వన్స్ మోర్ అంటూ కబడ్డీ కుతకెళ్లిన మంత్రి రోజా..#AndhraPardesh #Election2024 #YSRCP #CMYSJagan #ministerroja #kabaddi #adudamandhra #NTVTelugu #TeluguNews pic.twitter.com/410YIa7vtj
— NTV Telugu (@NtvTeluguLive) February 13, 2024











ఆనంద్ మూవీలో సమత అనే అల్లరి పిల్ల పాత్రలో నటించిన బాలనటి అసలు పేరు బఖితా ఫ్రాన్సిస్. 2004లో ఈ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బఖితా ఫ్రాన్సిస్ ఉత్తమ బాల నటిగా నంది అవార్డు అందుకుంది. అయితే ఆమె ఈ మూవీ తరువాత మళ్ళీ వెండితెర పై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. బఖితాకు నటిగా మంచి ప్రతిభ ఉన్నప్పటికీ యాక్టింగ్ తన ఫ్యాషన్ కాదట. శేఖర్ కమ్ముల కోసమే సరదాగా ఆనంద్ మూవీలో నటించిందట.
బఖితా వయసు 26 ఏళ్ళు. ఆమె సమాజ సేవలో ప్రస్తుతం బిజీగా ఉంది. 17 ఏళ్ళ వయసు నుండే బఖితా ఫ్రాన్సిస్ మహిళల హక్కుల కోసం, సొసైటీలో మహిళలకు మగాళ్లతో సమనంగా హక్కులు కల్పించాలని పోరాడుతుంది. అలాగే అమ్మాయిల పై దాడులు గాని, అ-త్యా-చా-రా-లు జరగకుండా కఠిన చట్టాలను తీసుకురావాలని పోరాటం చేస్తోంది. సొసైటీకి ఉపయోగపడేలా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యం తనను ఇలా ఆలోచించేలా చేసిందని అని వెల్లడించింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బఖితా, తరచూ తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. ఈ ఫోటోలను చూసిన కొందరు చాలా అందంగా ఉన్నారు. మళ్ళీ సినిమాల్లో నటించొచ్చు కదా అని అడిగితే, అది తనకు ఇష్టం లేదని బఖితా ఫ్రాన్సిస్ చెప్పారట.
గుర్ఫతే సింగ్ పిర్జాదా అక్క మరెవరో కాదు. ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’ మూవీలో సందడి చేసిన మెహ్రీన్ పిర్జాదా. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వరుణ్ తేజ్కి జంటగా మెహ్రీన్ నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ ‘ఎఫ్ 3’ లో కూడా నటించి అలరించింది.
మెహ్రీన్ పిర్జాదా 1995లో పంజాబ్లో నవంబర్ 5న సిక్కు కుటుంబంలో జన్మించారు. ఆమె తమ్ముడు గుర్ఫతే సింగ్ పిర్జాదా అనే తమ్ముడు ఉన్నాడు. అతను మోడల్ మరియు నటుడు. మెహ్రీన్ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టారు. ఆ మూవీ హిట్ అవడంతో టాలీవుడ్ లో ఆమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి.
మహానుభావుడు, కవచం, రాజా ది గ్రేట్, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 లాంటి చిత్రాలలో మెహ్రీన్ పిర్జాదా నటించారు. ఆమె తెలుగులోనే కాకుండా తమిళం, పంజాబీ, హిందీ చిత్రాలలో నటించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మెహ్రీన్ తరచూ తన ఫోటో షూట్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. మెహ్రీన్ పెట్టే పోస్టులకు లైకుల, కామెంట్లు పెడుతుంటారు.







