రైటర్ పద్మభూషణ్ మూవీతోవిజయాన్ని అందుకున్న నటుడు సుహాస్ రీసెంట్ గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుహాస్ హీరోగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ గా శివాని నగారం నటించగా, శరణ్యా ప్రదీప్ కీలకమైన పాత్రలో నటించింది.
ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లు సాధిస్తూ తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కొత్త దర్శకుడు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ విలేజ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. థియేటర్లలో ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను మొదలుపెట్టిన సుహాస్ కలర్ఫొటో మూవీతో హీరోగా మారారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని, గత ఏడాది రైటర్ పద్మభూషణ్ మూవీతో హిట్ అందుకున్నాడు. తనకంటూ మార్కెట్ను, ఫ్యాన్స్ బేస్ ను క్రిియేట్ చేసుకున్నారు. కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్గా సుహాస్ హీరోగా తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు టో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

కులవివక్ష, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. సొసైటీలోని అంతరాలు, పరువు, ప్రతిష్ట, లవ్ నేపథ్యంలో సాగే మూవీ ఇది. థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ సినిమాలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహా ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదల అయిన నెలరోజుల్లోపే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ వర్గాల్లో మార్చి 1 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుందని టాక్. అయితే ఈ విషయం పై ఇప్పటివరకు ఆహా నుండి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: ఒకప్పటి హీరో “సురేష్”…ఇలా మారిపోవడానికి ఫాలో అయిన డైట్ ఏంటో తెలుసా.?

హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి అరచేతిలోని జీవనరేఖ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అంత శుభకరం కాదని, అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. పుట్టుమచ్చ హృదయరేఖ మీద ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు ఆరోగ్యపరంగా మంచిది కాదట. అంతేకాక అశుభంగా కూడా పరిగణిస్తారట. పుట్టుమచ్చ కనుక అదృష్ట రేఖ మీద ఉంటే ఆ జాతకుల జీవితం ఎప్పుడూ ఏదో ఒక విషయంలో అలజడికి లోనవుతుందట.
అంతేకాకుండా అరచేతిలోని వివాహ రేఖ మీద పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తులకు పెళ్ళికి సంబంధించిన అంతరాయం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, అరచేతిలో సూర్య పర్వతం మీద పుట్టు మచ్చ ఉన్నట్లయితే అది ఆ వ్యక్తులకు అశుభంగా పరిగణిస్తారట. ఇలా ఉండడం వల్ల ఆ వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీస్తుందని సూచిస్తున్నారు. అంతే కాకుండా ఇతరులు చేసిన తప్పులకు చాలాసార్లు ఈ వ్యక్తులు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
పుట్టుమచ్చ అరచేతిలో ఉండే బుధ పర్వతం మీద ఉంటే ఆ వ్యక్తులకు నష్టాలు కలుగుతాయని సూచిస్తున్నారు. పుట్టుమచ్చ అరచేతిలోని విధి రేఖ మీద ఉన్నట్లయితే ఆ వ్యక్తులకు అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఈ వ్యక్తులు జీవితాంతం ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. చేసే పని విషయంలోనూ మరియు ఆర్థికంగానూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హస్త సాముద్రిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.


మహామహిమాన్వితమైన అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో అలంపూర్ జోగులాంబ దేవాలయం ఒకటి. తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ మండలానికి చెందిన గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ గ్రామం తెలంగాణ రాష్ట్ర జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు పాత మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ మండలంలో ఉండేది. ఇది కర్నూలు నుంచి 25 కి. మీ. దూరంలో ఉంది. ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన అలంపూర్ పట్టణంలో జోగులాంబ ఆలయం ప్రముఖంగా ఉంది.







తల్లి కావడం కోసం సరి అయిన వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య గర్భధారణ మంచిదని గైనకాలజిస్టు డాక్టర్ నందినీ పాల్షేత్కర్ అన్నారు. అయితే 35 సంవత్సరాల తర్వాత తల్లి అయితే చాలా సమస్యలు ఎదురవుతాయని, అందుకే 25 నుంచి 35 సంవత్సరాలు గర్భధారణ సరైన వయసని ఆమె చెప్పారు.
వయసు మహిళల్లో అండాల సంఖ్య మీద ప్రభావం చూపిస్తుంది. ఇక వయసు పెరుగుతున్నకొద్ది మహిళల్లో అండాల సంఖ్య తగ్గుతుందని ఎన్నో పరిశోధనల్లో తెలిసింది. పురుషుల్లో శుక్రకణాలు రోజూ ఉత్పత్తి అవుతుంటాయి. అయితే మహిళల్లో పది లక్షల అండాలు మాత్రమే ఉంటాయి. రజస్వల అయ్యే టైంకి అండాలు సంఖ్య 3,00,000 పరిమితం అవుతుంది. 37 సంవత్సరాలకు మహిళల్లో అండాల సంఖ్య 25,000కు తగ్గుతాయి. 51 సంవత్సరాలకు అండాల సంఖ్య 1000 మాత్రమే.
వయసు పెరుగుతున్నకొద్ది అండాల సంఖ్య తగ్గడం మాత్రమే కాకుండా అండాల నాణ్యత తగ్గిపోతుంది. ఆలస్యంగా తల్లి కావడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆలస్యంగా గర్భం దాల్చడం వల్ల ఆ ప్రభావం తల్లి పైన, బిడ్డ పైన దుష్ప్రభావం పడుతుంది. మొదటి ముడు నెలలు అబార్షన్స్ ఎక్కువగా అవుతుంటాయి. డయాబెటిస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.





చట్ట ప్రకారం వివాహం జరిగిన తరువాత భార్య లేదా భర్త నుండి విడాకులు రాకుండా రెండవ వివాహం చేసుకోవడం అనేది చట్ట విరుద్ధం అవుతుంది. ఒకవేళ అలా చేసుకుంటే కనుక IPC సెక్షన్ 494 ప్రకారం బైగమీ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది మరియు రెండవ వివాహం చెల్లదు. అంటే చట్ట ప్రకారం పెళ్లి జరిగిన తరువాత ఆ వ్యక్తి ఇంకొక పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా విడాకులు రావాల్సిందే.
ఈ విషయం తెలియక చాలా మంది, లేదా ఏం చేస్తారులే అనుకుని రెండవ పెళ్లి చేసుకుంటుంటారు. ఒకవేళ భార్య లేదా భర్త రెండవ పెళ్లి చేసుకున్న భర్త లేదా భర్త మీద కేసు నమోదు చేసే హక్కు ఉంటుందని వెల్లడించారు. అలాంటి సమయంలో రెండవ పెళ్లి చేసుకున్న వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్షపడుతుంది.
హిందూ వివాహచట్టం ప్రకారంగా డైవర్స్ కోరుతూ దాఖలైన పిటిషన్ను ఒప్పుకుంటూ భర్త లేదా భార్య ప్రమాణ పత్రాన్ని ఇచ్చినట్లు అయితే వారి పెళ్లి రద్దువుతుంది. కానీ, విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నా రెండవ వివాహం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి