బయోపిక్ కథలతో తీసే సినిమాలు లేదా వెబ్ సిరీస్ పైన ఆడియెన్స్ ఎక్కువ ఆసక్తిని కనపరుస్తారు. అందువల్ల దర్శక, నిర్మాతలు సినిమాలు మాత్రమే కాకుండా బయోపిక్ గా వెబ్సిరీస్లను కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం పోరాడిన శ్రీగౌరి సావంత్ కథ ఆధారంగా ‘తాలీ’ అనే వెబ్ సిరీస్ ను తీశారు.
ఈ సిరీస్ కు రవి జాదవ్ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ లీడ్ రోల్ లో నటించారు. ఈ వెబ్సిరీస్ తాజాగా ‘జియో సినిమా’ లో రిలీజ్ అయ్యింది. ఈ వెబ్సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ ట్రాన్స్జెండర్గా నటించిన ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లుగా రూపొందింది.ఈ సిరీస్ కథలోకి వెళ్తే, గణేశ్ (కృతిక) ఒక పోలీసు ఆఫీసర్ కుమారుడు. అతనికి చిన్నప్పటి నుండే అమ్మాయిగా మారాలనె కోరిక ఉంటుంది. స్కూల్లో టీచర్ పెద్దగా అయిన తరువాత ఏమవుతావ్?’ అని అడిగితే అమ్మను అవుతానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఈ విషయాన్ని గణేశ్ చెప్పకుండానే ఇంట్లో వారికి అర్థమవుతుంది. ఆ తరువాత గణేష్ తల్లి చనిపోతుంది.
అప్పుడు తండ్రి గణేష్ తో నీ నిర్ణయాన్ని మార్చుకుంటేనే ఇంట్లో ఉండమని లేదంటే బయటికి వెళ్ళమని చెబుతాడు. 15 సంవత్సరాల వయసులో గణేశ్ ఇంట్లోంచి బయటకు వచ్చి, సర్జరీ ద్వారా అమ్మాయిగా మారి, గౌరి (సుస్మితా సేన్) గా పేరు మార్చుకుంటాడు. అమ్మ కావలనే తన కోరికను గౌరి నెరవేర్చుకుందా? ట్రాన్స్జెండర్లకు గుర్తింపు తీసుకురావడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది? అనేది మిగతా కథ.
సుస్మితా సేన్ నటన ఇలాంటి క్యారెక్టర్ ను అంగీకరించడమే సాహసం అనుకుంటే ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు. అనేది. ఆమె ట్రాన్స్జెండర్ పాత్రలో జీవించింది. గణేశ్ పాత్రలో కృతిక డియో, తండ్రి పాత్రలో నందు యాదవ్, మిగతా నటీనటులు కూడ బాగా నటించారు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విజువల్స్, రవి జాదవ్ టేకింగ్ బాగుంది.

2001లో రిలీజ్ ‘గదర్’ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు. పాకిస్తాన్లోని పొలిటికల్ ముస్లిం ఫ్యామిలీకి చెందిన సకీనా (అమీషా పటేల్) తో అమ్మాయితో సిక్కు అయిన తారా సింగ్ (సన్నీ డియోల్) ల ప్రేమకథ చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. ఈ మూవీకి 22 ఏళ్ల తరువాత సీక్వెల్ గా వచ్చిన ‘గదర్ 2’ కు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కూడా సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు.
గదర్ 2 కథ విషయానికి వస్తే, ఇది తండ్రికొడుకుల చుట్టూ సాగే కథ. తారా సింగ్ (సన్నీ డియోల్), సకీనా (అమీషా పటేల్) సంతోషంగా జీవిస్తుంటారు. వీరి కుమారుడు చరణ్జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ) పెద్దవాడవుతాడు. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం అవుతుంది. పాకిస్తానీ ఆర్మీతో పోరాడుతుండగా, సరిహద్దుల్లో చిక్కుకున్న ఆర్మీ యూనిట్కు సాయం చేయాల్సిందిగా ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర రావత్ (గౌరవ్ చోప్రా) తారా సింగ్ ను అడుగుతాడు.
అందుకు అంగీకరించిన తారా సింగ్ ఇండియన్ఆర్మీ యూనిట్కు శ్యామ్ చేయడమే కాకుండా పాకిస్థాన్ సైనికులతో పోరాటం చేస్తాడు. ఈక్రమంలో పాకిస్తాన్ ఆర్మీ తారాసింగ్ తో పాటుగా కొంతమంది ఇండియన్ సోల్జర్స్, ట్రక్ డ్రైవర్లను కూడా పట్టుకుని పాక్ జైలులో బంధిస్తారు. దీంతో సకీనా, చరణ్జీత్ సింగ్ చాలా బాధపడుతారు. తల్లి బాధను చూసి భరించలేని చరణ్జీత్ తండ్రిని భారత్ కు తీసుకురావడానికి సిద్ధపడతాడు. అతను ఎలా పాకిస్థాన్ వెళ్ళాడు? ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తండ్రిని కాపాడాడా? అనేది మిగలిన కథ.
హీరో సన్నీ డియోల్ తారా సింగ్ గా అద్భుతంగా నటించాడు. అమీషా పటేల్ పాత్ర నిడివి తక్కువగా ఉంది. ఉత్కర్ష్ శర్మ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సిమ్రత్ కౌర్ అందంగా కనిపించింది. ముస్తాక్ ఖాన్, ఎహసాన్ ఖాన్, ముస్తాక్ కాక్ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. ఆడియెన్స్ తో పాటు, ప్రభాస్ ఫ్యాన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం దర్శకుడు ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు, వివాదాలు, కోర్టులో కేసులు వేసే వరకు వెళ్ళింది. రామాయణంను మార్చి చూపించారని, రావణాసురుడి క్యారెక్టర్ ను తప్పుగా చూపించారని, హనుమంతుడితో మాస డైలాగ్స్ చెప్పించారని, పేర్లు మార్చారని ఇలా ఎన్నోవివాదాలు వచ్చాయి.
తాజాగా కోరాలో “ఆది పురుష్ సినిమాలో లక్ష్మణుడిపేరు శేషు అని పెట్టారు. దీని గురించి వివరించగలరా?” అనే ప్రశ్నను అడుగగా
ఆ పామే లక్ష్మణునిగా జన్మించింది. అందుకే ఈ సినిమాలో లక్ష్మణుని పూర్వ జన్మ పేరుతో శేషు అని పిలిచాడు రాముడు. ఇంకా మహావిష్ణువు యొక్క శంకు, చక్రాలు – భరత, శతృఘ్నులుగా, ఆయన సతీదేవి అయినటువంటి మహాలక్ష్మి దేవి సీతగా జన్మించారు” అని తెలిపారు.
జైలర్ మూవీ ఇప్పటివరకు 4 వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ మూవీలోని పలువురు నటులకు గుర్తింపు వచ్చింది. ఇంతవరకు వారు పలు సినిమాలలో నటించినా రాని పాపులారిటీ ఈ మూవీతో వచ్చింది. ఈ మూవీలోని నటులకు సంబంధించిన వివరాలను నెటిజెన్లు వెతికి మరి, వారి గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వారి వివరాలు తెలిసిన తరువాత ఆశ్చర్యపోతూ, కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జైలర్ మూవీలో వేసుకున్న రజనీకాంత్ జైలర్ లో జైలర్లో తమన్నా లవర్ డైరెక్టర్ బాగున్నార బాలుగా నటించిన యాక్టర్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఆ నటుడి పేరు సునీల్ రెడ్డి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ గత చిత్రాలలో కూడా సునీల్ రెడ్డి నటించాడు. డాక్టర్ మూవీలో మహాలి అనే పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత విజయయ్ దళపతి నటించిన బీస్ట్ మూవీలో కూడా నటించారు.
ఈ సునీల్ రెడ్డి మరెవరో కాదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి కుమారుడు. వైభవ్ రెడ్డికి అన్నయ్య. నటుడిగా మారకముందు సునీల్ రెడ్డి తండ్రి కోదండరామి రెడ్డి డైరక్షన్ చేసిన గొడవ, కాస్కో లాంటి తెలుగు సినిమాలకు సమర్పకుడిగా పనిచేశాడు.













మెగాస్టార్ చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ భోళా శంకర్. ఈ సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీకి వచ్చిన టాక్, కలెక్షన్స్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు. చిరంజీవి మూవీకి ఇలాంటి కండిషన్ ఏమిటని మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్ అని ప్రకటించినపుడే ఆడియెన్స్ తో పాటు, మెగా ఫ్యాన్స్ మూవీ పై ఆశలు వదిలేసుకున్నారు. అయితే టీజర్, ట్రైలర్ మరియు మూవీ ప్రమోషన్స్లో చిరంజీవి, డైరెక్టర్, నిర్మాత చెప్పిన మాటలకు ఈ మూవీ పై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. మహతి స్వరసాగర్ ఇంతకు ముందు చేసిన పాటలు హిట్ అయ్యాయి. దాంతో భోళా శంకర్ మూవీకి మంచి పాటలు ఇస్తాడనుకున్నారు.
ఈ మూవీలోనీ ఏ పాట కూడా చార్ట్ బస్టర్ అవలేదు. యూట్యూబ్లో కూడా ట్రెండ్ కాలేదు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే మహతి స్వర సాగర్ తాజాగా ఈ విషయం పై స్పందించాడని తెలుస్తోంది. ఈ మూవీకి తాను ఇచ్చిన పాటలు, కంపోజిషన్ పట్ల అసంతృప్తితో ఉన్నానని, మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్టుగా ఇవ్వలేకపోయానని అన్నట్టుగా సమాచారం. ఈ వార్త తెలిసిన నెటిజెన్లు, అంతా అయ్యాక అనుకుంటే ఏం వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
జాఫర్ సాదిక్ తమిళనాడులో ఈరోడ్లో 1995 జూలై 4 న జన్మించాడు. ప్రస్తుతం కోలీవుడ్ మరియు టాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నజాఫర్ నటుడు మాత్రమే కాదు. అతను కొరియోగ్రాఫర్ మరియు డాన్సర్. కోలీవుడ్ లో పాపులర్ టెలివిజన్ డ్యాన్స్ షో ‘ఉంగలిల్ యార్ ప్రభుదేవా’ రెండవ సీజన్లో 2వ స్థానం పొందిన తర్వాత జాఫర్ పాపులర్ అయ్యాడు. ఆ తరువాత అతను సొంతంగా ‘లిఫ్టోదర్స్’ అనే పేరుతో డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించాడు.
జాఫర్ అనేక ఈవెంట్లలో స్టేజ్ షోస్ ఇచ్చాడు. అలా అతను 500కి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో ఫిబ్రవరి 13న జరిగిన TedxGCT ఈవెంట్లో జాఫర్ సాదిక్ చేసిన డ్యాన్స్ తో మరింత పాపులారిటీ వచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ వేలమంది ఫాలోవర్స్ ను సంపాదించాడు. ప్రస్తుతం అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 506 K. జాఫర్ సాదిక్ ఓటీటీ ప్లాట్ఫారమ్ నెట్ఫ్లిక్స్ సినిమా సిరీస్ ‘పావ కాదైగల్’లో నారికుట్టిగా నటించాడు.
ఆ తరువాత కోలీవుడ్ లో లోకేష్ కనకారాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ మూవీలో మొదటిసారిగా నటించాడు. గ్యాంగ్ లో మెంబర్ గా నటించినప్పటికీ అతని పాత్రకి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తరువాత అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. అలా జైలర్, విజయ్ దళపతి లియో, షారుక్ ఖాన్ జవాన్ సినిమాలలో నటిస్తున్నాడు.
మల్లికా షెరావత్ 1976 లో అక్టోబరు 24న హర్యానాలోని చిన్న గ్రామం మోథ్ లో జన్మించింది. ఆమె తండ్రి పేరు ముఖేష్ కుమార్ లాంబా. వారిది సంప్రదాయ కుటుంబం. ఆమె అసలు పేరు రీమా లాంబా. ఇండస్ట్రీలో రీమా పేరుతో ఇతర నటీమణులతో ఉండడంతో తన పేరును మల్లికా గా మార్చుకుంది. షెరావత్ మల్లికా తల్లి పుట్టింటి ఇంటి పేరు. తల్లి ఇచ్చిన మద్దతు వల్ల ఆ పేరును ఉపయోగిస్తున్నానని ఒక సందర్భంలో ఆమె చెప్పింది.
మల్లికా షెరావత్ మధుర రోడ్ లో ఉండే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ మిరాండా హౌస్ లో డిగ్రీ చేసింది. మల్లిక సినిమాల్లో నటించడం తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆమె ఇంట్లో నుండి పారిపోయి వచ్చి, హిందీలో ఎంట్రీ ఇచ్చింది. మర్డర్ మూవీతో ఆమెకు గుర్తింపు వచ్చింది. వరుస సినిమాలలో నటిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.
మలయాళ హీరో కున్చకో బొబన్ మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితుడే. కున్చకో బొబన్ హీరోగా నటించిన మలయాళ మూవీ ‘పద్మిని’ జులై 14న థియేటర్లలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సెన్నా హెగ్డే తెరకెక్కించారు. ఈ మూవీలో మడోన్నా సెబాస్టియన్, అపర్ణా బాలమురళి, విన్సీ అలోషియస్, సజిన్, మాళవిక మేనన్ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఒక కాలేజీలో రమేష్ (కున్చకో బొబన్) ప్రొఫెసర్గా వర్క్ చేస్తుంటాడు. అతను కథలు కూడా రాస్తుంటాడు.
రమేష్ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడతాడు. కానీ మొదటి రాత్రే రమేష్ భార్య లవ్ చేసిన వ్యక్తితో వెళ్లిపోతుంది. ఆ తరువాత రమేష్ తల్లిదండ్రులు అతనికి రెండవ పెళ్లి చేయాలని భావిస్తారు. దానికి రమేశ్ కూడా ఒప్పుకోవడంతో పెళ్లి సంబంధం చూస్తారు. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ రమేష్ కు అధికారికంగా విడాకులు వస్తేనే తమ కూతురుని ఇస్తామని షరతు పెడతారు.
అయితే భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియని రమేశ్ ఆమెను ఎలా వెతికి, పట్టుకున్నాడు? ఆమెను వెతికే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? రమేష్ కు లాయర్ (అపర్ణా బాలమురళి) ఎలా సహాయం చేసింది. చివరికి రమేష్ రెండవ పెళ్లి చేసుకున్నాడా? లేదా ఇంతకీ కథలో పద్మిని ఎవరు? అనేది మిగతా కథ.
లోపల బాధను ఉంచుకుని, పైకి బాధ కనిపించకుండా నవ్వుతూ కనిపించే రమేశ్ క్యారెక్టర్ లో కున్చకో బొబన్ ఒదిగిపోయారు. లాయర్ గా అపర్ణ బాలమురళీ నటన బాగుంది. సజిన్ కామెడీ టైమింగ్, మడోన్నా సెబాస్టియన్, విన్సీ అలోషియస్, మాళవిక మేనన్, అలరిస్తారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అనుకున్న స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ సెన్నా హెగ్డే సక్సెస్ అయ్యాడు.