సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’ ఇటీవల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న కలెక్షన్ల సునామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ అటు కోలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోను రికార్డులను క్రియేట్ చేస్తోంది.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీలో ప్రత్యేక పాత్రలలో ఇతర ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోలను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఆ హీరోల క్యారెక్టర్లనే విషయం తెలిసిందే. అయితే తెలుగు ఆడియెన్స్ మాత్రం అన్నీ బానే ఉన్నాయి. కానీ ఈ ఒక్కటి అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. తెలుగులో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ నటించారు. జైలర్ సక్సెస్ లో స్పెషల్ క్యామియోలు కీలకమైన పాత్రను పోషించాయి. డైరెక్టర్ ఈ మూవీ కోసం ఇతర ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోలను తీసుకున్నారు.
కన్నడ ఇండస్ట్రీ నుండి శివ రాజ్ కుమార్, మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్, బాలీవుడ్ నుండి జాకీష్రాఫ్ వంటివారిని తీసుకున్నారు. వారి పాత్రలు కూడా బాగున్నాయి. వీరిలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఆడియెన్స్ లో బలంగా ఉందని చెప్పవచ్చు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుండి సునీల్ తీసుకున్నారు. అది కూడా కామెడీ హీరో క్యారెక్టర్.
కోలీవుడ్ ఆడియెన్స్ కి ఈ క్యారెక్టర్ నచ్చినప్పటికి, తెలుగు ఆడియెన్స్ కొందరు మాత్రం సునీల్ పాత్రని ట్రోల్ చేసినట్టుగా ఉందని అంటున్నారు. మిగతా ఇండస్ట్రీల నుండి అగ్ర హీరోలను తీసుకుని, పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో చూపించారని. తెలుగు నుండి సునీల్ వంటి నటుడిని తీసుకుని, కమెడియన్ గా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మూవీ హిట్ అయ్యిందని నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.
Also Read: “జైలర్” సినిమాలో “రజినీకాంత్ కోడలు” పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

తెలుగులో అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ ను చూసినవారెంతో మంది ఉన్నారు. తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేదని చాలా మంది ఫ్యాన్స్ బాధ పడుతుండేవారు. అయితే త్వరలో తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ తర్వాత ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ పార్టనర్ గా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మారింది. కానీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో లేదు.
ఆ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా తీసుకుంది. స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న తరువాత జియో సినిమా భారతీయ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమనులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా స్ట్రీమ్ అవనుంది. ఈ న్యూస్ విన్నప్పటి నుండి ఎప్పుడెప్పుడు ప్రాంతీయ భాషలలో స్ట్రీమ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే బాహుబలి 2 సినిమాలోని సన్నివేశాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి కాపీ చేశారని బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయినపుడు విమర్శలు వచ్చాయి. బాహుబలి పై నుండి వస్తున్న అగ్ని బాణాలకు ఆకాశం వైపు చూస్తూ చేతులు తెరుస్తాడు. ఇలాంటి సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉంటుంది. అలాగే అమరేంద్ర బాహుబలి ఖడ్గం లాంటి ఆయుధం కూడా ఆ సిరీస్ లో కనిపిస్తుంది.
సూపర్ స్టార్ రజినికాంత్ మూవీ విజయం సాధించి చాలా ఏళ్లు అవుతోంది. అందువల్ల మొదట్లో ఏమాత్రం అంచనాలు లేని జైలర్ మూవీ, ట్రైలర్ తో రిలీజ్ కు ముందు మంచి హైప్ తెచ్చుకుంది. రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ క్యామియో రోల్స్ లో కనిపించారు. తమన్నా, సునీల్, వినాయకన్ కీలకపాత్రలలో నటించారు.
అయితే ఈ మూవీలో రజినీకాంత్ కోడలి పాత్రలో కనిపించిన నటి కూడా హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. ఆమె తెలుగు చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆమె అసలు పేరు అదితి. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత మిర్నా మేనన్గా మారింది. టాలీవుడ్ లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘క్రేజీ ఫెలో’, అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన ‘ఉగ్రం’లో కూడా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
మిర్నా మేనన్ కేరళలో ఇడుక్కిలో జన్మించింది. ఇండస్ట్రీకి రాకముందు ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్గా వర్క్ చేసింది. ఆ తరువాత ఆమె ఫొటోలని చూసి ఒక దర్శకుడు తన మూవీలో అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా 2016లో ‘పట్టదారి’ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత ‘కలవని మప్పిలై’ అనే సినిమాలో నటించింది. కోలీవుడ్ లో రెండు చిత్రాలు చేసిన తరువాత మలయాళంలో మోహన్లాల్ నటించిన ‘బిగ్ బ్రదర్’ మూవీలో నటించింది. అలా ఆమెకు గుర్తింపు వచ్చింది.
కానీ ఇటీవల కాలంలో ప్రసారం అవుతున్న కొన్ని సీరియల్స్ లోని సన్నివేశాలు లాజిక్స్ కి దూరంగా తీస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలను చూసిన నెటిజన్లు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వైరల్ చేస్తున్నారు. ఇలా పలు సీరియల్స్ లోని సీన్లు వాస్తవానికి దూరంగా ఉండడంతో నెట్టింట్లో విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నాయి.
తాజాగా ప్రసారం అయిన ఒక హిందీ సీరియల్ లో టెలిఫోన్ వైర్ దాని ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించే సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో అయితే ఇలాంటివాటిని అంతగా ప్రేక్షకులు పట్టించుకొనే వారు కాదు. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరగడంతో ఇలాంటి సన్నివేశాల పై విపరితమైన ట్రోల్స్ పెరుగుతున్నాయి. తాజాగా ఒక హిందీ సీరియల్ కు చెందిన సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సదరు సీరియల్ లో ఒక వ్యక్తి కాల్ మాట్లాడుతూ నడుస్తూ, జారీ కిందపడతాడు. అయితే ఈ క్రమంలో అతని చెయ్యి టెలిఫోన్ ను తాకుతుంది. దాంతో రిసీవర్ ఎగిరి పైన తిరుగుతున్న ఫ్యాన్ పై నుండి కిందికి వచ్చి అతని మెడకు చుట్టుకుంటుంది. ఆ వైర్ అలా వస్తూనే, అతని మెడకి మరింతగా చుట్టుకుంటూ ఉంటుంది. అంతలోనే ఆ గదిలోకి వచ్చిన వారు అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ సీన్ చూసిన నెటిజెన్లు ‘ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు’ అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.





దాదాపు పదేళ్ళ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన మూవీ భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించగా, కీలక పాత్రలో యంగ్ హీరో సుశాంత్ నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 11 న విడుదల అయ్యి, మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలోనీ సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మీమ్స్ క్రియేట్ చేస్తూ నెటిజెన్లు ఈ మూవీని, మెహర్ రమేష్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
సినిమా పోయి మేకర్స్ దగ్గర నుండి అభిమానుల వరకు బాధలో ఉంటే, మరో వైపు ఈ మూవీ ప్లాప్ అవడం కూడా మంచిదే అని కొందరు అంటున్నారు. ఇది అన్నది సినీ ప్రేక్షకులు కాదు, టీమిండియా అభిమానులు. అలా అనడానికి కారణం ఏమిటంటే, 2011లో మెహర్ రమేశ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన ‘శక్తి’ మూవీ రిలీజ్ అయ్యి, డిజాస్టర్ గా నిలిచింది. అయితే అదే ఏడాది ధోనీ సేన వన్డే ప్రపంచ కప్ ను సాధించింది. ఇది భారత్ గెలిచిన రెండవ ప్రపంచ కప్.
ఆ తరువాత 2013లో మెహర్ రమేష్ వెంకటేశ్ హీరోగా తీసిన ‘షాడో’ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే అదే ఏడాది భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఇక ఈ ఏడాది కూడా ప్రపంచ కప్ జరగనుంది. మెహర్ రమేశ్ తీసిన భోళా శంకర్ మూవీ ప్లాప్ అవడం అటు చిరంజీవికి, ఇటు మెగా ఫ్యాన్స్కు ఊహించని విధంగా షాకిచ్చింది. మెహర్ రమేష్ ప్లాప్ సెంటిమెంట్ కొనసాగితే, ఈ ఏడాది కూడా ప్రపంచ కప్ ఇండియాదే అని టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
జైలర్ మూవీలో రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించగా ఆయన భార్యగా ఈ మూవీలో రమ్యకృష్ణ నటించింది. తమన్నా, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం మూడు రోజుల్లో 200 కోట్ల వసూలు చేసినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. గత 10 ఏళ్ల కాలంలో రజనీకాంత్ సినిమాలు ఆశించిన సక్సెస్ అందుకోలేదు. జైలర్ మూవీతో అన్ని చోట్ల మంచి వసూళ్లను సాధిస్తోందని చెప్పవచ్చు.
జైలర్ మూవీ విజయంలో క్యామియో రోల్స్ కీలక పాత్ర పోషించాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిలో ముఖ్యంగా శివ రాజ్ కుమార్ పాత్ర హైలెట్ గా నిలిచింది. నరసింహా అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించి, థియేటర్లను షేక్ చేశారు. చాలామందికి, ఇతర రాష్ట్రాలవారికి ఆయన అంతగా తెలియకపోవచ్చు. శివ రాజ్ కుమార్ శాండల్ వుడ్ లో పెద్ద స్టార్. ఈ మూవీ తరువాత ఆయన గురించి ఆన్ లైన్ లో వెతుకుతున్నారు.
ఆయన మూవీలో కనిపించింది కొన్ని నిముషాలు అయినా, ఆయన పంచెకట్టుతో కనిపించి, ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఆయన రోల్ కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ వచ్చిందంటే, మూవీలో ఆయన వాడిన ఒక టిష్యూ కూడా పాపులర్ అయ్యింది. ఈ మూవీలో శివ రాజ్ కుమార్ ఓరిగామి అనే టిష్యూను ఉపయోగించారు. ఆ సీన్ తర్వాత ఈ టిష్యూలు కూడా విపరీతంగా ఫేమస్ అయిపోయాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తమిళంలో హిట్ అయిన వేదళం మూవీ రీమేక్ గా భోళా శంకర్ మూవీని మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ నటించారు. ఆగస్ట్ 11 న రిలీజ్ అయిన ఈమూవీ ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీని విమర్శిస్తూ నెట్టింట్లో ట్రోల్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ కు కూడా దారుణంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. 
ఈ హీరో ఎవరో కాదు, హీరో రాజశేఖర్. ఆ హీరోయిన్ ఆయన సతీమణి జీవిత. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, తన మూవీలో హీరోయిన్ గా జీవితను వద్దని, మార్చమని చెప్పినందుకు, ఆ మూవీ నుండి హీరోగా రాజశేఖర్ ని తొలగించి, వేరే హీరోతో మూవీని తీసారంట. ఇది వీరు పెళ్లి చేసుకోకముందు జరిగిన ఇన్సిడెంట్. రాజశేఖర్ సినిమాలలోకి వచ్చేసరికి జీవిత హీరోయిన్ గా నటిస్తోంది.
రాజశేఖర్ కెరీర్ మొదట్లో తాను హీరోగా నటించే ఒక సినిమాలో హీరోయిన్ గా జీవితను తీసుకున్నారట. ఆ షూటింగ్ లో ఆమెను మొదటిసారి చూసిన రాజశేఖర్ ఈమె హీరోయినా అనుకున్నారంట. మూవీ షూటింగ్ లో జీవిత జ్వరం వచ్చి పడిపోగా, అప్పటికే డాక్టర్ అయిన రాజశేఖర్ ఆమెకు ట్రీట్మెంట్ చేసి, కోలుకున్నాక ఇంటికి పంపించారంట. ఆమె వెళ్లిపోయాక దర్శకుడితో ఈమెను ఎలా హీరోయిన్ గా ఎంపిక చేశారు. నాకు అయితే నచ్చలేదు. మార్చితే మంచిది అని చెప్పారంట.
అప్పుడు ఆ డైరెక్టర్ కూడా మార్చితే మంచిది అన్నారట. కానీ జీవితను కాకుండా రాజశేఖర్ ను మార్చి , హీరో సురేష్ తో మూవీ పూర్తి చేశారంట. ఆ తరువాత కాలంలో జీవిత, రాజశేఖర్ కలిసి పలు సినిమాలలో నటించారు.ఇక వీరిద్దరూ నటిస్తున్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు కుమార్తెలు. వీరు కూడా హీరోయిన్లుగా పలు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.