కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ హీరో నటించిన తమిళ చిత్రాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం ద్వారా శివకార్తికేయన్ తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు.
రేమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో కూడా విజయం సాధించాడు. గత నెల 14న శివకార్తికేయన్ నటించిన మహావీరుడు మూవీ రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ మూవీ చూసిన నెటిజెన్లు ఈ చిత్రంలోని పొరపాటును గమనించి సోహల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తమిళ హీరో శివకార్తికేయన్ కు టాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ అనే తెలుగు సినిమాను చేశాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానీ శివకార్తికేయన్ ముందు సినిమాల కన్నా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇటీవల శివకార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యింది.
ఈ మూవీ మొదటి షోతోనే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మూవీ కాన్సెప్ట్ బాగున్నా, ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా ఉందనే టాక్ వచ్చింది. శివకార్తికేయన్ మార్క్ కామెడితో రూపొందింది. అయితే ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ మధ్య ఓటీటీలో సినిమాలు చూస్తూ, అందులో ఉండే పొరపాట్లను గమనించి, మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం, అవి కాస్త వైరల్ అవడం సాధారణం అయిపోయింది.
ఓటీటీలో ఈ మూవీని చూసి, ఇందులోని ఒక పొరపాటును గమనంచిన ఒక నెటిజెన్, హర్ష్ మీమర్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో దానికి సంబంధించిన వీడియోకి ‘ఎడిటింగ్ చూసుకోవాలి కదా’ అంటూ షేర్ చేశాడు. ఆ వీడియోలో బోర్డు పై ముందు తమిళంలో మా భూమి అని, వెంటనే తెలుగులోకి మారుతుంది. దీనిపై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/Cv6kfoEJK1c/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: “స్వర్ణ కమలం” సినిమాలో ఈ 2 సీన్స్ గమనించారా..? ఇందులో ఇంత అర్ధం ఉందా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకున్న తీవ్రమైన ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఈ మూవీలోని సీన్స్ ను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ సినిమాలకు ఇతర విషయాలతో ఉన్న కనెక్షన్స్ వెతికి పట్టుకొని మరి నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. మొన్నటి మొన్న మెహర్ రమేష్ సినిమాలు ప్లాప్ అయిన ఏడాది జరిగిన ప్రపంచ కప్ ఇండియకే వచ్చిందనే వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘నేనింతే’ సినిమాలో మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ గురించి ముందే చెప్పారనే విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
నేనింతే మూవీలో బ్రహ్మానందం తీసిన మూవీ పేరు షాడో. ఆ మూవీలోని పోస్టర్ పై ఉన్న షాడో ఫాంట్, మెహర్ రమేష్ తీసిన మూవీ షాడో ఫాంట్ ఒకేలా ఉంటాయి. నేనింతే మూవీ 2008 లో రిలీజ్ అయ్యింది. ఇక మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ 2013 లో రిలీజ్ అయ్యింది. దాంతో మెహర్ రమేష్ షాడో మూవీ గురించి పూరి జగన్నాధ్ నేనింతే సినిమాలో ముందే చెప్పారా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
జైలర్ మూవీని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించగా, ఆయన భార్యగా రమ్యకృష్ణ, కొడుకుగా యంగ్ హీరో వసంత్ రవి, కోడలిగా మిర్నా మేనన్ నటించారు. మనవడిగా నటించిన బాలనటుడు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. దాంతో నెటిజెన్లు ఆ అబ్బాయి ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు.
ఆ బాలనటుడి పేరు రిత్విక్ అతన్ని రీతు రాక్స్ అని కూడా పిలుస్తారు. జైలర్ మూవీ కన్నా మూడు పలు సినిమాలలో రిత్విక్ నటించాడు. అతని మొదటి సినిమా O2 (ఆక్సిజన్). ఈ మూవీలో నయనతార కుమారుడి పాత్రలో నటించాడు. ఆ తరువాత కార్తీ హీరోగా నటించిన సర్దార్ మూవీలో లైలా కొడుకుగా కీలక పాత్రలో నటించాడు. ఈ అబ్బాయికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాని ద్వారానే అతను సినిమాల్లోకి వచ్చాడు.
యూట్యూబ్ చైల్డ్ గా పాపులర్ అయిన రిత్విక్, తన యూట్యూబ్ ఛానెల్ ‘రీతు రాక్స్’ లో డిఫరెంట్ గెటప్లు ధరించి, నటించిన వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ ఛానెల్ ను రిత్విక్ తండ్రి జోతిరాజ్ చూసుకుంటాడు. ఆగస్ట్ 2023 నాటికి, రిత్విక్ యూట్యూబ్ ఛానెల్ రీతు రాక్స్ 2.36 మిలియన్ సబ్స్క్రైబర్ లు ఉన్నారు. అతని వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో మిలియన్ల వ్యూస్ ను సంపాదించాయి.
మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కి హీరో నాని హోస్ట్ గా చేశారు. మూడవ సీజన్ నుండి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక రాబోయేగా సీజన్ కి కూడా ఆయనే హోస్ట్. బిగ్ బాస్ సీజన్ 7 ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ప్రోమోలు ఈ సీజన్ పై అంచనాలను పెంచుతున్నాయి. ఏడవ సీజన్ సరికొత్తగా ఉండబోతుందని నాగార్జున ప్రోమోలలో హింట్ ఇస్తూ, ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచారు. ఇక ఈసారి ప్రోమోలను కూడా భిన్నంగా ప్లాన్ చేశారు.
తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమో నటించిన అమ్మాయి ఎవరా అని నెటిజెన్లు ఆరా తీస్తూ, ఆన్ లైన్ లో వెతుకుతున్నారు. అయితే తాజాగా వచ్చిన ప్రోమో కనిపించిన అమ్మాయి పేరు అలేఖ్య రెడ్డి. కొత్త నటి కాదు. ఆమె ఇప్పటికే పలు తెలుగు చిత్రాలలో నటించింది. అయితే ఆమె చేసింది ఎక్కువగా సైడ్ రోల్స్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ ప్రోమోతో ఆమె ప్రేక్షకుల దృష్టిలో పడడంతో ఆమె గురించి వెతుకుతున్నారు.
అలేఖ్య రెడ్డి ఇంటింటి రామాయణం, అశోక వనంలో అర్జున కల్యాణం , అర్థమైందా అర్జున్ కుమార్ వంటి చిత్రాలలో సినిమాల్లో నటించింది. అలేఖ్య రెడ్డి ఒక్క ప్రోమోలోనే నటించిందా? లేదా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా కూడా ఉంటుందా అనే విషయం తెలియాల్సిఉంది. ఇక రాబోయే బిగ్ బాస్ సీజన్లో దాదాపు ఇరవై మంది పోటీదారులు పాల్గొంటున్నారని సమాచారం.వీరిలో ఎక్కువగా సెలెబ్రెటీలు ఉన్నట్టు తెలుస్తోంది.
గుంటూరు కారం సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ మూవీ పై ఎన్నో ప్రచారాలు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం మూవీ షూటింగ్ కొనసాగుతుందా? ఆగిపోతుందా? అన్న విషయం సస్పెన్స్గా మారింది. ఈ మూవీ నుంచి హీరోయిన్ పూజాహెగ్డేతో పాటుగా సినిమాటోగ్రాఫర్ మధ్యలోనే మూవీ నుండి తప్పుకోవడం, షూటింగ్ కూడా పలుమార్లు వాయిదా పడుతుండడం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది.
ఈ సినిమా స్టోరీకి సంబంధించి ప్రచారాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐఎమ్డీబీ సైట్లో గుంటూరు కారం మూవీ స్టోరీకి సంబంధించిన సినాప్సిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మహేష్బాబు గుంటూరు సిటీకి డాన్గా నటిస్తున్నట్లు ఆ సినాప్సిస్ లో పేర్కొన్నారు. గుంటూరు సిటీలో జరుగుతున్న అన్యాయాల పై, అక్రమాల పై పోరాటం చేస్తున్న ఒక జర్నలిస్ట్తో సూపర్ స్టార్ మహేష్బాబు ప్రేమలో పడతాడు.
ఆమె లక్ష్యాన్ని సాధించడం కోసం ఆ డాన్ ఎలా తోడుగా నిలుస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ అని ఈ సినాప్పిస్లో కనిపిస్తోంది. త్రివిక్రమ్ మహేష్బాబు క్యారెక్టర్ను సర్ప్రైజ్ ట్విస్ట్తో డిజైన్ చేసినట్లుగా దానిలో చూపించారు. ఈ విషయం నిజమా? కాదా? అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఇక ఈ మూవీలో జర్నలిస్ట్ గా మీనాక్షిచౌదరి, మహేష్బాబుకు మరదలి పాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది.




వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన మూవీ ‘గాండీవధారి అర్జున’. ఈ మూవీలో విలన్గా వినయ్ రాయ్ నటించారు. రోషిణి ప్రకాష్, అభినవ్ గోమతం, నరేన్, మనీష్ చౌదరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.
మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ చిత్రం పై అంచనాలు పెరిగేలా చేశాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అది మాత్రమే కాకుండా సెన్సార్ సభ్యులు ఈ మూవీ పై పాజిటివ్గా స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని, ట్విస్టులు ఆకట్టుకుంటాయని సెన్సార్ బృందం చెప్పినట్లు సమాచారం. ఈ మూవీ తరువాత వరుణ్ తేజ్ తొలిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఆ మూవీ ‘మట్కా’ అనే టైటిల్ తో రీసెంట్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కరుణ కుమార్ డైరెక్షన్ చేస్తుండగా, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదే కాకుండా మరో మూవీలో కూడా వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఆ మూవీ పేరు ‘ఆపరేషన్ వాలెంటైన్’.




బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ ట్రాన్స్జెండర్గా నటించిన ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లుగా రూపొందింది.ఈ సిరీస్ కథలోకి వెళ్తే, గణేశ్ (కృతిక) ఒక పోలీసు ఆఫీసర్ కుమారుడు. అతనికి చిన్నప్పటి నుండే అమ్మాయిగా మారాలనె కోరిక ఉంటుంది. స్కూల్లో టీచర్ పెద్దగా అయిన తరువాత ఏమవుతావ్?’ అని అడిగితే అమ్మను అవుతానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఈ విషయాన్ని గణేశ్ చెప్పకుండానే ఇంట్లో వారికి అర్థమవుతుంది. ఆ తరువాత గణేష్ తల్లి చనిపోతుంది.
అప్పుడు తండ్రి గణేష్ తో నీ నిర్ణయాన్ని మార్చుకుంటేనే ఇంట్లో ఉండమని లేదంటే బయటికి వెళ్ళమని చెబుతాడు. 15 సంవత్సరాల వయసులో గణేశ్ ఇంట్లోంచి బయటకు వచ్చి, సర్జరీ ద్వారా అమ్మాయిగా మారి, గౌరి (సుస్మితా సేన్) గా పేరు మార్చుకుంటాడు. అమ్మ కావలనే తన కోరికను గౌరి నెరవేర్చుకుందా? ట్రాన్స్జెండర్లకు గుర్తింపు తీసుకురావడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది? అనేది మిగతా కథ.
సుస్మితా సేన్ నటన ఇలాంటి క్యారెక్టర్ ను అంగీకరించడమే సాహసం అనుకుంటే ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు. అనేది. ఆమె ట్రాన్స్జెండర్ పాత్రలో జీవించింది. గణేశ్ పాత్రలో కృతిక డియో, తండ్రి పాత్రలో నందు యాదవ్, మిగతా నటీనటులు కూడ బాగా నటించారు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విజువల్స్, రవి జాదవ్ టేకింగ్ బాగుంది.
2001లో రిలీజ్ ‘గదర్’ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు. పాకిస్తాన్లోని పొలిటికల్ ముస్లిం ఫ్యామిలీకి చెందిన సకీనా (అమీషా పటేల్) తో అమ్మాయితో సిక్కు అయిన తారా సింగ్ (సన్నీ డియోల్) ల ప్రేమకథ చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. ఈ మూవీకి 22 ఏళ్ల తరువాత సీక్వెల్ గా వచ్చిన ‘గదర్ 2’ కు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కూడా సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు.
గదర్ 2 కథ విషయానికి వస్తే, ఇది తండ్రికొడుకుల చుట్టూ సాగే కథ. తారా సింగ్ (సన్నీ డియోల్), సకీనా (అమీషా పటేల్) సంతోషంగా జీవిస్తుంటారు. వీరి కుమారుడు చరణ్జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ) పెద్దవాడవుతాడు. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం అవుతుంది. పాకిస్తానీ ఆర్మీతో పోరాడుతుండగా, సరిహద్దుల్లో చిక్కుకున్న ఆర్మీ యూనిట్కు సాయం చేయాల్సిందిగా ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర రావత్ (గౌరవ్ చోప్రా) తారా సింగ్ ను అడుగుతాడు.
అందుకు అంగీకరించిన తారా సింగ్ ఇండియన్ఆర్మీ యూనిట్కు శ్యామ్ చేయడమే కాకుండా పాకిస్థాన్ సైనికులతో పోరాటం చేస్తాడు. ఈక్రమంలో పాకిస్తాన్ ఆర్మీ తారాసింగ్ తో పాటుగా కొంతమంది ఇండియన్ సోల్జర్స్, ట్రక్ డ్రైవర్లను కూడా పట్టుకుని పాక్ జైలులో బంధిస్తారు. దీంతో సకీనా, చరణ్జీత్ సింగ్ చాలా బాధపడుతారు. తల్లి బాధను చూసి భరించలేని చరణ్జీత్ తండ్రిని భారత్ కు తీసుకురావడానికి సిద్ధపడతాడు. అతను ఎలా పాకిస్థాన్ వెళ్ళాడు? ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తండ్రిని కాపాడాడా? అనేది మిగలిన కథ.
హీరో సన్నీ డియోల్ తారా సింగ్ గా అద్భుతంగా నటించాడు. అమీషా పటేల్ పాత్ర నిడివి తక్కువగా ఉంది. ఉత్కర్ష్ శర్మ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సిమ్రత్ కౌర్ అందంగా కనిపించింది. ముస్తాక్ ఖాన్, ఎహసాన్ ఖాన్, ముస్తాక్ కాక్ పాత్రల పరిధి మేరకు నటించారు.