బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఇప్పటివరకు 6 సీజన్ సక్సెస్ ఫుల్గా పూర్తిచేసుకుని ఏడవ సీజన్లోకి అడుగుపెడుతున్న షో బిగ్ బాస్. ఇప్పటికే ఈ ప్రోగ్రాం గురించి సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా జరుగుతుంది.
పైగా ఈసారి కొత్తగా అట్రాక్టింగ్ ఈవెంట్స్ ఉంటాయి అని డిక్లేర్ చేయడంతో షో పై మరింత ఆసక్తి నెలకొంది. రాబోయే ఈ సీజన్కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు.

తాజాగా షోకి సంబంధించి విడుదలైన ప్రోమో బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు కంటెస్టెంట్స్ ఎవరు అన్న విషయం పై మేకర్ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎప్పటిలా ఈ సీజన్లో కూడా ఓ సెలబ్రిటీ కపుల్ పాల్గొనబోతున్నారు అని తెలుస్తోంది. అయితే మొదట ఈ సెలబ్రిటీ కపుల్ అమర్ తేజ జంట అని వార్తలు వచ్చాయి ,కాగా ఇప్పుడు ఆ ప్లేస్ లో ఆట సందీప్ మరియు జ్యోతి దంపతులు వెళ్తున్నారు అని మరో పుకారు స్టార్ట్ అయింది.

తమ డాన్స్ వీడియోస్ తో సోషల్ మీడియాలో ఎందరినో ఆకట్టుకున్న ఈ కపుల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ కార్యక్రమంలో కూడా ప్రస్తుతం పాల్గొంటున్నారు. మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ సెలబ్రిటీ కపుల్ నిజంగానే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో పాల్గొంటే మిగిలిన వారికి గట్టి పోటీని ఇస్తారు. ఇక ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే లిస్ట్ అనౌన్స్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
ALSO READ : “సామజవరగమన” హీరోయిన్ మిస్ చేసుకున్న ఈ కొత్త తెలుగు సినిమా ఎదో తెలుసా..?






‘ఓపెన్ హైమర్’ మూవీకి విడుదలకి ముందు ఇండియాలో వచ్చిన హైప్ మామూలుగా లేదు. ఈ మూవీ రిలీజ్ రోజు ప్రాంతీయ భాషల్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా, భారతీయ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘ఓపెన్ హైమర్’ కే నంబర్ వన్ గా నిలిచింది. ఆ మూవీకి కొన్ని రోజుల ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఓపెనింగ్స్ విషయంలోనూ ‘ఓపెన్ హైమర్’ నంబర్ వన్ మూవీగా నిలిచింది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో నెటిజెన్లు హీరో మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన సినిమా ‘రాకెట్రీ’ ని పోలుస్తున్నారు. ఈ మూవీ ప్రముఖ భారతీయ ఎయిరోస్సేస్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ నంబీ నారాయణ్ లైఫ్ ఆధారంగా తెరకెక్కింది. ఇస్రో పరిశోధనలకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ ను వేరే దేశానికి లీక్ చేశాడనే కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. కానీ సీబీఐ దర్యాప్తులోను, సుప్రీంకోర్టు విచారణలోను తనకు తాను నిర్దోషిగా నంబి నారాయణ్ నిరూపించుకొన్నారు.
ఈ మూవీ గత ఏడాది మే 19న రిలీజ్ అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్షియయల్ గా హిట్ అందుకోలేదు. ‘ఓపెన్హీమర్’ మూవీని చూడటానికి థియేటర్లకు వచ్చిన యువతలో 30% మంది అయినా భారతీయ గొప్ప సైంటిస్ట్ హృదయ విదారక కథతో తెరకెక్కిన ‘రాకెట్రీ’ ని థియేటర్లలో చూసి ఉండాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ తరువాత ఏ చిత్రాన్ని పూర్తి చేయలేదు. ఈ మూవీ పూర్తి కాకముందే త్రివిక్రమ్ తో మూవీని అనౌన్స్ చేశాడు. కానీ ఈ మూవీ చాలా అడ్డంకుల మధ్య జనవరిలో ప్రారంభం అయ్యింది. అయితే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న తరువాత వాయిదా పడింది. మళ్ళీ ఇటీవలే చిత్రీకరణ మొదలు పెట్టి ఒక నెల షూటింగ్ జరగగానే మళ్ళీ విరామం తీసుకున్నారు.
‘గుంటూరు కారం’ మూవీని త్రివిక్రమ్ మాస్ మసాలా స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక మూవీ గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ గా మారుతోంది. తాజాగా ఈ మూవీ స్టోరీ లీక్ అయినట్టు ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. వైరల్ అయిన న్యూస్ ప్రకారం ఈ ఇద్దరు హీరోయిన్లు ఈ చిత్రంలో అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారని, అయితే ఇద్దరి తండ్రి ఒక్కరే, కానీ తల్లులు వేరని తెలుస్తోంది.
దాంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంటుందని, వీరిద్దరి మధ్య మహేష్ బాబు క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో స్టోరీ సాగుతుందని, త్రివిక్రమ్ ఫ్యామిలీ సెంటిమెంట్ ను సైతం బలంగా చూపిస్తారని తెలుస్తోంది.

వినీత్ శ్రీనివాసన్ హీరోగా తెరకెక్కిన ‘ముకుందన్ ఉన్ని అసోసియేట్స్’ మలయాళంలో భారీ విజయాన్ని సాధించింది. క్రైమ్ కామెడీ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ముకుందన్ ఉన్ని (వినీత్ శ్రీనివాసన్) లాయర్. కేసుల కోసం అతను చేసే ఏ ప్రయత్నాలు కూడా ఫలించవు. మరోవైపు లాయర్ వేణు (సూరజ్) యాక్సిడెంట్ అయిన వ్యక్తులకు నకిలీ పత్రాలతో ఇన్సురెన్స్ క్లెయిమ్ చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తుంటాడు. ముకుందన్ కూడా వేణులానే మనీ సంపాదించేందుకు ప్రయత్నిస్తాడు.
వేణు యాక్సిడెంట్ కేసులను క్లెయిమ్ చేసే మెర్క్యూరీ హాస్సిటల్ నే ముకుందన్ కూడా ఎంచుకుంటాడు. వేణుతో పోటీని తట్టుకోవడం కష్టం కావడంతో ఒక ప్లాన్ వేసి వేణుని ముకుందన్ చంపేస్తాడు? వేణు చనిపోయిన తర్వాత ఏమైంది? లాయర్గా డబ్బు, పేరు సంపాదించడం కోసం చెడు దారిని ఎంచుకున్న ముకుందన్కు ఆ తరువాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? జీవితంలో సక్సెస్ కావాలనే ముకుందన్ కల నెరవేరిందా? తాను ప్రేమించిన మీనాక్షిని( ఆర్ష చాందిని) ముకుందన్ వివాహం చేసుకున్నాడా? అనేది మిగిలిన కథ.
ఈ మూవీలో హీరో మరియు విలన్ రెండు వినీత్ శ్రీనివాసన్. ముకుందన్ ఉన్ని క్యారెక్టర్ లో వినీత్ జీవించాడు. అర్ష చాందిని మీనాక్షిగా పాత్రకు తగినట్టుగా చేసింది. హీరోతో పాటు మూవీలోని ప్రతి పాత్ర నెగెటివ్ షేడ్స్ లోనే ఉంటుంది. ఎదుటివారి వీక్ పాయింట్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కొందరు లైఫ్ లో ఎలా పైకి వస్తారనేది ఈ మూవీలో ఆలోచనాత్మకంగా చూపించారు.



