డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ఆదిపురుష్ ఊహించని విధంగా భారీ నిరాశ మిగిల్చింది. రామాయణాన్ని వక్రంచి తీశారని.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆంజనేయ స్వామి చేత మాస్ డైలాగ్స్ చెప్పించారని ఈ మూవీ గురించి బాగా నెగటివ్ టాక్ వచ్చింది.
అసలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయమని అభిమానులు డిమాండ్ చేశారు అంటే ఈ మూవీ ఏ రేంజ్ లో ప్రజలను నిరాశపరిచిందో అర్ధం అవుతుంది. గ్రాఫిక్స్ కూడా బొమ్మల గ్రాఫిక్స్ చేసినట్టుగా.. రామాయణం కథ మొత్తం మార్చి తీసిన ఈ మూవీ లో ప్రభాస్ రాముడు పాత్రలో నటించారు.

అయితే ఈ సినిమా చూసిన చాలామంది ప్రభాస్ కి రామాయణం అంటే ఏంటో తెలియదా? ఇప్పటివరకు అతను రాముడి నేపథ్యంలో ఒక్క చిత్రాన్ని కూడా చూడలేదా? ఆ డైరెక్టర్ సినిమా అలా తీస్తుంటే ప్రభాస్ ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నించారు. అయితే చాలామందికి తెలియని విషయం షూటింగ్ జరిగే సమయంలో ప్రభాస్ ఈ మూవీ ఔట్పుట్ పై తనకు వచ్చిన ఎన్నో డౌట్స్ డైరెక్టర్ తో షేర్ చేసుకున్నారట. రావణాసురుడు గెటప్ దగ్గర నుంచి చాలా విషయాల్లో ప్రభాస్ తన అనుమానాన్ని వ్యక్తం చేశారట.

ఇలా తీస్తే దీన్ని రామాయణం అనరు.. మీరు ఒకసారి పాత ఎన్టీఆర్ రాముడు గా నటించిన చిత్రాలను చూడండి ,మీకు కనీసం రెఫరెన్స్ గా ఉంటుంది.. అని సలహా కూడా ఇచ్చాడట. కానీ ఓం రౌత్ మాత్రం నువ్వు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకు డార్లింగ్.. అన్ని నేను చూసుకుంటాను అని మూవీ ని అలా తీశాడు. విడుదలైన టీజర్ కు నెగటివ్ రివ్యూస్ వచ్చాక ప్రభాస్ ఇచ్చిన సలహా మేరకు కాస్త గ్రాఫిక్స్ ని మార్చి 3Dలో కూడా విడుదల చేశారు. అలా కాకుండా కేవలం ముందు అనుకున్నట్టు ఒక్క 2Dలో మాత్రమే విడుదల చేసి ఉంటే సినిమాకు కనీసం ఈమాత్రం కూడా వసూళ్లు వచ్చేది కాదు.
ALSO READ : మొదటి రెమ్యూనరేషన్ తో “రామ్ చరణ్” ఏం చేశారో తెలుసా..?

ప్రస్తుతం ‘కల్కి 2898 ‘ అంటే అర్ధం ఏమిటనే చర్చ ప్రారంభం అయ్యింది. ఇక ఈ టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కథ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఈ మూవీ కథ ఎలా ఉండబోతుందనే విషయాన్ని నాగ్ అశ్విన్ తెలిపారు. తాను పురాణాలను మరియు సైన్స్ ఫిక్షన్ ను ఇష్టపడతానని, మహాభారతం మరియు స్టార్ వార్స్ ను చూస్తూ పెరిగానని అన్నారు. ఈ 2 ప్రపంచాలను కలిపి ఒక మూవీగా చేయడం అనేది గొప్పగా అనిపించిందని, ఆ విధంగా ‘కల్కి 2989 AD’ వచ్చిందని చెప్పారు.
కల్కి 2898 AD స్టోరీ యుగాంతం బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని సమాచారం. 2898లో అంటే ఫుచర్ లో రాబోయే యుగాంతం ఆధారంగా నాగ్ అశ్విన్ ఈ స్టోరీని రాసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మూవీని సైన్స్ ఫిక్షన్, టైమ్ మిషన్ నేపథ్యంలో నిర్మిస్తున్నారని తెలుస్తోంది.
ఈ స్టోరీ గురించి సోషల్ మీడియాలో నెటిజెన్లు సైతం తమ అభిప్రాయాలను చెప్తున్నారు. 18 వ శతాబ్దంలో కొంత, 28 వ శతాబ్దంలో కొంత స్టోరీ జరుగుతుందని, చివరి 20 నిముషాల్లో విలన్ కీలకపాత్ర వహిస్తాడని అంటున్నారు. మరొకరు గ్లింప్స్ ఆధారంగా అమితాబ్ దాచిన వస్తువును కోసం ఒక రోబో 18వ శతాబ్దానికి ప్రయాణిస్తుందని కామెంట్ చేశారు.

‘బేబీ’ మూవీ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ కల్ట్ లవ్ స్టోరీ కి యూత్ బాగా కనెక్ట్ అవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ హిట్ అవడంతో చాలా మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్యకు మంచిపేరు వచ్చింది. కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ స్నేహితులుగా నటించినవారికి కూడా మంచి గుర్తింపు లభించింది.
ఈ మూవీతో సాయి రాజేశ్ దర్శకుడిగా మరో మెట్టు ఎక్కారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తల్లి పాత్రలో నటించిన నటి కూడా చాలా బాగా చేశారనే పేరు వచ్చింది. ఆమె పేరు ప్రభావతి వర్మ. ఎన్నో సినిమాలలో నటించిన ఆమెకు ఈ మూవీతో గుర్తింపు లభించింది. మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీలో హీరోయిన్ తల్లిగా నటించింది.
ఇటీవల జరిగిన బేబీ సక్సెస్ మీట్ లో ప్రభావతి వర్మ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు అయినట్లు తెలిపారు. ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలు చేసినప్పటికీ ఈ మూవీలో నటించిన తల్లి పాత్ర చాలా స్పెషల్ అని అన్నారు. ఎందుకంటే ఈ మూవీ ద్వారా ఆనంద్ తనకు కొడుకుగా లభించాడని, అది ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ప్రభావతి వర్మ వెల్లడించారు.




తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమాతో రీమా సేన్ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టారు. 2000 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారారు. తెలుగులో నటిస్తూనే గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘మిన్నలే’ అనే మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తెలుగులో ‘చెలి’ పేరుతో రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ హిట్ అవడంతో కోలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసింది. హిందీలో కూడా పలు సినిమాలు చేసింది. వల్లభ, యుగానికి ఒక్కడు వంటి సినిమాలలో నెగెటివ్ పాత్రల్లో నటించి, విమర్శకుల ప్రశంసలతో పాటు, అవార్డ్స్ అందుకున్నారు. ఆమె 2012లో ఢిల్లీ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ను పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2013 లో ఈ రీమాసేన్ బాబుకు జన్మనిచ్చింది. అతని పేరు రుధ్రవీర్.
రీమాసేన్ సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ, ఆమె ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో తరచుగా అభిమనులతో పంచుకుంటుంది. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అదేవిధంగా, రీమాసేన్ తన భర్త, కుమారుడు మరియు స్నేహితులతో గడిపిన స్నాప్షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.













