విక్టరీ వెంకటేష్.. తెలుగు ఇండస్ట్రీలో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తనదైన శైలిలో నటిస్తూ ఆల్ రౌండర్ నటుడిగా మంచి పేరు సంపాదించారు. ఆయన మొదటి సినిమా అయినా కలియుగ పాండవులు నుంచి కొన్ని నెలల కింద వచ్చిన ఎఫ్ 2 పాత్రలో నటించడం కాదు జీవించారు. వెంకటేష్ జీవితం లో ఉన్నటువంటి ట్రాక్ రికార్డు వేరు.
ఈ తరం హీరోల్లో ఎక్కువ సక్సెస్ లు ఉన్న హీరో వెంకటేష్. కానీ ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం చంటి. అప్పటివరకు ఆవేశపూరిత పాత్రలు చేసిన వెంకటేష్ చంటి సినిమా తర్వాత కుటుంబ తరహా పాత్రలు కూడా అవలీలగా చేయగలరనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేసింది.

వెంకటేష్ నటించిన ప్రతి సినిమా మ్యూజికల్ గా మాత్రం చాలా హిట్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ కు జంటగా మీనా నటించారు. వీరిద్దరి కాంబినేషన్ చూస్తే ఒకరి కోసం ఒకరు పుట్టారా అనే విధంగా కనిపించారు చంటి సినిమాలో.. అమాయకుడు పాత్రలో చంటి చేసిన యాక్టింగ్ ను ఇప్పుడు చూసిన కానీ విజిల్ వేస్తారు. మరి ఆ సినిమా వెనుక చాలా చరిత్ర ఉంది. ఆ రోజుల్లో ప్రభూ కుష్బూ నటించిన చిన్న తంబి ప్రివ్యూ కావాలని మూవీ మొఘల్ రామానాయుడుకు ఆహ్వానం వచ్చింది. వెంటనే రామానాయుడు బొబ్బిలిరాజా నిర్మాత అయిన వెంకట్రామిరెడ్డి నీ తీసుకొని ప్రివ్యూ

చూడడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టువంటి కె.ఎస్.రామారావు వీరితో కలిసి వెళ్లారు. ఇంటర్వెల్లో ఈ సినిమా వెంకటేష్ కి పనికి వస్తుందేమో అనుకున్న కానీ చాలా కష్టం అనిపించింది అని రామానాయుడు కేఎస్ రామారావు గారితో చెప్పారట. దానికి కారణం అప్పటి వరకు వెంకటేష్ పూర్తి యాక్షన్ సినిమాలు చేశారు. వెంటనే ఈ సినిమా కోసం కె.ఎస్.రామారావు రవిరాజా పినిశెట్టి కి ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఎందుకంటే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా ఒక సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఇదే చిన్న మార్పులు చేస్తే చాలా

బాగుంటుంది అని చెప్పారు ఆయన. చిన్న తంబీ డైరెక్టర్ ను కలిసి రీమేక్ హక్కులను తీసుకున్నారు. అందరూ ఈ సినిమా రాజేంద్రప్రసాద్ చేస్తారని అనుకున్నారు. కానీ వెంకటేష్ ఇది నేను చేస్తాను అని కేఎస్ రామారావు గారిని పిలిపించాడంట. హీరోయిన్ గా చాలా మంది కొత్త అమ్మాయిలు అనుకొని చివరికి మీనాని సెలెక్ట్ చేశారు. ఈ సమయంలో సినిమా ప్రారంభించడానికి మొదటి క్లాప్ చిరంజీవి కొట్టారట. ఈ సినిమాలో మీనా బెడ్ రూమ్ లో ఒక మంచం కనిపిస్తుంది. దాని వెనుక ఒక పెద్ద కథ

ఉంది. శ్యామ్ చిత్రం కోసం ఒరిజినల్ టేక్ కలపతో ఆ మంచాన్ని తయారు చేయించారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాలలో ఆ మంచాన్ని ఉపయోగించారు. ఆ మంచం ఏ సినిమాలో వాడితే ఆ సినిమా హిట్ అయింది. దీంతో ఆ మంచం వాడిన సినిమాలన్నీ హిట్ అవుతాయని సెంటిమెంట్ కూడా నడిచింది. 66 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోటి రూపాయలు ఖర్చు అయింది. 1992 జనవరి 10వ తేదీన ఈ మూవీ విడుదలయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది



ప్రభాస్ హీరోగా నటిస్తోన్న తాజా పాన్ ఇండియా సినిమా ‘సలార్’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో విలన్స్ గా మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. తాజాగా సలార్ టీజర్ రిలీజ్ అయ్యి, యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను సృష్టించింది. సలార్ టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 83 మిలియన్ల వ్యూస్, 1.67 లైక్స్ వచ్చాయి.
ఈ టీజర్ లో ఉన్న క్లూస్ ను బట్టి ఈ మూవీకి కేజీఎఫ్ 2 మూవీకి కనెక్షన్ ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఈ మూవీలో రాఖీ భాయ్ పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. కేజీఎఫ్ 2 మూవీ క్లైమాక్స్ లో రాఖీ భాయ్ ఉన్న నౌక సముద్రంలో మునిగిపోతుందని తెలిసిందే. అయితే ఆ సీన్ తరువాత సలార్, రాఖీ భాయ్ ని కలిస్తే వారిద్దరు కలిస్తే ఇలా ఉంటుందంటూ దువ్వాడ జగన్నాధం మూవీలోని ఒక సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
హైపర్ ఆది మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీషోలో ఎంట్రీ ఇవ్వడంతో ప్రోమోలో తనదైన పంచులతో నవ్వించాడు. హైపర్ ఆది ఈ ఎపిసోడ్ లో పెళ్లి చూపుల థీమ్ తీసుకున్నాడు. పెళ్లి చూపులకి ఆర్టిస్టులంతా కలిసి తన కుటుంబంలా వచ్చారని అనడంతో మొదలైన ప్రోమో ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. ‘ఊ అంటావా మావ’ సింగర్ ఇంద్రావతి చౌహన్ పాడిన ఫోక్ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది.
ఆది రెయిన్ డ్యాన్స్ చేశాడు. జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావుతో కలిసి ‘వాన వల్లప్ప వల్లప్ప’ పాటకి స్టెప్పులు వేశాడు. అయితే ప్రోమో చివర్లో ఆది సౌమ్య రావు కోసం ఒక గిఫ్ట్ తెచ్చానని చెప్పి, గిఫ్ట్ ఇస్తాడు. సౌమ్య గిఫ్ట్ కవర్ తెరచిన వెంటనే చాలా ఎమోషనల్ అయింది. సౌమ్య రావ్ తన తల్లితో ఉన్న ఫోటోను ఆది ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. అప్పుడు ఆమె తల్లి ఫోటోలను ప్లే చేయడంతో వాటిని చూసిన సౌమ్య తన తల్లి గురించి చెప్తు బోరున ఏడ్చేసింది.
అమ్మకి విపరీతమైన తలనొప్పి వచ్చిందని, హాస్పిటల్కి తీసుకెళ్లడంతో డాక్టర్లు బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. అమ్మ తనెవరో తెలియనంతగా గతాన్ని మర్చిపోయిందని చెప్పింది. మూడున్నర ఏళ్లు అమ్మని బెడ్ మీదనే చూసుకున్నానని, దేవుడు అమ్మకి అలాంటి స్థితి ఇస్తాడని అనుకోలేదని, తన తల్లి మళ్లీ తన కడుపున జన్మించాలని అంటూ సౌమ్య కన్నీరు పెట్టుకోవడంతో ఇంద్రజ ఆమెను ఓదార్చారు.

రివ్యూ:
భీమ్ రావు క్యారెక్టర్ లో జగపతిబాబును తప్ప ఇంకెవ్వరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించారు. భీమ్ రావు క్యారెక్టర్ కి ప్రాణం పోశారు. మల్లేష్ గా ఆశిష్ గాంధీ మెప్పించారు. జ్వాలాబాయ్ పాత్రలో మమతా మోహన్దాస్ యాక్టింగ్ బాగుంది. ఆమె నటించిన సన్నివేశాలలో మమతా మోహన్దాస్ డామినేషనే కనిపిస్తుంది.
భీమ్ రావు పెద్ద భార్య మీరాబాయ్ క్యారెక్టర్ లో విమలా రామన్ ఆకట్టుకుంటుంది. టైటిల్ పాత్రలో నటించిన గనవి లక్ష్మణ్ ఈ మూవీకి పెద్ద అసెట్ గా నిలిచింది. కనిపించేది కాసేపే అయినా ఇంపాక్ట్ ని చూపించింది. కరుణం పాత్రలో ఆర్ ఎస్ నందా నవ్వులు పూయించాడు. మిగిలినవారు తమ పాత్రలు మేరకు నటించారు.
టెక్నికల్ విషయానికి వస్తే నాఫల్ రాజా అందించిన పాటలు అంతగా రిజిస్టర్ కావు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫి ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాణ విలువలు కథకి తగినట్టుగా ఉన్నాయి.




మెగాస్టార్ చిరంజీవి సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఇంద్ర’. ఈ మూవీని అశ్వినీదత్ ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై నిర్మించారు. చిరంజీవి నటించిన మృగరాజు, డాడీ, శ్రీమంజునాథ లాంటి సినిమాలు ప్లాప్ అవడంతో ‘ఇంద్ర’ మూవీ పై అంతగా అంచనాలు ఏర్పడలేదు.
ఈ మూవీ 2002 జూలై 24న రిలీజ్ అయ్యింది. మొదటి షోతొనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు సృష్టించింది. 122 సెంటర్స్ లో 100 రోజులు, 32 సెంటర్స్ లో 175 రోజులు రన్ అయ్యి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రంలో ఒక సీన్ లో చిరంజీవి తన మేనకోడలు సీమంతానికి పిలవడం కోసం ఆర్తి అగర్వాల్ ఇంటికి వచ్చినపుడు ఆర్తి అగర్వాల్ కొన్ని డైలాగ్స్ చెబుతుంది.
అయితే డబ్బింగ్ చెప్పక ముందు ఆ సీన్ లో ఆర్తి అగర్వాల్ ఎలా డైలాగ్స్ చెప్పిందో తెలిపే ఒక వీడియోని ఎంటర్టైన్మెంట్ మాషప్ అనే ఇన్ స్టా పేజ్ లో షేర్ చేశారు. ఆ సీన్ లో ఆర్తి అగర్వాల్ తనకు తెలుగు డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోతుంది. ‘నవ్వు ఆపుకుని డైలాగ్స్ ఎలా చెప్పావ్ చిరు’ అని ఆ వీడియో కి క్యాప్షన్ ఇచ్చారు. దానిపై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


దేశవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్, ఆడియెన్స్ అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఆదిపురుష్ మూవీని రూపొందించారు. ఈ మూవీ దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ఈ మూవీలోని డైలాగ్స్ పై వినమర్శలు వచ్చాయి. ఆ తరువాత పాత్రల ఆహార్యం పైన ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి.
ఈ సినిమాకి మొదటి 3 రోజులు మంచి వసూళ్లు వచ్చాయి. సోమవారం నుండి పడిపోయాయి. ఈ మూవీ డైరెక్టర్ ఓం రౌత్, రచయిత పై హిందూ సంఘాలు కూడా విమర్శిస్తున్నారు. ప్రేక్షకుల నుండి ప్రముఖుల వరకు అందరు విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.
ఈ మూవీలోని లంక సెట్, సీన్స్ హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆదిపురుష్ వీడియో క్లిపింగ్ కు దెయ్యాల కోట అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ వాయిస్ ఓవర్ తో ఎడిట్ చేసి షేర్ చేశారు. ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.