స్టార్ సెలెబ్రెటీస్ భారీ రెమ్యునరేషన్ ని తీసుకుంటూ వుంటారు. పైగా వాళ్ళు వాడే బట్టలు, వాచ్లు అన్నీ కూడా బ్రాండెడ్ వాటిని కొనుగోలు చేస్తుంటారు. అలానే వాళ్ళు వుండే ఇల్లు కూడా ఎంతో కాస్ట్లీగా ఉంటుంది. మన తెలుగు స్టార్ హీరోలు హైదరాబాద్ లో భారీ బడ్జెట్ తో ఇళ్ళని కట్టుకుని ఇళ్లల్లో ఉంటున్నారు.
అయితే వాళ్ళు వుండే ఇంటి ఖరీదు ఎంతుంటుందో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు. స్టార్ హీరోలు అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఇళ్లల్లో ఉంటుంటారు. అలానే వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటి ఫోటోలని సోషల్ మీడియా లో షేర్ చేసుకుంటూ వుంటారు. ఇక వాళ్ళ యొక్క ఇళ్ళు ఖరీదు గురించి చూస్తే..
#1 అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త హౌస్ ని రెండేళ్ల క్రితమే కట్టించారు. అల్లు అర్జున్ దాదాపు 100 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నాడు. ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్ కట్టడానికి నాకు తడిసి మోపిడయిందని ‘అల వైకుంఠపురంలో’ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ అల్లు అర్జున్ ఇంటి గురించి చెప్పారు.

#2 ప్రభాస్
ప్రభాస్ కి హైదరాబాద్లో 60 కోట్ల రూపాయల విలువైన అతి విలాసవంతమైన బిల్డింగ్ ఒకటుంది.

#3 అక్కినేని నాగార్జున
అదే విధంగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీతో 40 కోట్ల రూపాయల విలువైన హౌస్ లో వుంటున్నారు.

#4 చిరంజీవి
చిరంజీవి అయితే 40 కోట్ల ఇంట్లో వుంటున్నారు.

#5 రామ్ చరణ్
రామ్ చరణ్ కూడా చిరంజీవి తోనే ఉంటున్నారు. అలాగే రామ్ చరణ్ కి మరొక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కూడా ఉంది.

#6 మోహన్ బాబు
మోహన్ బాబు నివసించే ఇల్లు కూడా 30 కోట్ల ఖరీదు ఉంటుంది.

#7 బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ నివసించే ఇల్లు ఖరీదు 15 కోట్లు ఉంటుంది.

#8 జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ నివసించే ఇల్లు దాదాపు 25 కోట్ల ఖరీదు అయినట్టు సమాచారం.

#9 మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో 28 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో నివసిస్తున్నారు.

#10 విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ఇల్లయితే దాదాపు 15 కోట్లని సమాచారం.

మన హీరోల ఇల్లు ఖరీదులు ఇవే. తెలుగు సినిమా అంటే మొదటిగా గుర్తొచ్చేది హైదరాబాద్ కాబట్టి ఈ హీరోలు అందరూ కూడా హైదరాబాద్ లోనే సొంత ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇక్కడ మాత్రమే కాకుండా చాలా చోట్ల వీరికి వివిధ ప్రదేశాల్లో ఇల్లు కూడా ఉన్నాయి.





జెమినీ మ్యూజిక్ ‘ఆదిత్య టీవీ’ గా మొదలు అయినప్పటి నుండి ఆ ఛానెల్ లో రాత్రి 10 గంటలకు వచ్చే ‘వెన్నెల’ షోకి జయతి సుమారు 10 ఏళ్ల పాటు యాంకరింగ్ చేసింది. కాలర్స్తో మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె మాటల కోసమే వెన్నెల ప్రోగ్రామ్ చూసేవారంటే ఆ రోజుల్లోనే ఆమెకు ఎంత క్రేజ్ ఉండేదో చెప్పనవసరం లేదు.
ఆ తరువాత తొలిసారి హీరోయిన్గా ‘లచ్చి’ అనే చిత్రంలో నటించింది. దీనికి నిర్మాత కూడా జయతినే. ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఆ తరువాత ఆమె మళ్ళీ కనిపించలేదు. చాలా గ్యాప్ తరువాత జయతి రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఆల్బమ్తో ఆడియెన్స్ ని పలకరించింది. ఈ పాటలో జయతి తన హావ భావాలతో, మూమెంట్స్లో ఆకట్టుకుంది.
జయతి విజన్స్ సమర్పణలో వచ్చిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. కాస్లర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్ ను శ్రావణ భార్గవి ఆలపించారు. ఈ పాటను ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో జయతి కనిపించారు. ఆమె ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఆమె ఇన్నేళ్లకు కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.













మెగాస్టార్ చిరంజీవి కెరిర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాలలో ‘పసివాడి ప్రాణం’ సినిమా ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతి, హీరోయిన్ గా నటించారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. కె.చక్రవర్తి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఈ మూవీ 1987లో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది.
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా నేరుగా అభిమాన హీరోలతో మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ అప్పట్లో అభిమానులు హీరోలకు లెటర్స్ రాసేవారు. ఇక హీరోలు కూడా తమ అభిమానులకు తన సినిమాల గురించి లెటర్స్ రాసేవారు. దానికి నిదర్శనమే మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం ముందు అభిమానులకు రాసిన లెటర్. చిరంజీవి ఆ లెటర్ లో తన సినిమాల గురించి తెలిపారు.
“ప్రియమైన అభిమానులకు గీతా ఆర్ట్స్ నిర్మించిన “పసివాడి ప్రాణం” ఈ నెల 23 న రిలీజ్ కాబోతుంది. డినిలో ఓ కొత్త తరహా క్యారెక్టర్ నటించాను. ఈ సినిమా పై మీ అభిప్రాయం తెలుపండి. రోజా మూవీస్ వారి చిత్రం 18-7-87న ప్రారంభమైనది. తదుపరి రిలీజ్ కాబోయే చిత్రం “స్వయంకృషి” రీరికార్డింగ్ జరుపుకుంటుంది.
ప్రస్తుతం అంజనా ప్రొడక్షన్స్, దేవి ఫిలిమ్స్ షూటింగ్స్ జరుగుతున్నవి. నా బర్త్ డే విషయం ఇంకా నిర్ణయించు కోలేదు. నిర్ణయించుకున్న తరువాత మీకు ఏ విషయం లెటర్స్ ద్వారా ముందుగా తెలుపబడుతుంది. ఈ లెటర్ తో పాటు అరవింద్ గారి “పసివాడి ప్రాణం” కలర్ స్టిల్ పంపుతున్నాను. ఉంటాను.. సదా మీ అభిమానాన్ని ఆశించే మీ చిరంజీవి” అని రాశారు.
2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఆర్బీఐ ప్రజలు తమ దగ్గరున్న 2000 నోట్లను సెప్టెంబర్ 30 లోపు బ్యాంకులలో జమ చేయడం, లేదా మార్చుకోవడం చేయాలని సూచించింది. కానీ రోజుకు ఇరవై వేల వరకు మాత్రమే మార్చుకోవచ్చు. జమ చేయడం అయితే ఎంత అయిన చేసుకోవచ్చు. ‘క్లీన్ నోట్ పాలసీ’ లో భాగంగానే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే డిసిషన్ తీసుకన్నామన్న ఆర్బీఐ తెలిపింది. ఇక ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఇదే విషయం పై సోషల్ మీడియాలో మరో విధంగా జరుగుతుంది. దేశంలో నోట్ల రద్దుకు బిచ్చగాడు, బిచ్చగాడు 2 చిత్రాలకు ముడిపెడుతు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ సంచలన విజయం సాధించిన విషయమ తెలిసిందే. ఈ మూవీ కోలీవుడ్ లో 2016 మార్చి 4న రిలీజ్ అయ్యింది. తెలుగులో అదే ఏడాది మే 13న విడుదల అయ్యింది. ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయిన దాదాపు 5 నెలలకు పీఎం మోదీ ఇండియా లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
నిన్న ‘బిచ్చగాడు 2’ మూవీ రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన రోజే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. ఆశ్చర్యంగా ఉన్నా ఈ విషయం పై సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బిచ్చగాడు మూవీకి, నోట్ల రద్దు లేదా ఉపసంహరణకు సంబంధం లేకపోయినా కాకతాళీయంగా జరగడంతో నెట్టింట్లో కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజెన్ హీరో విజయ్ ఆంటోనీని బిచ్చగాడు చిత్రాలు తీయొద్దని చెప్పాలి అంటూ కామెంట్ చేశారు. మరొకరు ‘బిచ్చగాడు 3’ తీయకుండా చూసుకోండయ్యా అని కామెంట్ చేశారు.

