ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సూపర్ హిట్ సంగీతం అందిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దేవిశ్రీప్రసాద్. మ్యూజిక్ డైరెక్టర్ అందరిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
1999లో దేవీ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా సినీ ప్రస్థానం మొదలు పెట్టాడు. ఖడ్గం, శంకర్ దాదా ఎంబిబిఎస్, జులాయి, సరిలేరు నీకెవ్వరు, పుష్ప వంటి చిత్రాలకు సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ అందించారు దేవిశ్రీ ప్రసాద్.

దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసే ప్రతి పాట ఏ రేంజ్ లో హిట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు దేవిశ్రీ హవా కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ పెద్ద హీరో సినిమా ఛాన్స్ లు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెంతకు చేరుతున్నాయి.అద్భుతమైన సంగీతం తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు థమన్. దర్శకనిర్మాతలు కూడా ప్రేక్షకులకు కావాల్సింది థమన్ మ్యూజిక్ అని నిర్ణయించుకుంటున్నారు. ఈ విధంగా థమన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగి దేవిశ్రీప్రసాద్ ఓవర్టేక్ చేస్తూ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళిపోయాడు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేసి మరోసారి హిట్ అందుకున్నాడు దేవిశ్రీప్రసాద్. పుష్ప హిట్ తో దేవిశ్రీ మళ్లీ లైన్ లోకి వచ్చేసాడు అని అందరూ అనుకున్నారు. క్రేజ్ తగ్గిపోతుందనే ఫ్రస్టేషన్ లో ట్యూన్స్ కాపీ చేస్తున్నాడు అంటూ నెటజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే ఉప్పెన సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన జల జల జల పాతం పాట ఎంత సక్సెస్ అయింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పుడు అదే ట్యూన్ ని అచ్చుగుదినట్లు గా దింపేసాడు దేవిశ్రీప్రసాద్. ఇంతకీ ఆ చిత్రం ఏమిటి అనుకుంటున్నారా.. మన ఎనర్జిటిక్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది వారియర్ సినిమాలోని దడ దడ అనే లిరిక్స్ అచ్చు జల జల జల పాతం ట్యూన్ మాదిరిగానే క్రియేట్ చేశాడు. ఈ లిరిక్స్ తో ఇంత క్రియేటివిటీ లేనట్లు తయారయ్యావు ఏంటి దేవిశ్రీ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటజన్లు.

























అయితే అమల నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి మాత్రం దూరం అయింది. తర్వాత ఆమె జంతువులపై ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల బ్లూ క్రాఫ్ట్ అనే జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూగజీవాలపై తమ వంతు ప్రేమ చూపిస్తోంది. 1986లో సినీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అమల టీ.రాజేందర్ డైరెక్షన్ లో మీథిలి ఎన్నై కాథలి అనే మూవీలో తొలిసారిగా నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ఓవర్ నైట్ లోనే అశేషమైన పేరు సంపాదించుకొని వరుసగా 50 పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది అమల. అయితే అమల నాగార్జునతో శివ, నిర్ణయం లాంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ నాగార్జునకు అప్పటికే వెంకటేష్ సోదరి దగ్గుబాటి లక్ష్మీతో వివాహం జరిగింది. ఆయన ఎప్పుడైతే అమలపై మనసు పారేసుకున్నారో ఆ క్షణమే లక్ష్మి కి విడాకులు ఇచ్చేసారు.
ఈ విధంగా వారి వివాహం జరిగిన తర్వాత అమల పూర్తిగా హైదరాబాదుకు మకాం మార్చింది. అమల తల్లిదండ్రుల విషయానికి వస్తే తండ్రి బెంగాలీ నేవీ అధికారి ముఖర్జీ.. తల్లి ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ.. వీరిద్దరి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన నేవీ అధికారి గా చేస్తున్న సమయంలోనే డిప్యూటేషన్ మీద ఖరగ్పూర్ ఐఐటీ లో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించారు. అమల తల్లి కూడా హాస్పిటల్లో జాబ్ చేసేది. నాగార్జునతో వివాహానంతరం అమల తల్లిదండ్రులు చాలాకాలం చెన్నై మరియు వైజాగ్ లాంటి ప్రదేశాల్లో జీవనాన్ని సాగించారు.







