దేశంలో ఎంతో మంది ప్రజలు ఉంటారు. ఒక రంగంలో కూడా ఎంతో మంది ప్రముఖులు ఉంటారు. కానీ కొంత మంది ఉంటారు. వారు తమ పని చేస్తున్న వృత్తికే అందం తీసుకొస్తారు. వారి వల్ల వారి వృత్తి అభివృద్ధి చెందేలాగా చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా వారు తమ గుర్తింపుని చాటి చెప్పుకుంటారు.
అలాంటి వారిని భారతదేశ ప్రభుత్వం అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంది. అలా ఎంతో గొప్ప వారికి ఇచ్చిన అవార్డుల్లో, పద్మ అవార్డులు ఒకటి. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పేరుతో అవార్డులు ఉంటాయి. ఇటీవల పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.

సినిమా రంగంలో చిరంజీవి చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. ఇంకా చాలా మంది సినీ, ఇతర రంగాలకి చెందిన ప్రముఖులకి ఈ పద్మ అవార్డులు ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుంది. అయితే ఈ అవార్డుల వల్ల ఏమైనా లాభాలు ఉంటాయా అనే ప్రశ్న చాలా మందికి నెలకొంది. కానీ నిజం ఏంటంటే, ఈ అవార్డులు కేవలం గౌరవం కోసం మాత్రమే ఇస్తారు. వీటికి ఎటువంటి డబ్బులు లభించవు. అలాగే ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రత్యేకమైన సదుపాయాలు కూడా ఉండవు. అంతే కాకుండా వారికి ఏమీ ప్రత్యేకమైన అధికారాలు కూడా ఉండవు.

ఇది కేవలం వారు వారి వృత్తిలో చేసిన కృషిని గుర్తించి, అందుకు తగిన ప్రతిఫలంగా ఇచ్చే అవార్డులు మాత్రమే. ఈ అవార్డులు వచ్చిన వారు పుస్తకాల మీద కానీ, లెటర్ హెడ్ ల మీద కానీ, లేదా మరి ఎక్కడైనా బ్యానర్ల మీద కానీ ఈ పేరుని వారి పేరుకి ముందు చేర్చి వాడకూడదు. ఇది కేవలం వారి గుర్తింపు కోసం ఇచ్చే అవార్డు మాత్రమే అని వారు దృష్టిలో పెట్టుకోవాలి. అంతే కాకుండా ఈ అవార్డుకి అలాంటిదే మరొక డూప్లికేట్ అవార్డు కూడా ఇస్తారట. ఇది ఆ అవార్డు అందుకున్న వాళ్లు ఏదైనా వేడుకల్లో కానీ, లేదా రాష్ట్రానికి సంబంధించిన ఫంక్షన్స్ లో కానీ ధరించవచ్చు. కానీ ఇతర లాభాలు మాత్రం కలుగవు.




నిఖిల్ విజయేంద్ర సింహ పేరు సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ఫాలో అయ్యేవారికి సుపరిచితం. యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించి, కాస్కో అనే సెలబ్రిటీ టాక్ షోతో అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ హిట్ కావడంతో నిఖిల్ పాపులారిటీ అనూహ్యంగా పెరిగింది. మెగాడాటర్ నిహారిక, మంచు లక్ష్మి, వితిక, హారిక వంటివారికి నిఖిల్ ఫ్రెండ్ కూడా. సినీ సెలెబ్రెటీ పార్టీల్లో నిఖిల్ కనిపిస్తూ ఉంటాడు. నిఖిల్ మూవీ ప్రమోషన్స్ మూవీ యూనిట్ ను ఇంటర్వ్యూలు ఇస్తారు. నిఖిల్ సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటారు.
నిఖిల్ విజయేంద్ర సింహ 1996లో సెప్టెంబర్ 18న విశాఖపట్నంలో జన్మించారు. అతని తండ్రి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండగా, తల్లి ఒక ఎన్జీవో కోసం పనిచేయడమే కాకుండా, ఖాజాగూడలో దిబ్బరోట్టి అనే రెస్టారెంట్ను కూడా నిర్వహిస్తోంది. నిఖిల్ 2018లో గీతం యూనివర్శిటీ నుండి బికాం (ఆనర్స్) పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చారు. తమ్మడ మీడియాలో పని చేయడం ప్రారంభించాడు. అలా ‘మహతల్లి’ ఛానెల్లో షార్ట్ ఫిల్మ్లలో కనిపిస్తూ యాక్టింగ్ లో ప్రవేశించాడు.
2019లో, నిఖిల్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ ‘కాస్కో’ని మొదలుపెట్టి, తక్కువ సమయంలోనే నాలుగు లక్షలమంది సబ్స్క్రైబర్లను సంపాదించాడు. అందులో కంటెంట్, ఛాలెంజ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, సెలబ్రిటీ హోమ్ టూర్లతో పాటు సెలబ్రిటీలతో ఎంగేజింగ్ వీడియోలతో చాలా పాపులర్ అయ్యారు. 2020లో, నిఖిల్ తన ఫ్రెండ్ భానుతో కలిసి సొంత ప్రొడక్షన్ హౌస్ ‘రాయుడు చిత్రాలు’ స్థాపించాడు. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్ వంటి ప్రముఖ నటీనటులు లీడ్ రోల్స్ లో వెబ్ సిరీస్ని నిర్మించారు. అంతేకాకుండా ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ యువరాజ్ సింహ నిఖిల్ కి సొంత అన్నయ్య అని సమాచారం.



అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమనికి సంబంధించిన ఫొటోలు, రాముడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్నవదనంతో చిరునవ్వును కలిగి, బాల రాముడి విగ్రహం ముగ్ద మనోహరంగా భక్తులకు దర్శనం ఇస్తోంది. రెండవ రోజు నుండి సాధారణ భక్తులకు అనుమతి ఇవ్వడంతో అయోధ్య రాముడిని చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు.
తాజాగా అయోధ్య రాముడి గురించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తమిళనాడులో హీరోహీరోయిన్ల పై వారి ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటి ఉండడం సాధారణ విషయమే. అయితే ఇప్పుడ ఆ అభిమానం పరిధులు దాటి వెళ్తోంది. తమిళ లెజెండరి యాక్టర్ కెప్టెన్ విజయ్ కాంత్, అయోధ్య బాల రాముడి విగ్రహానికి పోలికలు ఉన్నాయని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
రామ్ లల్లా సుందర ముఖారవిందం పై కోలీవుడ్ లో రచ్చ జరుగుతోంది. బాలక్ రామ్ విగ్రహం కళ్ళు మరియు నవ్వు తమ అభిమాన హీరో విజయ్ కాంత్ ను పోలి ఉన్నట్టు చెబుతున్నారు. కళ్లు అచ్చుగుద్దినట్టుగా తమ హీరో కళ్ళలా ఉన్నాయని, విజయ్ కాంత్ కళ్ళను, రాముడి కళ్ళను పోల్చుతూ కెప్టెన్ ఫ్యాన్స్ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.




