యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోంది ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూనే ఉన్నాయి తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఎన్టీఆర్ సినిమాలో గుప్పెడంత మనసు సీరియల్ నటి జగతి మేడం నటించబోతున్నారు అంటూ వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు. గుప్పెడంత మనసు బుల్లితెర సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు జ్యోతి రాయ్. ఈ సీరియల్లో హీరో రిషికి తల్లిగా జగతి మేడం పాత్రలో ఎంతో అద్భుతంగా నటించినటువంటి ఈమె ఈ పాత్ర ద్వారా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా జగతి కట్టు, బొట్టుకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో జగతి ఫోటోలను చూసిన నెటిజెన్లు మీమ్స్ చేస్తున్నారు.

అయితే సీరియల్ అంత ట్రెడిషనల్ గా ఉండే జ్యోతి సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో, వీడియోలతో హల్చల్ చేస్తోంది. ఆమె ఫోటోలు షేర్ చేసిన కాసేపటికే వైరల్ గా మారుతుంటాయి.జ్యోతి రాయ్ వయసు 38 ఏళ్లు. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు.

కన్నడ బుల్లితెరపై కూడా సుమారు 20కి పైగా సీరియల్స్ లో నటించినటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా అవకాశాలు రావడంతోనే గుప్పెడంత మనసు సీరియల్ నుంచి కూడా తప్పుకున్నారు ఇలా తెలుగు కన్నడ భాషలలో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి ఈమెను పాన్ ఇండియా సినిమాల్లో తీసుకోవాలన్న ఉద్దేశంలో ప్రశాంత్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి జగతి మేడం ఎన్టీఆర్ సినిమాలో నిజంగానే తీసుకోబోతున్నారా లేకుంటే ఇది ప్రపోజల్ వరకే ఆగిపోనుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరంగ చక్రవర్తి. ఆయన 1950లో జూన్ 16న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో బెంగాలీ దిగువ మధ్యతరగతి హిందూ ఫ్యామిలిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు బసంత కుమార్ చక్రవర్తి, శాంతి రాణి చక్రవర్తి దంపతులకు. అతను ఓరియంటల్ సెమినరీలో చదువుకున్నాడు మరియు తరువాత తన బీఎస్సి కోల్కతాలోని స్కాటిష్ చర్చి కళాశాల చేశాడు. ఆ తరువాత, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాడు.
బెంగాల్ లో నక్సలైట్ ఉద్యమం మొదలైన తరువాత ఇతర వేలాది బెంగాలీ యువకుల లాగానే, మిథున్ కూడా 1960ల చివరలో నక్సల్ పోరాటంలోకి వెళ్లారు. కోల్కతాలో నక్సలైట్ పోరాటం జరిగే టైమ్ లో చారు మజుందార్తో పనిచేశారు. అయితే నక్సలైట్ల పై పోలీసుల అణిచివేత వల్ల మిథున్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన నక్సలైట్ గా మరడంతో ఆయన ఫ్యామిలీ ఆందోళనకు గురైంది. అదే సమయంలో మిధున్ సోదరుడు యాక్సిడెంట్ లో మరణించడంతో తిరిగి ఇంటికి వచ్చిన మిథున్ మళ్ళీ అటు వైపు చూడలేదు.
ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ అవకాశాలు అంత తేలికగా రాలేదు. ఒక్క పూట భోజనం కూడా దొరికేది కాదు. కొరయోగ్రాఫర్ హెలెన్ దగ్గర చేరారు. స్టేజ్ పై డ్యాన్స్ చేసేవాడు. తన డ్యాన్స్ చూసి అయినా సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో అని. ఎన్ని రోజులు 1976లో మృగయా మూవీతో మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని సంచలనం సృష్టించారు. ఆ తరువాత పలు సినిమాలలో నటించినా, 1982లో వచ్చిన ‘డిస్కో డాన్సర్’ మూవీతో సూపర్స్టార్డమ్ అందుకున్నాడు.
దేశంలోనే తొలి వందకోట్ల మూవీగా సంచలనం సృష్టించింది. ఈ మూవీతో ఇండియాలోనే కాకుండా రష్యాలో కూడా పాపులారిటీ పొందారు. డ్యాన్స్ స్టార్గా పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు చేసి అగ్రహీరోగా మారారు. ఓ దశలో వరుసగా 33 సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టార్ డమ్ చెక్కచెదరలేదు. 1979లో నటి యోగీతా బాలిని వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు మిమోహ్, ఉష్మే చక్రవర్తి , నమషి చక్రవర్తి , దత్తపుత్రిక దిశాని చక్రవర్తి. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన మిథున్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు.
జైలర్ మూవీలో కు విలన్ గా, సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఈ మూవీలో నటనతో ఆకట్టుకున్న వ్యక్తి మలయాళ యాక్టర్ వినాయగన్. ఇతను నటుడు మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కూడా. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించే వినాయగన్ పలు తమిళ చిత్రాలలో కూడా నటించారు
వినాయకన్ తొలిసారిగా 1995లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళంలో వచ్చిన ‘మాంత్రికం’ మూవీలో నటించాడు. వినాయకన్ తర్వాత కలి, ఒరుతీ, ట్రాన్స్, మరియు పద వంటి సినిమలలో నటించారు. 2016లో, దర్శకుడు రాజీవ్ రవి తెరకెక్కించిన ‘కమ్మటిపాడమ్‘ లో గంగ పాత్రలో తన నటనకు గాను వినాయకన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
తమిళంలో వినాయకన్ నటించిన ఏడవ సినిమా జైలర్. ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో ఎంత క్రూరంగా ఉంటుందో రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కనిపిస్తుంది. వినాయకన్ తెలుగులో కూడా నటించాడు. అయితే అతను ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటించారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘అసాధ్యుడు’. అనే సినిమాలో విలన్ నటించాడు.




నిఖిల్ విజయేంద్ర సింహ పేరు సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ఫాలో అయ్యేవారికి సుపరిచితం. యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించి, కాస్కో అనే సెలబ్రిటీ టాక్ షోతో అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ హిట్ కావడంతో నిఖిల్ పాపులారిటీ అనూహ్యంగా పెరిగింది. మెగాడాటర్ నిహారిక, మంచు లక్ష్మి, వితిక, హారిక వంటివారికి నిఖిల్ ఫ్రెండ్ కూడా. సినీ సెలెబ్రెటీ పార్టీల్లో నిఖిల్ కనిపిస్తూ ఉంటాడు. నిఖిల్ మూవీ ప్రమోషన్స్ మూవీ యూనిట్ ను ఇంటర్వ్యూలు ఇస్తారు. నిఖిల్ సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటారు.
నిఖిల్ విజయేంద్ర సింహ 1996లో సెప్టెంబర్ 18న విశాఖపట్నంలో జన్మించారు. అతని తండ్రి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండగా, తల్లి ఒక ఎన్జీవో కోసం పనిచేయడమే కాకుండా, ఖాజాగూడలో దిబ్బరోట్టి అనే రెస్టారెంట్ను కూడా నిర్వహిస్తోంది. నిఖిల్ 2018లో గీతం యూనివర్శిటీ నుండి బికాం (ఆనర్స్) పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్కు వచ్చారు. తమ్మడ మీడియాలో పని చేయడం ప్రారంభించాడు. అలా ‘మహతల్లి’ ఛానెల్లో షార్ట్ ఫిల్మ్లలో కనిపిస్తూ యాక్టింగ్ లో ప్రవేశించాడు.
2019లో, నిఖిల్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ ‘కాస్కో’ని మొదలుపెట్టి, తక్కువ సమయంలోనే నాలుగు లక్షలమంది సబ్స్క్రైబర్లను సంపాదించాడు. అందులో కంటెంట్, ఛాలెంజ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, సెలబ్రిటీ హోమ్ టూర్లతో పాటు సెలబ్రిటీలతో ఎంగేజింగ్ వీడియోలతో చాలా పాపులర్ అయ్యారు. 2020లో, నిఖిల్ తన ఫ్రెండ్ భానుతో కలిసి సొంత ప్రొడక్షన్ హౌస్ ‘రాయుడు చిత్రాలు’ స్థాపించాడు. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్ వంటి ప్రముఖ నటీనటులు లీడ్ రోల్స్ లో వెబ్ సిరీస్ని నిర్మించారు. అంతేకాకుండా ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ యువరాజ్ సింహ నిఖిల్ కి సొంత అన్నయ్య అని సమాచారం.



అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమనికి సంబంధించిన ఫొటోలు, రాముడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్నవదనంతో చిరునవ్వును కలిగి, బాల రాముడి విగ్రహం ముగ్ద మనోహరంగా భక్తులకు దర్శనం ఇస్తోంది. రెండవ రోజు నుండి సాధారణ భక్తులకు అనుమతి ఇవ్వడంతో అయోధ్య రాముడిని చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు.
తాజాగా అయోధ్య రాముడి గురించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తమిళనాడులో హీరోహీరోయిన్ల పై వారి ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటి ఉండడం సాధారణ విషయమే. అయితే ఇప్పుడ ఆ అభిమానం పరిధులు దాటి వెళ్తోంది. తమిళ లెజెండరి యాక్టర్ కెప్టెన్ విజయ్ కాంత్, అయోధ్య బాల రాముడి విగ్రహానికి పోలికలు ఉన్నాయని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
రామ్ లల్లా సుందర ముఖారవిందం పై కోలీవుడ్ లో రచ్చ జరుగుతోంది. బాలక్ రామ్ విగ్రహం కళ్ళు మరియు నవ్వు తమ అభిమాన హీరో విజయ్ కాంత్ ను పోలి ఉన్నట్టు చెబుతున్నారు. కళ్లు అచ్చుగుద్దినట్టుగా తమ హీరో కళ్ళలా ఉన్నాయని, విజయ్ కాంత్ కళ్ళను, రాముడి కళ్ళను పోల్చుతూ కెప్టెన్ ఫ్యాన్స్ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.