సంక్రాంతి పండుగ కానుకగా చాలా సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమా కూడా ఒకటి. కథ విషయానికి వస్తే ఈ సినిమా 1963 లో మొదలవుతుంది. కిష్టయ్య (నాగార్జున), అంజి (అల్లరి నరేష్) స్నేహితులు. వీరిద్దరి చిన్నతనాన్ని ఈ సమయంలో చూపిస్తారు. ఆ తర్వాత సినిమా 1988 కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే భాస్కర్ (రాజ్ తరుణ్) వీరి జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. కిష్టయ్య వరలక్ష్మి అలియాస్ వరాలు (అషిక రంగనాథ్) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమ కథ ఎంత దూరం వెళ్ళింది? వీరి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులు ఏంటి? కిష్టయ్య ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ ముద్దుగుమ్మ పేరు కూడా ఒకటి. కళ్యాణ్ రామ్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదలైన నా సామిరంగ సినిమాలో నాగార్జునతో పాటు నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఏకంగా హీరో నాగార్జున నటనను డామినేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో ప్రస్తుతం హీరోలు దర్శకులు చూపు ఈ ముద్దుగుమ్మ మీద పడింది.

ఇది ఇలా ఉంటె…ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పది రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అంటే… నైజాంలో రూ. 4.78 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.37 కోట్లు, సీడెడ్లో రూ. 3.60 కోట్లు, , , వెస్ట్ గోదావరిలో రూ. 1.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.60 కోట్లు, కృష్ణాలో రూ. 1.22 కోట్లు గుంటూరులో రూ. 1.44 కోట్లు, నెల్లూరులో రూ. 85 లక్షలు..ఇలా మొత్తంగా రూ. 19.13 కోట్లు షేర్, రూ. 31.55 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా.









రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో నటించిన ‘ఆ నలుగురు’ సినిమా 2004 లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు. నటి ఆమని, కోటా శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్, హీరో రాజా లాంటి వారు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటన అపూర్వం. తన నటనతో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.
విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పటికీ ఈ మూవీ టీవిలో వస్తే చూసే ఆడియెన్స్ ఉన్నారు. అలాంటి సినిమాకి హీరోగా ముందుగా అనుకున్నది రాజేంద్రప్రసాద్ కాదు. సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. చంద్ర సిద్ధార్థ ఈ కథను సూపర్ స్టార్ కృష్ణ చెప్పడంతో ఆయనకు బాగా నచ్చి, నటించాలని అనుకున్నారంట. కానీ ఆయన వయసు రీత్యా ఎక్కువ నిడివి పాత్రలో నటించలేనని అన్నారంట.
అలా రాజేంద్రప్రసాద్ నటించారు. అలాగే సినిమాలో హీరోయిన్ కోసం గౌతమి, లక్ష్మి, సుహాసిని, భానుప్రియ, రోజా వంటి వారిని సంప్రదించారట. వారు రిజెక్ట్ చేయడంతో రాజేంద్ర ప్రసాద్ ఆమనిను సూచించడంతో ఆమెను తీసుకున్నారంట. ఈ మూవీ రాజేంద్ర ప్రసాద్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయింది.








ఇప్పటి వరకు ఆమె ఒక్క సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించలేదు. కానీ, ఆమె పాపులారిటీ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. పలు రకాల ప్రొడక్ట్స్ తమని ప్రమోట్ చేయాలంటూ సితారను అప్రోచ్ అవుతూ ఉంటారు. వాటి ప్రమోషన్స్ తో సితార గట్టిగానే సంపాదిస్తున్నారని చెప్పచ్చు. నెలకు ముప్పై లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.