సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సినిమా మొదలయినప్పటి నుండి పలు రకాలుగా వార్తల్లో నిలిచిన ఈ మూవీ, రిలీజ్ అయ్యాక నెట్టింట్లో విపరీతమైన నెగెటివిటీ, ట్రోల్స్ ను ఎదుర్కొంటోంది.
ఎక్కువ ట్రోల్స్, విమర్శలు వస్తున్నది మాత్రం ఈ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే. మూవీలో త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని, నాలుగు కామెడీ సీన్స్, ఫైట్లు రాసుకుని మూవీ తెరకెక్కించాడాని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా రవితేజ మూవీలోని సీన్ కాపీ చేసారంటూ ఓ సీన్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాని ఏ క్షణం మొదలు పెట్టారో కానీ, మొదటి నుండి ఆటంకాలు, ఆ తరువాత హీరోయిన్, సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడం, పలు రకాల ప్రచారాలు వచ్చాయి. ఓ దశలో ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు వచ్చాయి. ప్రకటించిన రిలీజ్ డేట్ కే విడుదల చేయాలని నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన పాటలు ట్రోలింగ్ బారిన పడ్డాయి.
ఆ సినిమా కాపీ అంటూ కొందరు, ఆ నవల కాపీ అంటూ మరికొందరు నెట్టింట్లో ఈ మూవీ పై విమర్శలు చేశారు. థియేటర్ల విషయంలోనూ వివాదాలు ఏర్పడ్డాయి. చివరికి విమర్శల మధ్యనే మూవీ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో నెగెటివిటీ మొదలైంది. బుక్ మై షో యాప్ లో మూవీ రిలీజ్ కాకముందే 70 వేల మంది నెగెటివ్ రివ్యూలు ఇచ్చినట్టు చిత్ర యూనిట్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదంతా మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. అయితే మహేష్ బాబు వల్లే కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు.
తాజాగా రవితేజ నటించిన దరువు మూవీలోని సీన్ ను త్రివిక్రమ్ కాపీ చేశారని, అదే సీన్ ను గుంటూరుకారంలో మహేష్ బాబుతో చేశారంటూ దరువు సీన్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నిజమే అంటుండగా, కొందరు అదేం కాదని అంటున్నారు.
https://www.instagram.com/reel/C2Es4FFrM21/?igsh=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: ఇలాంటి పాట టాలీవుడ్ లో రాదేమో..! దీని ప్రత్యేకత ఏంటంటే..?


సంగీత దర్శకులు తమ సినిమాలలో ఒకటి లేదా రెండు పాటలు పడడం అందరికీ తెలిసిందే. అయితే ఆర్పీ పట్నాయక్ మాత్రం సినిమాలోని అన్ని పాటలు ఆయనే పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్పీ లాగే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా చాలా సినిమాలలో మొత్తం పాటలు పాడారు. అయితే టాలీవుడ్ లో ఈ సినిమా కోసం తెలుగు టాప్ 10 సంగీత దర్శకులు కలిసి ఒక పాటను పాడారు. ఆ సినిమా పేరు అందమైన మనసులో.
సంగీత దర్శకుడిగా ఎన్నో సినిమాలకు పనిచేసిన తరువాత, ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వైపుకు వెళ్లారు. అలా 2008 లో మొదటి సారిగా ‘అందమైన మనసులో’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రాజీవ్, రమ్య నంబీషన్ జంటగా నటించారు. ఈ సినిమాలోని “అమ్మాయి నవ్వింది.. అబ్బాయికి నచ్చింది” అనే పాటను పది మంది ప్రముఖ సంగీత దర్శకులు ఆలపించారు.
ఈ పాటను ఆలపించిన వారిలో ఆస్కార్ గ్రహీత ఎం ఎం కిరవాణి, రాజ్, కోటి, ఎస్ ఏ రాజ్ కుమార్, ఆర్ పి పట్నాయక్, రమణ గోగుల, చక్రి, శ్రీ కొమ్మినేని, వందేమాతరం శ్రీనివాస్, దేవి శ్రీ ప్రసాద్ ఉన్నారు. పది మంది అగ్ర సంగీత దర్శకులు కలిసి పాడటం అనేది ప్రత్యేకమైనది. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి పాడటం అరుదైన విషయం అని చెప్పవచ్చు. మళ్ళీ ఇలాంటి పాట తెలుగులో రాదేమో. ఈ పాటకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

రియో రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రలలో నటించిన తమిళ సినిమా జో. ఈ చిత్రానికి హరిహరన్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని విజన్ సినిమా హౌస్ బ్యానర్ పై నిర్మించారు. సిద్ధు కుమార్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా 2023 లో నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ అయ్యి, ప్రేక్షకుల ఆదరణ పొందింది. జనవరి 15 నుండి ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, బాగా డబ్బున్న కుటుంబానికి ఏకైక వారసుడు జో (రియో రాజ్), చిన్నతనం నుండి జోకి ఐదుగురు మిత్రులు ఉంటారు. ఎక్కడికి అయినా ఆ ఫ్రెండ్స్ తో వెళ్తుంటాడు. జోకాలేజీలో, తన క్లాస్మేట్ గా కొత్తగా సుచి (మాళవిక మనోజ్) జాయిన్ అవుతుంది. కేరళకు చెందిన సుచి సెన్సిటివ్, మృదుస్వభావి కావడంతో ఆమెను ఇష్టపడతాడు. ఆమెను వేధిస్తున్న సీనియర్ నుండి సేవ్ చేస్తాడు. ఆ క్రమంలో ఇద్దరి ఆమధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీస్తుంది. కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
అయితే సుచి తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. విషయం తెలిసిన సుచి ‘జో’ కి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పి, తన తల్లిదండ్రులతో తమ పెళ్లి గురించి మాట్లాడమని చెబుతుంది. దాంతో ‘జో’ సుచి ఇంటికి వెళతాడు. వారి ప్రేమ గురించి తల్లిదండ్రులతో ప్రేమ, పెళ్లి గురించి ప్రయత్నిస్తాడు. కానీ వారి బంధువులు ‘జో’ ను కొడతారు. అది గోడవగా మారుతుంది. ఆ క్రమంలో సుచి తండ్రి క్రింద పడిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సుచి జో పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక జో చెప్పేది వినకుండా తనను ఇక మీదట కలవవద్దని చెప్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? వారిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించారా? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

సాయి పల్లవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉనడకపోయినా, ఆమె సోదరి పూజా కన్నన్ మాత్రం ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. పూజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సాయి పల్లవికి, తనకు, సంబంధించిన ఫోటోలను పూజ షేర్ చేస్తుంటుంది. ఆమె తన అక్క దారిలోనే సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 2021లో విడుదలైన కోలీవుడ్ మూవీ ‘చిత్తిరాయి సెవ్వానం’ అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. సముద్ర ఖని కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా తరువాత పూజాకన్నన్ సినిమాల పై దృష్టి పెట్టలేదు.
సాయి పల్లవి పెళ్లి విషయం గురించి బయటకు రాలేదు. అయితే పూజాకన్నన్ తాజాగా తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అతనితో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ” నా అందమైన లిల్ బటన్ నిస్వార్థంగా ప్రేమించడం, సహనం, ప్రేమలో స్థిరంగా ఉండటం మరియు మనోహరంగా ఉండటం నేర్పించాడు. ఈ వినీత్ నా సూర్య కిరణం. క్రైమ్లో నా పార్ట్నర్, ఇప్పుడు, నా లైఫ్ పార్ట్నర్” అంటూ రాసుకొచ్చింది.
ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే కొందరు నెటిజెన్లు మాత్రం అక్క కన్నా ముందే పెళ్లిచేసుకుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందులో తప్పు ఏం ఉందని ఆమె పై అలా కామెంట్స్ చేస్తున్నారు. అలా ఎంతోమంది పెళ్లి చేసుకున్నారు. ఈరోజుల్లో ఇలాంటివి సర్వసాధారణం.
ఈటీవీ శ్రీదేవి డ్రామ కంపెనీ షోకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ షోని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక ఈషో ద్వారా ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య గాజువాక లేడి కండక్టర్ ఝాన్సీ పల్సర్ బైక్ సాంగ్ కి డ్యాన్స్ వేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆమె డ్యాన్స్ వీడియోలు సోషల మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి రష్మి గౌతం యాంకర్ గా చేస్తున్నారు. వారం వారం కొత్త కొత్త థీమ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చే శ్రీదేవి డ్రామ కంపెనీలో హైపర్ ఆది, ఫైమా, సత్య వంటి పలువురు పాల్గొన్నారు. జనవరి 7 న ప్రసారం అయిన శ్రీదేవి డ్రామ కంపెనీలో ఎప్పటిలానే కొందరు సింగర్స్ పాటలు పాడారు. హైపర్ ఆది స్కిట్ వంటివి ఆడియెన్స్ ని అలరించాయి.
అయితే ఈ షోలో నైటీ థీమ్ డ్యాన్స్ లో సత్య, ఫైమా తదితరులు నైటీలు ధరించి వేసిన డ్యాన్స్ వీడియోకి మాత్రం యూట్యూబ్ లో నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. “కొరియోగ్రాఫర్ కు బుద్దిలేదు అనుకుంటే ఆడేవారికి సిగ్గు ఉండక్కర్లేదా. ఆ ఇంద్రజ కు రష్మీకి వేసి ఆడిస్తే ఇంకా మంచి రేటింగ్ వస్తుంది కదా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.




