అయోధ్య రామ మందిరంలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట శుభ సమయం కోసం యావత్ దేశం ఎంతగానో ఎదురు చూస్తోంది. ఈ కార్యక్రమానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో పాటు దేశంలోని ప్రముఖులు, సాధువులు, లక్షలాది భక్తులు తరలి రానున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసాదాలకు సైతం ప్రత్యేకత ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీరామ ప్రాణప్రతిష్ట సందర్భంగా పెట్టె ప్రసాదం పై అందరి దృష్టి పడింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట వేడుక కోసం 7 టన్నుల ‘రామ్ హల్వా’ అనే ప్రత్యేక ప్రసాదాన్ని సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. ఆ ప్రసాదాన్ని తయారు చేసే అదృష్టం పొందిన ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూవులు ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట జనవరి 22న జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, వీవీఐపీలు, అయోధ్యకు చేరుకోనున్నారు. ఇకపై అయోధ్య రామాలయం హిందూవులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం కానుంది. ఇక ప్రాణప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా 7 వేల కేజీల హల్వాను ప్రసాదంగా తయారు చేయనున్నారు. ఈ ప్రసాద తయారిని విష్ణు మనోహర్ దక్కించుకున్నారు. ఆయనెవరో కాదు దేశంలోనే ప్రముఖ చెఫ్. ఇప్పటికే విష్ణు మనోహర్ వంటలలో 12 వరల్డ్ రికార్డ్స్ ను సాధించారు.
విష్ణు మనోహర్ 1968లో ఫిబ్రవరి 18 నాగ్ పూర్ లోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కుకింగ్ షో యాంకర్ మరియు చెఫ్. విష్ణు మనోహర్కి నాగ్పూర్, పూణే, ఔరంగాబాద్, ఇండోర్, థానే మరియు కళ్యాణ్ నగరాల్లో రసోయ్ పేరుతో చైన్ రెస్టారెంట్ ఉంది. 53 గంటల పాటు వంట చేసి ప్రపంచ రికార్డు సాధించిన ఏకైక చెఫ్. 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ‘పొడవైన పరాటా’ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. 3 గంటల్లో 7000 కిలోల మహా మిసల్ను తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక చెఫ్ మనోహర్.
2018 డిసెంబర్ 20న భారతదేశంలో 3200 కిలోల వంకాయలతో వంట చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 3000 కిలోల కిచిడీని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ తరువాత ఒక కుండలో 5000 కిలోల కిచిడి చేసిన తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఎన్నో వంటల పుస్తకాలను కూడా రాశారు. తాజాగా 285 నిమిషాలలో అన్నంతో పాటు 75 రకాల డిషెస్ ను తయారు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు రామ మందిర ప్రసాదంను తయారు చేసే బాధ్యతను విష్ణు మనోహర్ తీసుకున్నారు. 7000 కిలోల హల్వాను తయారు చేయడం కోసం 1400 కేజీల భారీ కడాయిని నాగ్ పూర్ నుండి అయోధ్యకు తెప్పించారు. ఈ ప్రసాదాన్ని 1.5 లక్షల భక్తులకు పంచిపెట్టనున్నారు.
Also Read: బంగారు పాదరక్షలు మోస్తూ అయోధ్యకు పాదయాత్ర చేస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా.?

అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణప్రతిష్టకు శుభముహూర్తం ఆసన్నమైంది. రామ భక్తులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తరుణం కొన్ని రోజుల్లోరాబోతుంది. అయోధ్య రామ మందిరంను దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రామయ్యకు చాలా మంది భక్తులు భారీగా కానుకలను సమర్పించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రామయ్యకు బంగారు పాదుకలు సమర్పించడానికి చల్లా శ్రీనివాస శాస్త్రి పాదయాత్ర మొదలు పెట్టారు.
శ్రీనివాస శాస్త్రి హైదరాబాద్కు చెందినవారు. అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండర్ కూడా. రాముడు అయోధ్య నుండి లంకకు నడుచుకుంటూ వెళ్లిన మార్గంలో శ్రీనివాస శాస్త్రి నడుస్తున్నారు. రామేశ్వరంలో మొదలైన ఈ పాదయాత్ర, అరణ్య వాసంలో రాముడు తిరిగిన ప్రాంతాల గుండా వెళ్తున్నారు. దారిలో కంచి, శృంగేరీ, పూరీ, ద్వారకా పీఠాధీశుల ఆశీస్సులు తీసుకుని అయోధ్య వైపుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
64 ఏళ్ళ వయసు ఉన్న శ్రీనివాస శాస్త్రి తలపై బంగారు పాదుకలు పెట్టుకుని అయోధ్యకు ఎనిమిది వేల కిలోమీటర్ల నడుస్తూ, భక్తిని చాటుకుంటున్నారు. రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటికే ఐదు లక్షల ఇటుకలను దానం చేశారు. శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ. తన తండ్రి రామ భక్తుడని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం చూడాలనేది తన కల అని ఎప్పుడు చెప్పేవారు. తండ్రి కలను నెరవేర్చడం కోసం బంగారు పాదుకలతో పాదయాత్ర చేస్తూ, అయోధ్యకు వెళుతున్నానని చెప్పుకొచ్చారు.




ఒక రైతుగా సాధారణ జీవితం గడుపుతున్న తనకు అయోధ్య నుంచి ఆహ్వానం అందడంతో భావోద్వేగానికి లోనయ్యాడు అతడు. బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో 1992 డిసెంబర్ 2 వ తేదీ నుంచి 4, 5 రోజుల పాటు అయోధ్యలో ఉన్న మహ్మద్ హబీబ్ తనతో ఉన్న వారితో కలిసి కరసేవకుడిగా కొట్లాడాడు. ఆ సమయంలో మహ్మద్ హబీబ్ చేసిన పోరాటాన్ని గుర్తించిన అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్, శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని అతనికి ఆహ్వానం పంపించింది. హిందువుల ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి ఒక ముస్లిం కి ఆహ్వానం పంపడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. భారతదేశం ఎందుకు మత సామ్రాస్య దేశమో అర్థం అవుతుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు



రాజస్థాన్లోని జై సల్మేర్ లోని ధార్ ఎడారి కి సమీపంలో సిద్ధ తనోత్ రాయ్ మాత ఆలయం ఉంది. 1965,1971 యుద్ధాల సమయంలో జై సల్మేర్ లోని భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ అనేకసార్లు ఈ ఆలయం పై బాంబులు విసిరింది కానీ ఒక్కటి కూడా పేలలేదు. ఆ బాంబులు అన్నీ ఇండియన్ ఆర్మీ అదే ఆలయంలోని మ్యూజియంలో ఉంచింది. ఇలా ఈ ఆలయం పై పాకిస్తాన్ ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా వేలసార్లు ఇలాంటి దాడికి పాల్పడింది.

ఫ్రాన్స్లోని లూర్థు నగరంలో సహజమైన గుహలో ఉన్న మేరీమాత విగ్రహం తరహాలోనే ఇక్కడ కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉండడం వల్ల ఈ క్షేత్రం బాగా ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ మేరిమాత ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తుంటారు.
