జీవితం అందరికీ సులభంగా ఉండదు. కొంత మందికి అంత కష్టపడకుండానే అన్ని దొరుకుతాయి. కానీ కొంత మంది మాత్రం చిన్న విషయాలకు కూడా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. వాళ్లకి ఏది అంత ఈజీగా రాదు. కనీస అవసరాలకు కూడా చాలా మంది కష్టాలు పడుతున్నారు. చదువు. ఇది ఒక మనిషికి ఉండాల్సిన లక్షణం. కానీ చదువుకోడానికి కూడా ఇప్పటి కాలంలో కూడా ఇంకా కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అని వాళ్ళు తమకి కష్టాలు ఉన్నంత మాత్రాన చదువుని నిర్లక్ష్యం చేయట్లేదు. ఒకపక్క పనులు చేస్తూనే, మరొక పక్క చదువుకుంటున్నారు.

ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే జీవితంలో సాధించాలి అనే తపన ఉన్న వ్యక్తులు మన మధ్యలో కూడా ఎంత మంది ఉన్నారు అనే విషయం అర్థం అవుతుంది. నిజంగా ఒక మనిషి అనుకుంటే ఏదైనా చేయగలడు అనే విషయం గుర్తొస్తూ ఉంటుంది. వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా, చిప్పగిరి మండలం, బంటనహాలు గ్రామానికి చెందిన బోయ నవీన అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 509 మార్కులు సాధించింది. నవీన తల్లిదండ్రులు బోయ ఆంజనేయులు, వన్నూరమ్మల. నవీన తండ్రి ఒక వ్యవసాయ కూలీ. నవీన తల్లికి కిడ్నీ వ్యాధి ఉంది. ఒక్కరోజు పని చేస్తే తప్ప ఆరోజు కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి ఉండడంతో, నవీన కూడా కుటుంబ బాధ్యతని తీసుకుంది.
చిన్న వయసులోనే తన కుటుంబ బాధ్యతని తన భుజాలపై మోస్తూ, చదువుకుంది. మూడు రోజులు కూలీకి వెళ్ళేది. మరొక మూడు రోజులు స్కూల్ కి వెళ్లి చదువుకునేది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో నవీన చదివేది. నవీన ప్రతిభని పాఠశాల ఉపాధ్యాయులు గుర్తించారు. నవీన చదువుకోవడానికి కావాల్సినవన్నీ కూడా అందించారు. దాంతో నవీన కష్టపడి చదువుకొని పదవ తరగతిలో మంచి మార్కులు సాధించింది. ఏదైనా ఒక పని చేయాలి అనే సంకల్పం ఉన్న మనిషి ఏ పని అయినా చేయగలడు అనే మాటకి నిదర్శనంగా నిలిచింది. మనిషి తన కలని సాకారం చేసుకోవడానికి కుటుంబ నేపథ్యం, అవన్నీ కూడా అవసరం లేదు కేవలం ప్రతిభ, నమ్మకం ఉంటే చాలు అనే విషయాన్ని నిరూపించింది.
ALSO READ : SRH కెప్టెన్ తో మహేష్ బాబు…ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో తెలుసా.?









మే 2014న ఇండియాకి 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదరదాస్ మోడీ. ఆయన గుజరాత్ లో 1950లో జననం సెప్టెంబర్ 17న వాద్నగర్లో జన్మించారు. అక్కడే ఆయన సెకండరీ విద్యను కంప్లీట్ చేశారు. 8 సంవత్సరాల వయసులో ఆర్ఎస్ఎస్తో పరిచయం ఏర్పడింది. మోదీ పాఠశాల నుంచి వచ్చిన వెంటనే వాద్నగర్ స్టేషన్ దగ్గరలో ఉన్న తండ్రి టీ దుకాణానికి వెళ్లేవారు. టీ అమ్మడంలో తండ్రికి సహాయం చేసేవారు.
తన కుంటుంబం చిన్నతనంలో నిర్ణయించిన ప్రకారంగా మోడి 18 ఏళ్ల వయస్సులో, 17 ఏళ్ల వయసు ఉన్న జశోదాబెన్ మోడీని వాద్నగర్ కుల సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం అయిన వెంటనే ఆమెను, కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని తెలుస్తోంది. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన మోదీ కుటుంబాన్ని కలిశారు. మోడి తల్లి ఒత్తిడితో, జశోదాబెన్ వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మోడి ఇంటికి వచ్చింది. కానీ మోడి ఈ ఏర్పాటును వ్యతిరేకించాడు.
తన సిద్ధాంతాల ప్రకారమే తన జీవితాన్ని కొనసాగిస్తానని వెల్లడించాడు. అంతే కాకుండా జశోదాబెన్ చదువు కోవాలని ప్రోత్సహించాడు. ఆ తరువాత ఆమెను ఎప్పుడు భార్యగా వెల్లడించలేదు. ఆ తర్వాత 1985లో బీజేపీతో కలిశారు. నాలుగు దశాబ్దాల తర్వాత చట్టబద్ధంగా ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించాల్సి రావడం, ఆయన పెళ్లి గురించి గుజరాత్ రాజకీయాలలో గుసగుసలు వినిపించడంతో జశోదాబెన్ ని భార్యగా బహిరంగంగా ఒప్పుకున్నారు. 2014 లో ఎన్నికల అఫిడవిట్లో వివాహ విషయాన్ని ప్రస్తావించడంతో అందరికీ తెలిసింది. జశోదాబెన్ మోడి ఒక రిటైర్డ్ టీచర్.







